తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాష ఏదైనా సరే.. సీరియల్స్ అంటే ఇంట్లో టీవీ కి అతుక్కుపొయే జనాలు ఎందరో. పగలంతా ఆఫీస్ లో కష్టపడి సాయంత్రం తిరిగి వచ్చాక సీరియల్స్ లో మునిగిపోయేవారు చాలామంది. మరికొందరైతే ఇంట్లో వారిని సరిగా పట్టించుకోకుండా కూడా సీరియల్ వదలకుండా చూసేవారు.
సీరియల్ పిచ్చి ఎంతలా అంటే… ఒకవేళ టీవీ సీరియల్ సమయంలో కరెంటు పోయింది అని అనుకుంటే ఇక ఆ సీరియల్ లో ఏం జరిగిందో అని టెన్షన్ తో గడిపిన వారు కూడా ఉన్నారు అంటే నమ్మండి. ఈ సీరియల్స్ ఎక్కువగా ఆడవారు బాగా కనెక్ట్ అయ్యారు. వారికి నచ్చిన సీరియల్ ఏదైనా టీవీ లో వస్తుంది అంటే ఇంట్లోని పనులను చకచకా ఆ సమయానికి పూర్తి చేసుకొని ఇట్లే టీవీ కి అతుక్కుపోతున్నారు. మరికొందరైతే దారుణంగా ఇంట్లో వాళ్ళని పట్టించుకోవడం కూడా మానేశారు. ఇదిలా ఉంటే తెలుగు ప్రేక్షకులకు ఎప్పటినుండో సీరియళ్లను పరిచయం చేసిన ఛానల్ ఈటీవీ. అప్పట్లో సీరియల్ అంటే కేవలం ఈటీవీ లోనే ప్రసారమయ్యేవి. ఈటీవీ లో వచ్చిన అనేక సీరియల్స్ తెలుగు ప్రేక్షకుల మదిలో ఇప్పటికీ చెరిగిపోని ముద్ర వేసుకొని ఉన్నాయి. ఇప్పుడైతే ఈటీవీ ఛానల్ చూడడం చాలా వరకు తెలుగు ప్రజలు తగ్గించారు కానీ, అప్పట్లో మాత్రం సీరియల్స్ అంటే కేవలం ఈటీవీ మాత్రమే లా ఉండేది. ఇక ఇదివరకు రోజుల్లో ఈ టీవీ ఛానల్ లో బాగా ప్రాముఖ్యత పొందిన సీరియల్ గురించి ఓసారి చూద్దామా….
ముఖ్యంగా ఈ టీవీ లో ప్రసారమైన సీరియల్ లో లేడీ డిటెక్టివ్ సీరియల్ చాలా ప్రాముఖ్యత చెందింది. ప్రతి మంగళవారం రాత్రి సమయంలో ఈ సీరియల్ ప్రసారమయ్యేది. సినీ దర్శకుడు వంశీ దర్శకత్వం వహించిన ఈ సీరియల్ అప్పట్లో సెన్సేషనల్ గా మారింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఉత్తర చాలా బాగా నటించి తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. ఈ సీరియల్ ప్రసారం అయిపోయిన తర్వాత ఆవిడ మరో సీరియల్లో నటించకుండా వివాహం చేసుకుని సంసార జీవితాన్ని ప్రశాంతంగా కొనసాగుతోంది.
ఇక ఆ తర్వాత ఈ టీవీ లో బాగా పేరు పొందిన సీరియల్ స్నేహ. ఈ సీరియల్ కూడా తెలుగు ప్రేక్షకులను బాగా మెప్పించింది. ఈ సీరియల్ లో నటించిన హీరోయిన్ కావేరి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆ తర్వాత బిజినెస్ మ్యాన్ రాకేష్ అనే వ్యక్తిని 2013లో ప్రేమించి వివాహం చేసుకుని సెటిల్ అయిపోయింది.
ఇక ఈ టీవీలో ప్రసారమయ్యే అన్వేషిత సీరియల్ కూడా బాగా పాపులర్ అయింది. దీనికి ప్రధాన కారణం థ్రిల్లర్ తో కూడిన సన్నివేశాలు ఇందులో ఉండడమే. ఈ సీరియల్ అచ్యుత్, యమునా లీడ్ క్యారెక్టర్ రోల్స్ చేశారు. 1997 సంవత్సరంలో మొదలైంది సీరియల్. మొత్తం 100 ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకుంది. 1999 సంవత్సరంలో ఈ సీరియల్ సమాప్తం అయ్యింది. అయితే ఈ మూడు సంవత్సరాలలో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ఈ సీరియల్. అయితే ఈ సమయంలో వివిధ భాగాలలో ఏకంగా 8 నంది అవార్డులను గెలుచుకుంది ఈ సీరియల్. అందులో నటించిన హీరో హీరోయిన్లు కూడా నంది అవార్డులు దక్కాయి.
ఆ తర్వాత అంతరంగాలు సీరియల్ బాగా పాపులర్ అయిన సీరియల్. ఇందులో లీడ్ రోల్స్ లో అచ్యుత్, శరత్ బాబు, కల్పన లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సీరియల్ ను రామోజీరావు కొడుకు సుమన్ దర్శకత్వం వహించారు. రామోజీ రావు గారు దీనిని నిర్మించారు. ఈ సీరియల్ లో శరత్ బాబు ఓ విలక్షణమైన క్యారెక్టర్ లో నటించారు. అందులో నటించిన కల్పనా కూడా మంచి నటనని అందించింది. ఆ తర్వాత కూడా ఆవిడ అనేక సీరియల్స్, సినిమాల్లో నటించిన తర్వాత పెళ్లి చేసుకొని ఇటు వెండితెర… అటు బుల్లితెర వదిలి ప్రశాంతంగా సంసార జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది.
ఆ తర్వాత ఈటీవీ సీరియల్స్ లో బాగా పాపులర్ అయిన సీరియల్ ఎండమావులు. ఈ సీరియల్ లో అనేకమంది సినిమా యాక్టర్స్ నటించారు. మహర్షి, జ్యోతి రెడ్డి మెయిన్ క్యారెక్టర్స్ లో నటించారు. ఇందులో నటించిన మహర్షి 175 పైగా సినిమాలలో ఆర్టిస్ట్ గా నటించారు. ఇలా అనేక సీరియల్స్ తెలుగు టీవీ ప్రేక్షకులను ఎంతగానో గుర్తుండి పోయేలా నడిచాయి.
Pawan Kalyan: టీడీపీ, బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో నిర్వహించిన ప్రజాగళం భారీ సభను నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే.ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాబోయే కురుక్షేత్ర సమరం తర్వాత ఏపీలో రాబోయేది రామ రాజ్యమేనని తెలిపారు. ప్రస్తుతం రావణాసురు పాలన సాగుతుందని త్వరలోనే రామరాజ్యం వస్తుందని వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి అధికారం డబ్బు అండతో విర్రవీగిపోతున్నారని పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి రేటు పూర్తిగా పడిపోయిందని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ ఒక సంక్షేమం లేదని అభివృద్ధి జరగలేదని నిరుద్యోగం పెరిగిపోయిందని తెలిపారు. ఈ కురుక్షేత్ర యుద్ధం తర్వాత రామరాజ్యం రాబోతుందని తెలిపారు. ఇక దేశమంతా డిజిటల్ రంగంలో ముందుకు దూసుకుపోతూ ఉండగా జగన్మోహన్ రెడ్డి మాత్రం మద్యం దుకాణాల వద్ద ఇంకా నగదు బదిలీ చేపడుతూ భారీగా దోచుకుంటున్నారని తెలిపారు. ఈయన ఒక సారా వ్యాపారి అంటూ పవన్ ఎద్దేవా చేశారు.
Advertisement
డ్రగ్స్ రాజధాని.. కేవలం మద్యం విషయంలో మాత్రమే కాదు ఇసుక తవ్వకాలలో కూడా జగన్ బినామీలు సుమారు 40 వేల కోట్ల వరకు దోచుకున్నారని పవన్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ రాజధానిగా మారిపోయింది అంటూ జగన్ పరిపాలనపై పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు కురిపిస్తూ చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వచ్చే ఎన్నికలలో కచ్చితంగా ఎన్డీఏ కూటమి గెలుస్తుంది అంటూ ఈ సందర్భంగా పవన్ తమ గెలుపు పట్ల ధీమా వ్యక్తం చేశారు.
AP politics: ప్రస్తుతం జరగబోయే ఏపీ ఎన్నికలు ఎంతో రసవత్తరంగ మారాయి. జగన్ ఒక్కడే ఒక వైపు ఉండగా మరోవైపు జనసేన టిడిపి బిజెపి కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి రాబోతున్నారు. ఇలా ఈ పార్టీలన్నీ పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలోకి దిగబోతున్నటువంటి తరుణంలో మొదటిసారి చిలకలూరిపేట వద్ద ప్రజాగళం అనే పేరిట భారీ సభను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి పై ఎలాంటి విమర్శలు చేస్తారో అన్న విషయంపై అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు .అయితే ఈ సభలో మోడీ చేసిన వ్యాఖ్యల గురించి ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ సభలో మోడీ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలోని మంత్రులు అవినీతికి పాల్పడ్డారు అంటూ ఈయన తెలిపారు. ఎక్కడ కూడా జగన్ గురించి మాట్లాడలేదు అలాగే రాజధానుల ప్రస్తావన తీసుకురాలేదు పోలవరం గురించి ప్రశ్నించలేదు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జగన్ ప్రభుత్వంలోని మంత్రుల గురించి మాట్లాడారే తప్ప జగన్ గురించి ఎక్కడా కూడా మాట్లాడలేదు అలాగే తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేయాలి అని కూడా ఎక్కడా చెప్పలేదు. ఎన్డీఏకి ఓట్లు వేసి గెలిపించండి అని మాత్రమే కోరారని నాగేశ్వరరావు తెలిపారు. ఇక్కడ మోడీ గారికి చంద్రబాబు నాయుడుని గెలిపించడమే అజెండా కాదని ఈయన తెలిపారు.
Advertisement
జగన్ పై ఎక్కడ విమర్శలు చేయలేదు.. రేపు ఎన్నికలు జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు అలాగే జగన్ పార్టీకి చెందిన ఎంపీలు కూడా మోడీకి అవసరం కనుక ఈయన ఎక్కడ కూడా జగన్ కు ఓటు వేయొద్దని చంద్రబాబుకు ఓటు వేసి గెలిపించండని చెప్పలేదు. చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయాలి అనే అజెండా కనుక ఉండి ఉంటే ఈ సభలో జగన్ పై విమర్శలు చేసేవారు కానీ మోడీ ఎక్కడ కూడా అలా ప్రసంగించలేదు అంటూ ప్రొఫెసర్ నాగేశ్వరరావు తన అనాలసిస్ ద్వారా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
AP politics: ఏపీలో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత పొలిటికల్ హీట్ మరింత పెరిగిపోయింది. వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి పొత్తులు లేకుండా ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు కానీ మరోవైపు టిడిపి జనసేన బిజెపి కూటమిగా ఎన్నికల బరిలోకి రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా భారీ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పోటీకి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.
ఇక ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఈయన ప్రాంతాలవారీగా సిద్ధం సభలను ఏర్పాటు చేసి నాయకులలోను కార్యకర్తలను ఫుల్ జోష్ నింపారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రచార కార్యక్రమాలలో భాగంగా సరికొత్త వ్యూహాలను రచిస్తూ జనాలలోకి వెళ్ళబోతున్నారని తెలుస్తుంది. ఈయన ఇప్పటికే ఏ నియోజకవర్గం లో ఎన్ని రోజులు పర్యటించాలి ఎక్కడ బహిరంగ సభలు నిర్వహించాలి ఎక్కడ రోడ్డు షో చేయాలి అనే విషయాల గురించి పక్కాగా ప్లాన్ సిద్ధం చేశారని తెలుస్తోంది.
2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసి 151 స్థానాలలో విజయకేతనం ఎగురు వేసినటువంటి వైసీపీ పార్టీ ఈసారి మాత్రం వై నాట్ 175 అనే నినాదంతో ఎన్నికల బరిలోకి దిగబోతోంది తాము ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో 99% అమలు పరిచాము. అందుకే వై నాట్ 175 అనే ధీమాతో జగన్ ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. 2019 ఎన్నికల ఫలితాలను ఈసారి కూడా రిపీట్ చేయాలని ఈయన తన అభ్యర్థులను కార్యకర్తలను కూడా సిద్ధం చేస్తున్నారు.
Advertisement
వై నాట్ 175 ఇలా వై నాట్ 175 అంటూ ఎన్నికలకు జగన్మోహన్ రెడ్డి సిద్ధం కాగా మరోవైపు కూటమిగా అన్ని పార్టీలు ఏకమై జగన్మోహన్ రెడ్డి పై యుద్ధానికి మేము సిద్ధం అంటున్నారు. మరి ఈ ఐదేళ్ల ప్రజా పాలనకు జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తున్నారు ఏంటి అనేది తెలియాల్సి ఉంది.