Connect with us

Featured

అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి గురించి ఆశక్తికర విషయాలు..!

Published

on

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. మెగా ఫ్యామిలీ నీడ నుంచి మెల్లిగా బయటపడి. తనకంటూ సొంత ఇమేజ్‌ను క్రియేట్‌ చేసుకున్నాడు. డ్యాన్స్‌, ఫైట్స్‌ సహా అద్భుత నటనతోనూ ఆకట్టుకుంటున్నాడు. ఇక పర్సనల్‌ లైఫ్‌లోనూ మంచి కొడుకుగా మంచి భర్తగా తండ్రిగా మంచి మార్కులే కొట్టేస్తున్నాడు.

అల్లు అర్జున్‌ భార్య స్నేహలతా రెడ్డి కూడా తక్కువేమీ కాదు. భర్తకు తగ్గ భార్యగా మేడ్‌ ఫర్‌ బన్నీ అనిపించుకుంది. మరి అలాంటి స్నేహ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి సహజంగానే అందరికీ తప్పకుండా ఉంటుంది.

వాస్తవానికి బన్నీ, స్నేహలది లవ్‌ కమ్‌ అరేంజ్‌డ్‌ మ్యారేజ్‌ అని చెప్పొచ్చు. 2011లో వీరిద్దరూ ప్రేమపక్షుల్లా విహరించి. పెద్దల ఆమోదంతో ఒక్కటయ్యారు. అయితే మొదట్లో కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. పెళ్లికి అల్లు ఫ్యామిలీ నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేకపోయినా. స్నేహ తండ్రి సిట్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ ఫౌండర్‌ కేసీ శేఖర్‌రెడ్డి అంగీకరించలేదు. దీంతో వారి వివాహానికి ఏడాది గ్యాప్‌ వచ్చింది. చివరికి మధ్యవర్తుల సహకారంతో ఇరు పక్షాలు పెళ్లికి అంగీకరించారు.

చిన్నప్పటి నుంచే స్నేహ ఎంతో చురుకైన అమ్మాయిగా పేరు తెచ్చుకుంది. అమెరికాలో కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీతో పాటు ఇంజినీరింగ్ లో ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ ని పూర్తి చేశారు. ఇండియా వచ్చిన తర్వాత తమ సిట్‌ కాలేజ్‌ విస్తరణకు కృషి చేసింది. కాలేజ్‌ అకడమిక్స్‌ అండ్ ప్లేసెమెంట్ సెక్షన్‌ డైరెక్టర్ గా తనదైన ముద్ర వేసింది. తన డైనమిజంతో… కాలేజ్ ఈవెంట్స్ లో ఆక్టివ్ రోల్‌ ప్లే చేసింది. యువతను జాగృతం చేయడానికి స్పెక్ట్రం అనే కాలేజీలకు సంబంధించిన మ్యాగజైన్‌కి చీఫ్‌ ఎడిటర్‌గా కూడా పని చేసింది. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలంటే అల్లు అర్జున్ 10వ తరగతి వరకు మాత్రమే చదివితే.. స్నేహ రెడ్డి మాత్రం బన్నీ కన్నా ఏడాకులు ఎక్కువే చదువుకుంది.

కుటుంబపరంగా అత్తామామల వద్ద స్నేహారెడ్డికి మంచి ఇంప్రెషనే ఉంది. తమ కోడలు బంగారమని వారు చెబుతారు. అంతేకాదు అయాన్, అర్హలకి తల్లిగా స్నేహా ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోంది. ఆడుతూ పాడుతూ.. జాలీగా.. చిలిపిగా కనిపించే అల్లు అర్జున్‌కు ఇలాంటి భార్య దొరకడం నిజంగా ఆ కుటుంబం చేసుకున్న అదృష్టంగా చెబుతారు.

మరోవైపు స్నేహారెడ్డి సెల్ఫ్‌ రెస్‌పెక్ట్‌ను ఎక్కువగా కోరుకుంటుంది. తండ్రితో సంక్రమించిన ఆస్తులు, బిజినెస్‌ను, భర్తతో వచ్చిన స్టార్‌ స్టేటస్‌ను కాదనుకుని తనకంటూ ప్రత్యేకంగా ఉండాలని భావించింది.

అందుకే జూబ్లీహిల్స్‌లో సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించింది. తన అభిరుచి మేరకు పికాబో అనే ఓ ఆన్‌లైన్‌ ఫోటో స్టూడియోని కొనుగోలు చేసింది. బేబి ఫొటోగ్రఫి, మెటర్నిటి ఫొటోగ్రఫి చేస్తూ తన సత్తా చాటుతోంది. ఇవండీ అల్లు అర్జున ప్రియ సతీమణి స్నేహ రెడ్డి గురించిన ఆసక్తికరమైన విషయాలు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Vishal: మళ్లీ ఆయనే ఏపీ సీఎం.. హీరో విశాల్ కామెంట్స్ వైరల్!

Published

on

Vishal: సినీ నటుడు హీరో విశాల్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన సినిమాలో పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గానే ఉంటారు. అంతేకాకుండా తమిళ రాజకీయాలలో కూడా ఈయన యాక్టివ్ గా ఉంటూ తరచూ రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు.

ప్రస్తుతం హీరో విశాల్ నటించిన రత్నం సినిమా ఈనెల 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఈయన ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం హైదరాబాద్ వచ్చారు ఇలా హైదరాబాద్ వచ్చినటువంటి ఈయనకు ఏపీ రాజకీయాల గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఇలా రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురు కావడంతో ఈయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కూడా గెలిచేది వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఆయనే మరోసారి ఏపీ సీఎం అవుతున్నారని విశాల్ వెల్లడించారు. ఇక జగన్మోహన్ రెడ్డి పట్ల ఇలాంటి దాడులు ఇదివరకు ఎన్నో జరిగాయి. వాటిని ఆయన ఎదుర్కొన్నారని తెలిపారు.

Advertisement

జగన్ అంటే అభిమానం..
ఇక్కడ తప్పకుండా వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని అయితే నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదని తెలిపారు. తనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైనటువంటి అభిమానం ఉందని ఈ సందర్భంగా విశాల్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ 8 లో మాజీ కంటెస్టెంట్లు.. మళ్లీ రచ్చ షూరు!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారు ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలు అందుకున్నటువంటి పలువురు బిగ్ బాస్ సీజన్ సెవెన్ మాజీ కంటెస్టెంట్ లో తిరిగి సీజన్ 8 లో కంటెస్టెంట్లుగా పాల్గొన్న పోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇటీవల బిగ్ బాస్ 7 కార్యక్రమం ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమం ద్వారా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సినీ నటుడు శివాజీ, అమర్ దీప్, విన్నర్ పల్లవి ప్రశాంత్ ఈ ముగ్గురు కూడా సీజన్ 8 కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.

సీజన్ 7లో అత్యధిక కంటెంట్ ఇచ్చింది ఈ ముగ్గురే. శోభ శెట్టి ఉన్నప్పటికీ ఆమె పట్ల అత్యంత నెగిటివిటీ నడిచింది. అమర్ దీప్ తో శివాజీ, పల్లవి ప్రశాంత్ ఫైట్స్ హైలెట్ అయ్యాయి. అందుకే ఈ ముగ్గురిని తిరిగి సీజన్ 8 లో కూడా తీసుకురావాలని ఆలోచనలో మేకర్స్ ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటన మాత్రం వెలబడలేదు.

Advertisement

కార్తీకదీపం డాక్టర్ బాబు..
బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో ఈ ముగ్గురి మధ్య పెద్ద ఎత్తున యుద్ధం నడిచింది అయితే తిరిగి ఈ ముగ్గురు మరోసారి సీజన్ 8 లో పాల్గొన్నారు. అంటే మరోసారి రచ్చ జరుగుతుందని పలువురు భావిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రశాంత్ విన్నర్ కాగా, అమర్ రన్నర్ గా నిలిచారు. ఇక ఈ కార్యక్రమంలో కార్తీకదీపం ఫేమ్ నిరుపమ్ రాబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: వేణు స్వామి ఇంటి నుంచి ప్రభాస్ అడిగి మరీ అవి తీసుకున్నారు: వేణు స్వామి వైఫ్

Published

on

Prabhas: ప్రముఖ జ్యోతిష్యుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలను చెబుతూ ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తున్నారు.

ముఖ్యంగా ఈయన ప్రభాస్ జాతకం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రభాస్ అభిమానులు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉంటారు అంతేకాకుండా వేణు స్వామి పై భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఇలా సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు వేణు స్వామి మధ్య పెద్ద ఎత్తున మాటలు యుద్ధం జరుగుతుందని చెప్పాలి.

ఇలా వేణు స్వామి విషయంలో ఆయన అభిమానులు భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నప్పటికీ వేణు స్వామి అలాగే ప్రభాస్ మధ్య మంచి అనుబంధమే ఉందని చెప్పాలి. ఈ విషయం గురించి తాజాగా వేణు స్వామి భార్య ఓ సందర్భంలో వెల్లడించారు. ఒకసారి తన తోటలో పండిన సీతాఫలం పండ్లను వేరే వారికి పంపించగా అవి ప్రభాస్ వద్దకు చేరాయి.

Advertisement

సీతాఫలం..
అవి తిన్న ప్రభాస్ చాలా బాగున్నాయని అడిగి మరి మా ఇంటి నుంచి తెప్పించుకున్నారు అంటూ వేణు స్వామి భార్య వీణ వాణి తెలిపారు. అంతేకాకుండా ఈమె ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ బ్యాగ్ ను కూడా తయారు చేసి కానుకగా పంపించినట్లు ఈ వీడియో ద్వారా వెల్లడించారు. ఇది చూసిన అభిమానులు మీరేమో ప్రభాస్ పై అభిమానం చూపిస్తారు మీ ఆయనేమో అలా మాట్లాడతారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!