క్రొత్త సినిమా ఏది విడుదలైనా ఆ సినిమా బాగుందనో.. బాగాలేదనో చకచకా చిత్ర సమీక్షలు రాసేస్తుంటారు. ఆ సమీక్షల ఆధారంగానే చాలామంది ప్రేక్షకులు సినిమాలకు వెళ్తుంటారు. ఇక లేటెస్ట్ మూవీ రివ్యూలను రాసే రైటర్స్ కూడా ఆ సినిమాలను చూసి బాగుంటే బాగుందని, బాగాలేకపోతే బాగోలేదని రాస్తారు. కానీ., కొందరు రైటర్స్ మాత్రం డబ్బుకి ఆశపడి.. బాగోలేని సినిమాని కూడా బావుంది అని రాస్తారు. సినిమా హీరోలు, దర్శక నిర్మాతలు మాత్రం మా సినిమా బాగున్నప్పటికీ.. బాగోలేదని సమీక్ష రాయడం వల్లే మా సినిమాకి కలెక్షన్స్ రావడం లేదంటూ రివ్యూలు రాసే రైటర్స్ మీద మండి పడుతుంటారు. సినిమా ఇండ్రస్ట్రీలో ఇలాంటి సంఘటనలు జరుగుతుండటం సర్వ సాధారణమైన విషయమే.!
ఇక అసలు విషయానికి వస్తే.. తాజాగా ప్రముఖ టాలీవుడ్ సింగర్ మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె కూడా తమ సినిమా బాగోలేదని రాశారంటూ రివ్యూ రైటర్స్ మీద ఫైర్ అయ్యాడు. ఎందుకంటే మన మ్యూజిక్ డైరెక్టర్ గారు.. ఆ సినిమాకి పెట్టుబడి కూడా పెట్టారు. గాయకునిగా, సంగీత దర్శకుడిగా… ఇలా తను ప్రవేశించిన ప్రతీ విభాగం లోనూ మంచి గుర్తింపు ఏర్పరుచుకున్న రఘు కుంచె తాజాగా సినిమా ఆర్టిస్ట్ గా మారడంతో పాటుగా “47 డేస్” అనే సినిమాకి వన్ ఆఫ్ ద పార్టనర్ గా ఉన్నాడు. “47 డేస్” మూవీ లేటెస్ట్ గా నెట్ ఫ్లిక్స్లో విడుదలయ్యింది. దురదృష్టం ఏమిటంటే.. నెట్ ఫ్లిక్స్లో ఈ చిత్రానికి కనీసం యావరేజ్ టాక్ కూడా రాలేదు.
ఇక ఆ సినిమాకి సమీక్ష రాసిన రైటర్స్ పూర్ రేటింగ్స్ ఇవ్వడంతో ఆగ్రహించిన రఘు కుంచె.. “నెట్ ఫ్లిక్స్ లో ఉన్న 10 రూపాయల సినిమాలతో పోల్చి తన సినిమాను బాగోలేదని రివ్యూ రాయడం చాలా దారుణమని.. మా మూవీ రిలీజైన తర్వాత రివ్యూ ఎఫెక్ట్ కారణంగా మా సినిమా అప్పటికే నష్టాలలో ముంచేసింది” అని రివ్యూ రైటర్స్ పై మండి పడ్డారు. సినిమాను బ్రతకనివ్వండి, మీరు బతకండి. నా సినిమా కళాఖండమని నేనెక్కడా చెప్పలేదు. కానీ మా సినిమా 1,1.5 రేటెడ్ ఫిల్మ్గా రేటింగ్ ఇచ్చిన రైటర్ మేధావుల కోసం నేను ఈరోజు మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నాను. ఇండస్ట్రీలో ఏ రోజు ఎవరెవరు ఏ సంక నాకుతున్నారో ఆ లొసుగులన్నీ ఇండస్ట్రీలో ఉన్న ఎవరన్న అందరికీ తెలుసు. సీనియర్ జర్నలిస్ట్ లందరికీ ఇదే నా విజ్ణప్తి. నిజాయితీగా సినీ మీడియాలో మీరందరూ ఒక సినిమా మొదలైన దగ్గర నుంచి ఆ సినిమాను ఎలా ప్రమోట్ చేయాలి, ప్రేక్షకుల్లోకి ఎలా తీసుకెళ్లాలి, బిజినెస్ సోర్స్ ఏంటి ఎలా హైప్ తీసుకురావాలి.? అనే విషయాలను ఎంతో మనసు పెట్టి నిర్మాత గైడ్ చేస్తూ నిజాయితీగా సినిమా కోసం పని చేస్తారన్న విషయాన్ని మీరు గుర్తించాలి” అని ఆవేదన చెందాడు రఘు కుంచె.
Pawan Kalyan: టీడీపీ, బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో నిర్వహించిన ప్రజాగళం భారీ సభను నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే.ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాబోయే కురుక్షేత్ర సమరం తర్వాత ఏపీలో రాబోయేది రామ రాజ్యమేనని తెలిపారు. ప్రస్తుతం రావణాసురు పాలన సాగుతుందని త్వరలోనే రామరాజ్యం వస్తుందని వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి అధికారం డబ్బు అండతో విర్రవీగిపోతున్నారని పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి రేటు పూర్తిగా పడిపోయిందని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ ఒక సంక్షేమం లేదని అభివృద్ధి జరగలేదని నిరుద్యోగం పెరిగిపోయిందని తెలిపారు. ఈ కురుక్షేత్ర యుద్ధం తర్వాత రామరాజ్యం రాబోతుందని తెలిపారు. ఇక దేశమంతా డిజిటల్ రంగంలో ముందుకు దూసుకుపోతూ ఉండగా జగన్మోహన్ రెడ్డి మాత్రం మద్యం దుకాణాల వద్ద ఇంకా నగదు బదిలీ చేపడుతూ భారీగా దోచుకుంటున్నారని తెలిపారు. ఈయన ఒక సారా వ్యాపారి అంటూ పవన్ ఎద్దేవా చేశారు.
Advertisement
డ్రగ్స్ రాజధాని.. కేవలం మద్యం విషయంలో మాత్రమే కాదు ఇసుక తవ్వకాలలో కూడా జగన్ బినామీలు సుమారు 40 వేల కోట్ల వరకు దోచుకున్నారని పవన్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ రాజధానిగా మారిపోయింది అంటూ జగన్ పరిపాలనపై పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు కురిపిస్తూ చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వచ్చే ఎన్నికలలో కచ్చితంగా ఎన్డీఏ కూటమి గెలుస్తుంది అంటూ ఈ సందర్భంగా పవన్ తమ గెలుపు పట్ల ధీమా వ్యక్తం చేశారు.
AP politics: ప్రస్తుతం జరగబోయే ఏపీ ఎన్నికలు ఎంతో రసవత్తరంగ మారాయి. జగన్ ఒక్కడే ఒక వైపు ఉండగా మరోవైపు జనసేన టిడిపి బిజెపి కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి రాబోతున్నారు. ఇలా ఈ పార్టీలన్నీ పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలోకి దిగబోతున్నటువంటి తరుణంలో మొదటిసారి చిలకలూరిపేట వద్ద ప్రజాగళం అనే పేరిట భారీ సభను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి పై ఎలాంటి విమర్శలు చేస్తారో అన్న విషయంపై అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు .అయితే ఈ సభలో మోడీ చేసిన వ్యాఖ్యల గురించి ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ సభలో మోడీ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలోని మంత్రులు అవినీతికి పాల్పడ్డారు అంటూ ఈయన తెలిపారు. ఎక్కడ కూడా జగన్ గురించి మాట్లాడలేదు అలాగే రాజధానుల ప్రస్తావన తీసుకురాలేదు పోలవరం గురించి ప్రశ్నించలేదు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జగన్ ప్రభుత్వంలోని మంత్రుల గురించి మాట్లాడారే తప్ప జగన్ గురించి ఎక్కడా కూడా మాట్లాడలేదు అలాగే తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేయాలి అని కూడా ఎక్కడా చెప్పలేదు. ఎన్డీఏకి ఓట్లు వేసి గెలిపించండి అని మాత్రమే కోరారని నాగేశ్వరరావు తెలిపారు. ఇక్కడ మోడీ గారికి చంద్రబాబు నాయుడుని గెలిపించడమే అజెండా కాదని ఈయన తెలిపారు.
Advertisement
జగన్ పై ఎక్కడ విమర్శలు చేయలేదు.. రేపు ఎన్నికలు జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు అలాగే జగన్ పార్టీకి చెందిన ఎంపీలు కూడా మోడీకి అవసరం కనుక ఈయన ఎక్కడ కూడా జగన్ కు ఓటు వేయొద్దని చంద్రబాబుకు ఓటు వేసి గెలిపించండని చెప్పలేదు. చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయాలి అనే అజెండా కనుక ఉండి ఉంటే ఈ సభలో జగన్ పై విమర్శలు చేసేవారు కానీ మోడీ ఎక్కడ కూడా అలా ప్రసంగించలేదు అంటూ ప్రొఫెసర్ నాగేశ్వరరావు తన అనాలసిస్ ద్వారా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
AP politics: ఏపీలో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత పొలిటికల్ హీట్ మరింత పెరిగిపోయింది. వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి పొత్తులు లేకుండా ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు కానీ మరోవైపు టిడిపి జనసేన బిజెపి కూటమిగా ఎన్నికల బరిలోకి రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా భారీ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పోటీకి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.
ఇక ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఈయన ప్రాంతాలవారీగా సిద్ధం సభలను ఏర్పాటు చేసి నాయకులలోను కార్యకర్తలను ఫుల్ జోష్ నింపారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రచార కార్యక్రమాలలో భాగంగా సరికొత్త వ్యూహాలను రచిస్తూ జనాలలోకి వెళ్ళబోతున్నారని తెలుస్తుంది. ఈయన ఇప్పటికే ఏ నియోజకవర్గం లో ఎన్ని రోజులు పర్యటించాలి ఎక్కడ బహిరంగ సభలు నిర్వహించాలి ఎక్కడ రోడ్డు షో చేయాలి అనే విషయాల గురించి పక్కాగా ప్లాన్ సిద్ధం చేశారని తెలుస్తోంది.
2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసి 151 స్థానాలలో విజయకేతనం ఎగురు వేసినటువంటి వైసీపీ పార్టీ ఈసారి మాత్రం వై నాట్ 175 అనే నినాదంతో ఎన్నికల బరిలోకి దిగబోతోంది తాము ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో 99% అమలు పరిచాము. అందుకే వై నాట్ 175 అనే ధీమాతో జగన్ ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. 2019 ఎన్నికల ఫలితాలను ఈసారి కూడా రిపీట్ చేయాలని ఈయన తన అభ్యర్థులను కార్యకర్తలను కూడా సిద్ధం చేస్తున్నారు.
Advertisement
వై నాట్ 175 ఇలా వై నాట్ 175 అంటూ ఎన్నికలకు జగన్మోహన్ రెడ్డి సిద్ధం కాగా మరోవైపు కూటమిగా అన్ని పార్టీలు ఏకమై జగన్మోహన్ రెడ్డి పై యుద్ధానికి మేము సిద్ధం అంటున్నారు. మరి ఈ ఐదేళ్ల ప్రజా పాలనకు జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తున్నారు ఏంటి అనేది తెలియాల్సి ఉంది.