Connect with us

Movie News

నిత్యం నవ్వించే టాలీవుడ్ కమెడియన్స్ జీవితాల్లో ఇంత విషాదమా..?

Published

on

లేడీ కమెడియన్స్…చెప్పడానికి ఎంతో సింపుల్ గా ఉన్న కూడా సినిమాల్లో వీరి ప్రాముఖ్యత ఏంటో ముఖ్యమైనది. ఒక రేలంగి రమాప్రభ, కోవై సరళ బ్రహ్మానందం. ఇలా కామెడి పండించాలంటే లేడీ కమెడియన్స్ పాత్ర ఎంతో మంచి టైమింగ్ డైలాగు డెలివరీ బాడీ లాంగ్వేజ్ ముఖ్యం. అలా టాలీవుడ్ లో నే సూర్యకాంతం నుండి నేటి గీత సింగ్ వరకు పేరు గడించిన కమెడియన్స్ ఉన్నారు. అయితే వీరు కమెడియన్స్ గా మాత్రమే మనకు తెలుసు ..కామెడి పండించే వీరు నవ్వుల వెనక బయట ప్రపంచానికి తెలియని విషాదం దాగి ఉంది. కొంత మంది ఆలా జీవితాన్ని ఎంతో గడిస్తున్న పెళ్లి పిల్లలు సంసారం లాంటివి లేకుండా పడుతున్న కష్టాలేంటో ఒకసారి చూద్దాం.

ఈ లిస్ట్ లో మొదటగా చెప్పుకోవాల్సింది సౌత్ ఇండియాలోనే మంచి కమెడియన్ గా పేరు ఉన్న కోవై సరళ గురించి. బ్రహ్మానందంతో తన కాంబినేషన్ ప్రతిదీ సూపర్ డూపర్ హిట్టే. 1990 సంవత్సరం నుండి బాగా పాపులరైన కోవై సరళ కుటుంబం కోసం పెళ్లి చేసుకోలేదు. తన తోడబుట్టిన వారిని లైఫ్ లో సెటిల్ చేయడం కోసం మొదటి నుండి కష్టపడుతూ అందరికి ఒక దారి చూపించింది. కానీ తాను మాత్రం పెళ్లి చేసుకోకుండా ప్రస్తుతం ఒంటరిగా ఉంటుంది. మొన్నీమధ్య ఆసుపత్రిలో చేరితే చూసే దిక్కు లేకపోవడంతో బోరున విలపించింది.

Advertisement

ఇక మరొక హాస్య నటి శ్రీలక్ష్మి. పేరుకే హీరో అమరనాథ్ కూతురు పూట గడవడం కోసం సినిమాల్లో చేరింది. కాస్త కుదుట పడుతున్న క్రమంలో తండ్రిని తర్వాత ముగ్గురు తోబుట్టువులను ఒక్కొక్కరిగా కోల్పోయినా గుండె నిబ్బరంతో కుటుంబాన్ని సాకింది. సోదరుడు రాజేష్ హీరోగా నిలదిక్కుకుతూ చనిపోతే కన్నీళ్లు బయటపడకుండా షూటింగ్ పూర్తి చేసి ఇంటికి వెళ్లి గుండె పగిలేలా రోదించింది. తానూ మాత్రం అందరి బాధ్యతలని తీర్చి పెళ్లి లేకుండా ఒంటరిగా జీవిస్తుంది.

నేటి కామెడియన్ గీత సింగ్ పరిస్థితి అంతే.. సినిమాల్లోకి వచ్చి కాస్త నిలదొక్కుకుంటున్న సమయంలో తోడబుట్టిన ఒక్కగానొక్క సోదరుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. హాస్యం పండించడం అలవాటయ్యింది కాబట్టి మీడియా ముందు నవ్వుతుంది కానీ తన జీవితంలో ఎంతో ఎదురీత ఉంది. పెళ్లి చేసుకోకుండా సోదరుడి కుటుంబాన్ని అన్ని తానై చూసుకుంటుంది. పిల్లలకు తండ్రి లేని లోటు తీర్చుతుంది. అలాగే మొన్నీ మధ్య ఆమె కస్టపడి చిట్టీలు వేసి దాచుకున్న డబ్బు కూడా కోల్పోయి పోలీస్ స్టేషన్ మెట్లెక్కేంది. పైసా పైసా కూడపెడితే అవి కూడా పోయాయి అంటూ కన్నీళ్లు పెట్టుంది.

ఇక ఈ ముగ్గురు కమెడియన్స్ పెళ్లి చేసుకోకుండా కష్టాలు పడుతుంటే పెళ్లి చేసుకొని విడిపోయి మరికొంత మంది కమెడియన్స్ జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. కమెడియన్ రమాప్రభ, జయలలిత, యాంకర్ కం కామెడియన్ ఝాన్సీ, వేధింపులు ఎదుర్కొని, విడాకులు తీసుకొని ఆస్తులు పోగొట్టుకొని కష్టాలు పడుతున్నారు. ఇలా ఒక్కో కమెడియన్ జీవితంలో ఒక్కో విషాదం… వారి నవ్వుల వెనక కనిపించని వారి అంతరంగం ఉంది. ఇవండీ పెళ్లి చేసుకోక మరియు చేసుకున్న కష్టాలు పడుతున్న హాస్య నటీమణుల జీవితం

Advertisement

Continue Reading
Advertisement

Featured

Prabhas: ప్రభాస్ కి ఫ్రస్టేషన్ వస్తే అలా బిహేవ్ చేస్తారా.. డార్లింగ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా?

Published

on

Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ అనంతరం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఎప్పుడు చూసినా చాలా కూల్ గానే కనిపిస్తారు. ఈయన ఎప్పుడు కోప్పడిన సందర్భాలు కూడా లేవని చెప్పాలి. అయితే ప్రభాస్ ఏదైనా ఫ్రస్టేషన్లో ఉన్నప్పుడు లేదంటే సినిమాల విషయంలో కాస్త కంగారు పడినప్పుడు ఎవరిని కూడా కలవరట.

ప్రభాస్ ఏ విషయం గురించైనా కాస్త ఆలోచనలో ఉండి ఫ్రస్టేషన్ వస్తే కనుక తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా బయటకు పంపించేసి తలుపు గది వేసుకొని ఒక దమ్ము కొట్టేస్తారట అనంతరం తనకు నచ్చిన ఫుడ్ తిని ప్రశాంతంగా నిద్రపోతారని తెలుస్తుంది. ఇలా నిద్రపోయి లేచిన తర్వాత ఆయన ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయి ఫ్రెష్ మైండ్ తో బయటకు వస్తారట.

Advertisement

ఇష్టమైన ఫుడ్ తింటారు..
ఇలా ప్రభాస్ ఫ్రస్టేషన్ లో ఇలా వ్యవహరిస్తారని విషయం తెలిసి ప్రభాస్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ కోప్పడే సందర్భాలు చాలా తక్కువ అని ఆయనతో ఉన్నవాళ్లు చెబుతుంటారు ఆయన ప్రతి ఒక్కరితో చాలా సరదాగా గడుపుతూ ఉంటారని 99% తనకు కోపం అనేది రాదని తనతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు పలు సందర్భాలలో వెల్లడించారు.

Advertisement
Continue Reading

Featured

Nikhil siddarth: కొడుకు పుట్టిన తర్వాత ఆ అలవాటు మానుకున్నాను.. నిఖిల్ కామెంట్స్ వైరల్!

Published

on

Nikhil siddarth: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నటువంటి నటుడు నిఖిల్ సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన అనంతరం పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే ఈయన స్వయంబు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా షూటింగ్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈయన స్వయంబు సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.

త్వరలోనే స్వయంభూ సినిమా విడుదల తేదీ ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా తన కుమారుడికి సంబంధించిన పలు విషయాలను కూడా నిఖిల్ అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల తనకు కుమారుడు జన్మించిన సంగతి మనకు తెలిసిందే. తన కుమారుడు జన్మించారనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా తన కొడుకు బారసాల వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.

Advertisement

పార్టీలకు వెళ్లడం మానుకున్న..
ఇలా బారసాల వేడుకలను నిర్వహించిన నిఖిల్ దంపతులు తమ కుమారుడికి ఏ పేరు పెట్టారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు అయితే తన కుమారుడికి ధీర సిద్ధార్థ్ అనే పేరు పెట్టినట్లు నిఖిల్ వెల్లడించారు. అయితే తన కొడుకు పుట్టిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. పిల్లలు సరైన వాతావరణంలో పెరగాలి అందుకు మనం కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తనకు కొడుకు పుట్టిన తర్వాత నేను పార్టీలకు వెళ్లడం మానుకున్నానని తెలిపారు. వారంలో ఏదో ఒక రోజు తాను పార్టీకి వెళ్లే వాడినని ఇప్పుడు ఆ అలవాటు మార్చుకున్నాను అంటూ నిఖిల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: ఈ చిన్న పని చేస్తే చాలు ప్రభాస్ సలార్ సినిమా బైక్ గెలుచుకోవచ్చు.. ఎలాగంటే?

Published

on

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది.

ఇక ఈ సినిమా థియేటర్లలోను అదేవిధంగా డిజిటల్ మీడియాలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే డిజిటల్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా సాటిలైట్ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ సాయంత్రం 5:30కు స్టార్ మాలో ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే.

ఇలా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో సలార్ మేకర్స్ అద్భుతమైనటువంటి ఆఫర్ అభిమానులకు కల్పించారు. ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు మనం సమాధానాలు చెబితే చాలు ఈ సినిమాలో ప్రభాస్ నడిపినటువంటి ఐకానిక్ మోటార్ సైకిల్ బైక్ మీ సొంతం చేసుకోవచ్చని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Advertisement

క్విజ్ కాంటెస్ట్..
ఇలా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉండాలి అలాగే వారు పెట్టే కొన్ని కండిషన్స్ కూడా వర్తిస్తాయని వెల్లడించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి బైక్ మీ సొంతం చేసుకోవచ్చు అయితే ఇలా మేకర్ ప్లాన్ చేశారు అంటే ఈ ఎఫెక్ట్ టి ఆర్ పి రేటింగ్ పై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్లాన్స్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!