Connect with us

Featured

తెలుగు హీరోల భార్యలు తెచ్చిన కట్నాలు ఎంతో తెలుసా.?

Published

on

“కట్నం తీసుకున్న వాడు గాడిద” అన్నారు పెద్దలు. అది నాటి మాట.. కానీ., కట్నం తీసుకోవడం సంప్రదాయంతో పాటు ఫ్యాషన్ అయిపోయిందనడం నేటి మాట. సామాన్యుల సంగతి ప్రక్కన పెడితే.. కోట్లు సంపాదించే స్టార్ హీరోలు కూడా తమ పెళ్ళికి కట్నంగా కోట్లే తీసుకుంటున్నారనడానికి ఉదాహరణగా క్రింది వివరాలను మీరే చదవండి.

యంగ్ హీరో నిఖిల్

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఈమధ్యనే పల్లవి వర్మ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో క్వారంటైన్ లో వీరి పెళ్లి చాలా సింపుల్ గా జరిగడం విశేషం. అయితే నిఖిల్ కు కట్నంగా పల్లవి కుటుంబం 8 కోట్ల వరకూ ముట్టజెప్పారని టాలీవుడ్ సమాచారం.

హీరో ఆది

Advertisement

టాలీవుడ్ డైలాగ్ కింగ్ సాయికుమార్ కొడుకు ఆది అరుణ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అరుణ ఆదికి రూ.2 కోట్లు కట్నం ఇచ్చిందని సమాచారం.

గోల్ మాల్ హీరో గోపిచంద్

గోపీచంద్ హీరో శ్రీకాంత్ మేనకోడలను పెళ్ళి చేసుకున్నాడు. ఆమె పేరు రేష్మ. రేష్మ దగ్గర నుండి స్థిరాస్తుల రూపంలో మొత్తం రూ.8 కోట్లు కట్నంగా తీసుకున్నట్టు సమాచారం.

నేచురల్ స్టార్ నాని

ఫ్యామిలీ మరియు యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో నానిది ప్రేమ వివాహం అనే సంగతి అందరికీ తెలిసిందే. అమ్మాయి పేరు అంజనా. లవ్ మ్యారేజ్ ఐనా సరే నాని కట్నంగా రూ.3 కోట్లు వసూల్ చేసాడని సమాచారం.

అల్లరి హీరో నరేష్

Advertisement

తను హీరోగా నటించిన అన్ని సినిమాలలోనూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన హీరో అల్లరి నరేష్. ఈథాని విరూప అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని కట్నం కింద రూ.5 కోట్ల రూపాయిలను తన అకౌంట్లో వేసుకున్నట్టు సమాచారం.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్నేహ రెడ్డితో ప్రేమ వివాహం చేసుకొని ప్రస్తుతానికి ఇద్దరి పిల్లల తండ్రి కూడా అయ్యాడు. స్నేహ తండ్రి రూలింగ్ పార్టీ MLA కావడంతో అల్లుడికి కట్నం క్రింద రూ.100 కోట్లదాకా ముట్టచేప్పినట్టు సమాచారం.

టాలీవుడ్ మగధీర రామ్ చరణ్

మెగా స్టార్ చిరంజీవి వారసుడు రాంచరణ్ తేజ, ఉన్నతమైన కుటుంబానికి చెందిన ఉపాసన అనే
అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. ఈ అమ్మాయి అపోలో హాస్పిటల్స్ యజమాని కావడం విశేషం. ఈమె తన పెళ్ళి కట్నంగా స్థిరాస్తి కాకుండా రూ.350 కోట్లు ఇచ్చిందని సమాచారం.

యంగ్ టైగర్ జూనియర్ NTR

Advertisement

యంగ్ టైగర్ NTR ది పెద్దలు కుదురిచ్చిన పెళ్లి కావడంతో రంగరంగ వైభవంగా ఫ్యాన్స్ అందరి మధ్యా రూ.18 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకున్నాడు. ఇఠ జూనియర్ ఎన్టీయార్ సతీమణి ప్రణీత కట్నంగా రూ.200 కోట్లు ఇచ్చిందని సమాచారం.

ప్రిన్స్ మహేష్ బాబు

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఓకె అనాలే కానీ ఎన్ని కోట్లైనా ఇచ్చి పెళ్లి చేసుకోవడానికి యువతరం అమ్మాయిలు క్యూ కడతారంటే అతిశయోక్తి కాదేమో.! కానీ., ఆ అదృష్టం హీరోయిన్ నమ్రతకి దక్కింది. వంశీ చిత్రంలో తనతో నటించిన నమ్రతని ఇష్టపడిన ప్రిన్స్ మహేష్ బాబు నమ్రతను పెళ్లి చేసుకున్నాడు. ఏమి ఆశించకపోయినా మహేష్ తన భార్య నమ్రత మహేష్ బాబుకి రూ.2000 కోట్లు కట్నంగా ఇచ్చిందని సమాచారం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

పవన్ కు వున్న క్రేజ్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు చెప్పనవసరం లేదు. ఇక పవన్ పెళ్లి విషయానికి వస్తే తన మొదటి భార్య పేరు నందిని. ఆమెను ఎప్పుడు, ఎక్కడ పెళ్లి చేసుకున్నాడో ఎవరికీ తెలీదు కానీ అప్పటి లెక్కల ప్రకారం రూ.10 లక్షలు కట్నం తీసుకున్న పవన్ ఆ తర్వాత ఆమెతో విడాకులు సెటిల్మెంట్ కోసం రూ.30 లక్షలు ఖర్చు పెట్టాడు. కొంతకాలానికి తనతో కలిసి బద్రి చిత్రంలో నటించిన రేణు దేశాయ్ ను సింపుల్ గానే పెళ్ళి చేసుకుని పిల్లలు పుట్టిన తర్వాత ఆమెతో విడాకుల కోసం రూ. 40 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. పవన్ కళ్యాణ్ ఒక రూపాయి కూడా కట్నం తీసుకోలేదు విడిపోయాక తానే ఎదురు కట్నం ఇచ్చాడు That is పవన్ కళ్యాణ్.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Prabhas: ప్రభాస్ కి ఫ్రస్టేషన్ వస్తే అలా బిహేవ్ చేస్తారా.. డార్లింగ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా?

Published

on

Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ అనంతరం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఎప్పుడు చూసినా చాలా కూల్ గానే కనిపిస్తారు. ఈయన ఎప్పుడు కోప్పడిన సందర్భాలు కూడా లేవని చెప్పాలి. అయితే ప్రభాస్ ఏదైనా ఫ్రస్టేషన్లో ఉన్నప్పుడు లేదంటే సినిమాల విషయంలో కాస్త కంగారు పడినప్పుడు ఎవరిని కూడా కలవరట.

ప్రభాస్ ఏ విషయం గురించైనా కాస్త ఆలోచనలో ఉండి ఫ్రస్టేషన్ వస్తే కనుక తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా బయటకు పంపించేసి తలుపు గది వేసుకొని ఒక దమ్ము కొట్టేస్తారట అనంతరం తనకు నచ్చిన ఫుడ్ తిని ప్రశాంతంగా నిద్రపోతారని తెలుస్తుంది. ఇలా నిద్రపోయి లేచిన తర్వాత ఆయన ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయి ఫ్రెష్ మైండ్ తో బయటకు వస్తారట.

Advertisement

ఇష్టమైన ఫుడ్ తింటారు..
ఇలా ప్రభాస్ ఫ్రస్టేషన్ లో ఇలా వ్యవహరిస్తారని విషయం తెలిసి ప్రభాస్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ కోప్పడే సందర్భాలు చాలా తక్కువ అని ఆయనతో ఉన్నవాళ్లు చెబుతుంటారు ఆయన ప్రతి ఒక్కరితో చాలా సరదాగా గడుపుతూ ఉంటారని 99% తనకు కోపం అనేది రాదని తనతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు పలు సందర్భాలలో వెల్లడించారు.

Advertisement
Continue Reading

Featured

Nikhil siddarth: కొడుకు పుట్టిన తర్వాత ఆ అలవాటు మానుకున్నాను.. నిఖిల్ కామెంట్స్ వైరల్!

Published

on

Nikhil siddarth: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నటువంటి నటుడు నిఖిల్ సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన అనంతరం పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే ఈయన స్వయంబు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా షూటింగ్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈయన స్వయంబు సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.

త్వరలోనే స్వయంభూ సినిమా విడుదల తేదీ ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా తన కుమారుడికి సంబంధించిన పలు విషయాలను కూడా నిఖిల్ అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల తనకు కుమారుడు జన్మించిన సంగతి మనకు తెలిసిందే. తన కుమారుడు జన్మించారనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా తన కొడుకు బారసాల వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.

Advertisement

పార్టీలకు వెళ్లడం మానుకున్న..
ఇలా బారసాల వేడుకలను నిర్వహించిన నిఖిల్ దంపతులు తమ కుమారుడికి ఏ పేరు పెట్టారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు అయితే తన కుమారుడికి ధీర సిద్ధార్థ్ అనే పేరు పెట్టినట్లు నిఖిల్ వెల్లడించారు. అయితే తన కొడుకు పుట్టిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. పిల్లలు సరైన వాతావరణంలో పెరగాలి అందుకు మనం కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తనకు కొడుకు పుట్టిన తర్వాత నేను పార్టీలకు వెళ్లడం మానుకున్నానని తెలిపారు. వారంలో ఏదో ఒక రోజు తాను పార్టీకి వెళ్లే వాడినని ఇప్పుడు ఆ అలవాటు మార్చుకున్నాను అంటూ నిఖిల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: ఈ చిన్న పని చేస్తే చాలు ప్రభాస్ సలార్ సినిమా బైక్ గెలుచుకోవచ్చు.. ఎలాగంటే?

Published

on

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది.

ఇక ఈ సినిమా థియేటర్లలోను అదేవిధంగా డిజిటల్ మీడియాలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే డిజిటల్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా సాటిలైట్ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ సాయంత్రం 5:30కు స్టార్ మాలో ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే.

ఇలా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో సలార్ మేకర్స్ అద్భుతమైనటువంటి ఆఫర్ అభిమానులకు కల్పించారు. ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు మనం సమాధానాలు చెబితే చాలు ఈ సినిమాలో ప్రభాస్ నడిపినటువంటి ఐకానిక్ మోటార్ సైకిల్ బైక్ మీ సొంతం చేసుకోవచ్చని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Advertisement

క్విజ్ కాంటెస్ట్..
ఇలా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉండాలి అలాగే వారు పెట్టే కొన్ని కండిషన్స్ కూడా వర్తిస్తాయని వెల్లడించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి బైక్ మీ సొంతం చేసుకోవచ్చు అయితే ఇలా మేకర్ ప్లాన్ చేశారు అంటే ఈ ఎఫెక్ట్ టి ఆర్ పి రేటింగ్ పై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్లాన్స్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!