Connect with us

Featured

వనితా విజయ్ కుమార్ 3వ భర్త గురించి ఆమె చెప్పినవి అన్ని అబద్దలే.. ఇదిగో సాక్ష్యం..!!

Published

on

సీనియర్ నటుడు విజయ్ కుమార్ – మంజుల కుమార్తె వనితా విజయ్ కుమార్ కు ఆల్ రెడీ పెళ్ళై ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారిలో ఇద్దరు కుమార్తెలున్నారు. నటి వనిత విజయ్ కుమార్‌ కు గతంలో ఆకాశ్, ఆనంద్ జే రాజన్‌లతో 2 పెళ్ళిళ్ళు జరిగాయి. కొంతకాలం రాబర్ట్ అనే వ్యక్తితోనూ డేటింగ్ చేసినట్టు కోలీవుడ్ సమాచారం. ఇంకా తన తండ్రి విజయ్ కుమార్‌ తో జరిగిన ఆస్తి గొడవల్లోనూ ఆమె పేరు ఎక్కువగా వినిపించింది.

ఈమె నటించింది కొన్ని సినిమాలే అయినా వివాదాస్పదమైన అంశాలతోనే ఎక్కువ గుర్తింపు సంపాదించింది. తాజాగా వనితా విజయ్ కుమార్ 3వ పెళ్ళి చేసుకుని సంచలనం సృష్టించింది. వనితా పెళ్ళాడిన 3వ భర్త పేరు పీటర్ పాల్. ప్రముఖ తమిళ ఫిల్మ్ మేకర్. అయితే, ఈయనకు ఇదివరకే పెళ్ళవడంతో పీటర్ పాల్ మొదటి భార్య ఎలిజబెత్ ఇపుడు చెన్నై, వడపళని పోలీసులకు “తన నుంచి విడాకులు తీసుకోకుండానే పీటర్ పాల్ మరో పెళ్లి చేసుకున్నాడని, అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, తమకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, తాము గత ఏడేళ్లుగా విడివిడిగానే ఉంటున్నామని” కంప్లైంట్ ఇచ్చింది. తమిళ నటి వనితా విజయ్ కుమార్, పీటర్ పాల్ ల పెళ్లి జరిగి వారమౌతున్నా ఇప్పటికీ ఈ గొడవలు జరుగుతూనే ఉన్నాయి.

పీటర్ మొదటి భార్య ఎలిజిబిత్ పోలీసు కంప్లైంట్ ఇవ్వడంతో వనిత కూడా చాలా సీరియస్ గా “ఇన్ని రోజులు లేనిది ఇప్పుడే మొగుడు గుర్తొచ్చాడా.?” అంటూ ఘాటుగానే స్పందించింది. ఎలిజబెత్ కేవలం డబ్బులు గుంజడానికి ఈ డ్రామా ఆడుతుందని మండిపడింది వనిత విజయ్ కుమార్. ఇదిలా వుండగా.. ఇప్పుడు మరో వివాదంలో కూడా వనితా పేరే సోషల్ మీడియాలో షికారు చేస్తుంది. తాజాగా తన 3వ భర్త పీటర్ పాల్ గురించి వనిత కొన్ని అబద్ధాలు చెప్పిందన్న గాసిప్స్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. గత 2 పెళ్లిళ్లు విఫలమైన తర్వాత నటి వనిత విజయకుమార్ ప్రముఖ విజువల్ ఎఫెక్ట్స్ డైరెక్టర్ పీటర్ పాల్ ను 3వ పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈమధ్యనే మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో పీటర్ పాల్ మొదటి భార్య కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. తన భర్తకు నిజంగా విడాకులు తీసుకునే ఆలోచనే లేదని వనిత నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానల్ కోసం ఆమె ఇంటిలో కొంతకాలం ఉన్న తన భర్త పీటర్ పాల్ ను లొంగదీసుకుని వనిత పెళ్ళి చేసుకుందని, తన భర్త బాగా తాగుతాడని, తరుచూ అమ్మాయిల గొడవల్లో చిక్కుకుంటాడని, తన భర్త ఏం చేసినా తాను ఇప్పటివరకూ భరించానని, ఇప్పుడందరూ నీ భర్త మరో పెళ్లి చేసుకున్నాడటగా..? అని సూటిపోటి మాటలతో ఎగతాళి చేస్తుంటే చాలా బాధగా ఉందని, ప్రస్తుతం పీటర్ పాలుకి ఎలాంటి
ఆదాయం లేదని, అందుకే కేవలం డబ్బు కోసమే ఆయన వనితను పెళ్ళి చేసుకున్నాడని, తన పిల్లల భవిష్యత్తు ఇబ్బందుల్లో పడిందని” ఆవేదన చెందుతూ ఎలిజబెత్ చెప్పడంతో ఈ వివాదం క్రొత్త మలుపు తిరిగింది.

ఇదే విషయాన్ని కొందరు మీడియా ప్రతినిధులు వనితా దగ్గర ప్రస్తావించగా.. వనిత మాత్రం తన భర్త తాగడని, మాంసాహారం కూడా తినడని చెప్పింది. పెళ్లిలో కూడా పీటర్ పాల్ తాగింది, మధ్యం కాదని ఆ వీడియోలో ఉన్నది నాన్ ఆల్కహాలిక్ డ్రింక్ అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది వనిత. లేటెస్ట్ గా తన యూట్యూబ్ ఛానల్ లో వనిత షేర్ చేసిన వీడియోను చూసిన నెటిజన్లందరికీ వనిత గతంలో చెప్పినవన్ని అబద్దాలేనని తెలియడంతో షాకయ్యారు. వనితా సొంత యూట్యూబ్ ఛానెల్లో ఆమె షేర్ చేసిన వీడియోలో స్వయంగా వనితాయే వండిన చికెన్ కబాబ్ పీసును పీటర్ టేస్ట్ చేస్తున్నట్టుగా స్పష్టంగా కనబడటంతో ఇప్పుడు నెటిజన్లందరూ వనితాపై విమర్శలు గుప్పిస్తూ కారాలూ.. మిరియాలు నూరుతున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Magadheera: చరణ్ అభిమానులకు శుభవార్త.. థియేటర్లో రిలీజ్ కాబోతున్న.. ఎప్పుడో తెలుసా?

Published

on

Magadheera: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. గతంలో విడుదల అయిన సినిమాలను థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు మూవీ మేకర్స్. ఇప్పటికే తెలుగు థియేటర్స్ లో చాలా సినిమాలు విడుదలైన విషయం తెలిసిందే. మహేష్ బాబు ప్రభాస్ చిరంజీవి బాలకృష్ణ,రామ్ చరణ్,ఎన్టీఆర్ సినిమాలను థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. పోకిరి నుంచి ఇప్పటిదాకా రీసెంట్ గా సమరసింహా రెడ్డిదాకా ఈ ట్రెండ్ నడుస్తూనే ఉంది. కొన్ని రీరిలీజ్ సినిమాలు బాగానే డబ్బు చేసుకోగా మరికొన్ని మాత్రం జనం పెద్దగా పట్టించుకోని పరిస్దితి ఏర్పడుతోంది.

ఆ సంగతి పక్కన పెడితే త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీర సినిమా విడుదల కానుంది. మరి ఈ సినిమా ఎప్పుడు విడుదల కానుంది అన్న వివరాల్లోకి వెళితే.. మగధీర సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నెల 27న చరణ్‌ బర్త్‌డే సందర్భంగా మగధీర చిత్రాన్ని 26న రీ రిలీజ్‌ చేస్తున్నారు మేకర్స్‌. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించారు. గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ నిర్మించిన మగధీర 2009 జూలై 30న విడుదలై, బ్లాక్‌ బస్టర్‌ హిట్ గా నిలిచింది.

రీ రిలీజ్‌..

Advertisement

దాదాపుగా 14 ఏళ్ల తర్వాత ఈ చిత్రాన్ని శ్రీ విజయలక్ష్మి ట్రేడర్స్‌ అధినేత యర్రంశెట్టి రామారావు, అరిగెల కిశోర్‌బాబు రీ రిలీజ్‌ చేస్తున్నారు. మగధీర చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో రీ రిలీజ్‌ చేస్తున్నాము. తెలుగు ప్రేక్షకులు, మెగా అభిమానులు ఈ చిత్రాన్ని ఆదరించి మరోసారి ఘన విజయాన్ని అందించాలి అని తెలిపారు యర్రంశెట్టి రామారావు, అరిగెల కిశోర్‌ బాబు.

Advertisement
Continue Reading

Featured

Mokshagna: బోయపాటి డైరెక్షన్లో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ.. ఫిక్స్ చేసిన బాలయ్య?

Published

on

Mokshagna: సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అయ్యారు. ఈయనకు వయస్సు మీద పడుతున్నప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇక బాలయ్య వారసుడి రాక కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Mokshagna

మోక్షజ్ఞ ఎంట్రీ అదిగో ఇదిగో అంటూ దాదాపు మూడు సంవత్సరాల నుంచి అభిమానులను ఊరిస్తూ ఉన్నప్పటికీ ఇప్పటివరకు కూడా ఈయన సినీ ఎంట్రీ గురించి ఎలాంటి క్లారిటీ లేదు కానీ గత ఏడాది బాలయ్య మాట్లాడుతూ వచ్చే ఏడాది తన కుమారుడు సినీ ఎంట్రీ ఉంటుందని తెలిపారు.. ఇకపోతే మోక్షజ్ఞ ఎవరి డైరెక్షన్లో ఇండస్ట్రీకి పరిచయం అవుతారన్న సందేహాలు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. ఒకసారి అనిల్ రావిపూడి పేరు వినిపించగా మరోసారి బోయపాటి పేరు కూడా తెరపైకి వచ్చింది.

ఇప్పటికే వీరిద్దరూ స్క్రిప్ట్ గురించి కూడా డిస్కషన్స్ పూర్తి చేశారని ఇక త్వరలోనే ఈ సినిమా పనులను ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. ఇలా బాలయ్య తన కొడుకు ఎంట్రీ బోయపాటి పైనే భారం వేసారని తెలుస్తోంది ఇక ఈ విషయం తెలిసినటువంటి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా వెల్లడించబోతున్నారని తెలుస్తోంది.

Advertisement

బోయపాటి పైనే భారం..
ఈ క్రమంలోనే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి తాజాగా మరొక వార్త వైరల్ గా మారింది. మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి టైం ఫిక్స్ చేశారని ఇక ఈయన బోయపాటి డైరెక్షన్ లోనే ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారని తెలుస్తుంది. మాస్ సినిమాలకు బోయపాటి కేరాఫ్ అడ్రస్ తన కుమారుడి మొదటి సినిమా కూడా ఇలాంటి యాక్షన్ టచ్ ఇస్తేనే బాగుంటుందని భావించినటువంటి బాలయ్య బోయపాటిని ఫిక్స్ చేశారట.

Advertisement
Continue Reading

Featured

Venkata Chaitanya: ప్రతి ఒక్కటి తిరిగి ఇచ్చేయాల్సిందే.. వైరల్ అవుతున్న నిహారిక మాజీ భర్త పోస్ట్!

Published

on

Venkata Chaitanya: జొన్నలగడ్డ వెంకట చైతన్య పరిచయం అవసరం లేని పేరు మెగా డాటర్ నిహారిక మాజీ భర్తగా ఈయన ఎంత గుర్తింపు పొందారు. ఇరువురి కుటుంబ సభ్యుల సమ్మతితో వీరిద్దరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా విడాకులు తీసుకున్నటువంటి వీరిద్దరూ తమ వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఈ విధంగా నిహారిక ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల ఓ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈమె తన పెళ్లి విడాకులు అలాగే రెండో పెళ్లి గురించి కూడా కామెంట్లు చేసిన సంగతి మనకు తెలిసిందే .ఇలా ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇందుకు కౌంటర్ గా తన మాజీ భర్త సైలెన్స్ సైలెన్స్ అంటూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.

అయితే తాజాగా మరోసారి ఈయన సోషల్ మీడియాలో చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈయన పరోక్షంగా నిహారికను ఉద్దేశిస్తూ తనకు కౌంటర్ ఇస్తూనే ఇలాంటి పోస్టులు చేశారని స్పష్టంగా అర్థమవుతుంది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ అయినటువంటి చైతన్య తాజాగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

Advertisement

పాజిటివిటీని పెంచాలి..
చాలా రోజుల తర్వాత ఇలా మళ్లీ రాసుకు వస్తున్నాను. ఇంస్టా కమ్యూనిటీకి నా వల్ల అయినంతలో ఇలా చిన్నగా అయిన తిరిగి ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాను. కొంచమైనా పాజిటివిటీని పెంచాలని అనుకుంటున్నాను అంటూ ఈయన పోస్ట్ చేయడంతో ఇది చూసినటువంటి నేటిజన్స్ కచ్చితంగా ఇది నిహారికను ఉద్దేశించి చేశారంటూ కామెంట్లు చేస్తున్నారు. వీరిద్దరు విడిపోయిన సోషల్ మీడియాలో ఒకరిపై మరొకరు ఇలా పరోక్షంగా సెటైర్లు వేసుకుంటూ పోస్ట్ చేస్తున్నారని స్పష్టంగా అర్థం అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!