ఆధార్ నెంబర్.. 12 అంకెల ఈ నెంబరే ఇప్పుడు ఓ వ్యక్తి చరిత్రను మొత్తం చెబుతుంది. ఆధార్ ఒక్కటి ఉంటే చాలు.. మన దేశంలో ఎన్నో పనులు అయిపోతాయి. అదే ఆధార్ లేకపోతే.. ఎన్నో పనులు ఆగిపోతాయి. అంత ప్రాధాన్యత ఉన్న ఆధార్ కార్డును ఇప్పుడు ప్రభుత్వం ప్రతి దానిలో తప్పనిసరి చేసింది. ఆధార్ను పాన్ కార్డుతో లింక్ చేయడం, సిమ్ కార్డుతో లింక్ చేయడం, బ్యాంక్ అకౌంట్తో లింక్ చేయడం, గ్యాస్ తో లింక్ చేయడం.. ఇప్పుడు కొత్తగా త్వరలోనే డ్రైవింగ్ లైసెన్స్తోనూ లింక్ చేయనున్నాం. ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి కూడా ఆధార్ ఇప్పుడు తప్పనిసరి. ఇలా ప్రతి దానికి తప్పనిసరి అయిన ఆధార్ ను వాటి ఆఖరు తేదీల్లోగా లింక్ చేయకపోతే ఆ సర్వీసులు నిలిచిపోనున్నాయి. ఆ సర్వీసులేంటో తెలుసుకుందాం పదండి…
పాన్ కార్డుతో ఆధార్ లింకింగ్ కు చివరి తేదీ డిసెంబర్ 31, 2017
పాన్ కార్డుతో ఆధార్ ను లింక్ చేసుకోవడానికి పోయిన నెల ఆగస్టు 31 వరకే డెడ్ లైన్ ఉన్నప్పటికీ.. డిసెంబర్ 31, 2017 వరకు డేట్ ను సీబీడీటీ(Central Board of Direct Taxes) పెంచింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి ఇన్ కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి ఆధార్ – పాన్ లింకింగ్ ను తప్పని సరి చేసింది ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్.
ఒకవేళ, ఆధార్ – పాన్ ను లింక్ చేయకపోతే.. ఇన్ కమ్ టాక్స్ రిటర్న్స్ ను పరిగణనలోకి ఐటీ శాఖ తీసుకోదు. దీంతో మళ్లీ పెనాల్టీతో రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది.
Advertisement
ఆధార్ తో సిమ్ కార్డ్ లింకింగ్ కు చివరి తేదీ.. ఫిబ్రవరి 2018
ఫిబ్రవరి 2018 లోగా… సిమ్ కార్డ్స్ను ఆధార్ తో లింక్ చేసుకోకపోతే ఆ నెంబర్ డియాక్టివేట్ అవుతుంది. సిమ్ కార్డ్స్ను ఆధార్ తో లింక్ చేసుకోవాలనుకునే వాళ్లు.. తమ నెట్ వర్క్స్ కు చెందిన స్టోర్కు వెళ్లి లింక్ చేసుకోవాలి. లింక్ చేయాల్సిన మొబైల్ నెంబర్ వాడుకలో ఉండాలి. అప్పుడు లింక్ చేయాలనుకున్న మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ని స్టోర్ వాళ్లకు చెప్పాలి. తర్వాత ఆధార్ నెంబర్ వాళ్లకు ఇవ్వాలి. అనంతరం బయోమెట్రిక్ ను వెరిఫై చేస్తారు. ఆ తర్వాత లింక్ చేసిన మొబైల్ నెంబర్ కు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. అంతే.. మీ మొబైల్ నెంబర్ తో ఆధార్ లింక్ అవుతుంది.
బ్యాంక్స్ ఫైనాన్సియల్ కంపెనీలకు సబ్మిట్ చేయడానికి చివరి తేదీ… డిసెంబర్ 31, 2017
బ్యాంక్ అకౌంట్స్, ఫైనాన్సియల్ కంపెనీలతో ఆధార్ ను లింక్ చేయాడానికి డిసెంబర్ 31, 2017 చివరి తేదీ. కేవైసీ డాక్యుమెంట్ లో తప్పని సరిగా బ్యాంకులు, ఫైనాన్సియల్ కంపెనీలు కస్టమర్ల ఆధార్ డిటేయిల్స్ ను అప్ డేట్ చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. లోన్స్ తీసుకున్న కస్టమర్లు కూడా తమ ఆధార్ డిటేయిల్స్ ను బ్యాంకులకు సమర్పించాల్సి ఉంటుంది. డిసెంబర్ 31, 2017 లోపు బ్యాంకుల్లో ఆధార్ ను సబ్మిట్ చేయకపోతే.. ఆ అకౌంట్లు రద్దయిపోనున్నాయి. రూ. 50 వేల కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు కూడా ఆధార్ డిటేయిల్స్ ను తప్పనిసరిగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ లో ఆధార్ను లింక్ చేయడానికి చివరి తేదీ.. డిసెంబర్ 31, 2017
డిసెంబర్ 31, 2017 లోగా పెన్షన్, గ్యాస్ సిలిండర్, గవర్నమెంట్ స్కాలర్ షిప్స్, ఇంకా ఇతర సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ కోసం ఆధార్ నెంబర్ ను లింక్ చేయాల్సిందే. అప్పటిలోగా ఆధార్ను లింక్ చేయకపోతే.. ఆ సర్వీసులన్నీ నిలిచిపోనున్నాయి.
Pitapuram: ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి అయితే ఎన్నికల హడావిడి మొదలైనప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా అందరి చూపు పిఠాపురం నియోజకవర్గం పైనే ఉంది. ఈ నియోజకవర్గంలో ఎవరి జెండా ఎగురుతుందన్న విషయంపై ఎంతో ఆసక్తి నెలకొంది. ఇలా పిఠాపురం పైన ఇంత ఆసక్తి రావడానికి కారణం అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడమే కారణమని చెప్పాలి.
గత ఎన్నికలలో భీమవరం గాజువాకలో పోటీ చేసి ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ ఈసారి మాత్రం కాపులు అధికంగా ఉన్నటువంటి నియోజకవర్గం పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు ఈ క్రమంలోనే ఈయనకు పోటీగా వైసిపి పార్టీ నుంచి వంగా గీత ఎన్నికల బరిలోకి దిగారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే అయినప్పటికీ ఎవరు గెలుస్తారో అన్న విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
ఇప్పటికే ఎన్నో చానల్స్ వారు ప్రజా సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో భాగంగా ఎక్కువ శాతం పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశాలే ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది. వంగా గీత కూడా అదే సామాజిక వర్గానికి చెందిన మహిళ అంతేకాకుండా ప్రస్తుతం కాకినాడ ఎంపీగా కూడా ఈమె కొనసాగుతున్నారు. ఇలాంటి తరుణంలో వంగా గీత కాకుండా పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని తెలుస్తోంది.
Advertisement
జనసేనదే విజయమా.. ఇకపోతే వంగా గీత 2009వ సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగి పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలుపొందారు అయితే అప్పట్లో ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చిన పిఠాపురానికి చేయాల్సినటువంటి న్యాయం చేయలేకపోయారని అందుకే ఈసారి పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలుపుతున్నామంటూ చాలామంది ప్రజలు పవన్ కళ్యాణ్ గెలుపుకు కృషి చేస్తున్నారంటూ పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి చూడాలి మరి పిఠాపురంలో ఏ జెండా ఎగురుతుంది వంగా గీత పవన్ కళ్యాణ్ కి ఎలా పోటీగా నిలబడతారు అనేది తెలియాల్సి ఉంది.
AP politics: రేపు ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో వైఎస్ఆర్సిపి పార్టీ ఎలాంటి పొత్తు లేకుండా ఎన్నికల బరిలోకి దిగిపోతుంది కానీ తెలుగుదేశం పార్టీతో జనసేన బిజెపి పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగబోతున్న సంగతి తెలిసిందే ఇలా కూటమిగా ఏర్పడి ఎన్నికలలో గెలిచి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ముందుకు నడిపించాలని ధ్యేయంగా ఎన్నికల బరిలోకి దిగబోతున్నట్లు వెల్లడించారు.
ఇలా ఈ మూడు పార్టీల కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగుతున్నటువంటి తరుణంలో కొన్ని నియోజకవర్గాలలో పార్టీల కోసం ఎంతో కష్టపడినటువంటి వారికి సీట్లు రాకపోవడంతో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలోనే జనసేనలోనూ కూడా అభ్యర్థులు అలకలు మొదలుపెట్టారు. ఇటీవల బీజేపీ తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయవాడ వెస్ట్ సీటు జనసేన పార్టీకే కేటాయిస్తారని, పార్టీ తరపున తనకే సీటు వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న పోతిన మహేష్ ఈ సీటు బీజేపీకి వెళ్లిపోవడంతో చాలా అసంతృప్తికి గురయ్యారు.
ఇలా బిజెపికి సేటు కేటాయించడంతో మహేష్ ఏకంగా జనసేన పార్టీ కార్యాలయం ముందు రెండు గంటల పాటు కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఇక ఈయనని పవన్ కళ్యాణ్ పిలిపించుకొని తనని బుజ్జగించే ప్రయత్నం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు పదవి తప్పకుండా ఇస్తామని చెప్పిన మహేష్ మాత్రం తనకు టికెట్ కావాలని కోరారు.
Advertisement
పొత్తు ధర్మాన్ని పాటించండి.. ఇలా అభ్యర్థులు సహకరించకపోవడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రెస్ నోట్ విడుదల చేశారు.పొత్తు ధర్మాన్ని పాటిద్దామని కూటమిని గెలిపిద్దామంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రెస్నోట్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోసమే కూటమి ఏర్పాటు చేశామని ప్రస్తావించారు. ఆ పొత్తు ధర్మాన్ని పాటించకపోతే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
AP Politics: ఏపీ ఎన్నికలు త్వరలోనే జరగబోతున్నటువంటి తరుణంలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుంచి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర ప్రారంభించారు. ఈ బస్సు యాత్రలో భాగంగా ప్రొద్దుటూరులో బహిరంగ సభ నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే.
ఈ సభలో తన బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య గురించి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనగా మారాయి. మా చిన్నాన్న వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరో రాష్ట్ర తెలుసనీ, తన చెల్లెలు షర్మిల సునీతను కూడా తమ రాజకీయాలలో పావులుగా వాడుకున్నారని తెలిపారు.
నా చెల్లెమ్మలు ఇద్దరూ కూడా హంతకులకే మద్దతు తెలుపుతున్నారని జగన్ మండిపడ్డారు. చెల్లెమ్మలు చిన్నాన్నను చంపిన వారితో చేతులు కలపగా నేను మాత్రం ప్రజల పక్షమే ఉంటానని జగన్ తెలిపారు. ఇలాంటి హంతకులతో అవినీతిపరులతో యుద్ధం చేయడానికి ఈ అర్జునుడు సిద్ధం మీరు సిద్ధమేనా అంటూ ఈ కార్యక్రమంలో జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి.
Advertisement
కూటమి అంటే కుట్రలు.. వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు నాయుడికి 45 ఏళ్ల అనుభవం ఉందని చెప్పారు. ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి చంపి, ఆయన విగ్రహాలకు పూలమాలలు వేశారని అన్నారు. కూటమి అంటే కుట్రలు కుతంత్రాలని జగన్ తెలిపారు. తమ జెండా మాత్రం మరో జెండాతో జతకట్టలేదని చెప్పారు. కేంద్రం నుంచి ఓ పార్టీని తెచ్చుకున్నారని అన్నారు. ఇటీవల చోటుచేసుకున్న డ్రగ్స్ కేసు వెనుక చంద్రబాబు వదిన గారి చుట్టం ఉన్నారంటూ డ్రగ్స్ వ్యవహారంపై కూడా జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.