Connect with us

Featured

చెమటతో బట్టలు తడిసిపోయేవి.. ఉదయభాను రియల్ లైఫ్ స్టొరీ తెలిస్తే హ్యాట్సఫ్ అంటారు

Published

on

డ్యాన్స్ బేబి డ్యాన్స్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఉదయభాను. బుల్లి తెరపై, వెండి తెరపై ఈమె చేసిన సందడి అంతా ఇంతా కాదు. దాదాపు 15 సంవత్సరాలు ఈమె బుల్లి తెరను ఏలింది అంటే అతిశయోక్తి కాదు. ఏ ప్రోగ్రాం చేసినా, ఏ స్టేజ్‌ షో చేసినా ఆ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చేది.

బుల్లితెర మహారాణి.. మాటల మాంత్రికురాలు.. ఇలా ఒకటేంటి ఉదయభాను గురించి ఎన్ని చెప్పినా తక్కువే..అంటారు అభిమానులు….ఆమె దాదాపు సంవత్సరంన్నర కాలంగా బుల్లితెరకు దూరంగా ఉంటోంది.

Advertisement

బుల్లితెర శ్రీదేవిగా పేరు తెచ్చుకున్న ఆమె అంతకంటే అందమైన మనసు కూడా ఉందని ఎన్నో సందర్భాల్లో రుజువుచేసుకున్నారు. అతి చిన్న వయసులో కెరీర్‌ ప్రారంభించి ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొని స్వశక్తితో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు.

ఏడాది కిందట కవల పిల్లలకు జన్మనిచ్చి మూడేండ్ల విరామం తర్వాత ‘నీతోనే డ్యాన్స్‌’ షోతో మళ్ళీ తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆమెతో మానవి చిట్‌చాట్‌…
సుమారు మూడేండ్ల తర్వాత మళ్ళీ తెరపైకి వచ్చారు.


ఈ సమాజంలో మహిళలుగా ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటున్నాం. నరరూప రాక్షసుల మధ్య బతుకుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఆడపిల్లలకు రక్షణ చాలా అవసరం. స్త్రీ శక్తిని తక్కువగా అంచనా వేస్తున్నారు. స్త్రీ తలచుకుంటే ఏమైనా చేయగలదు. ప్రతి ఆడపిల్ల ఓ శక్తిగా మారి ఈ దుష్ట సమాజంపై తిరుగుబాటు చేయాలి.

ధైర్యంగా సమస్యలను ఎదుర్కొవాలి. ఒక్కోసారి మనల్ని రక్షించాల్సిన చేతులే మన పీక పిసికే పరిస్థితి వస్తున్నది. అలాంటి వాటిని కూడా ఎదుర్కొనే ధైర్యం అమ్మాయిలకు ఉండాలి. అని అంటుంది ఉదయభాను…

Advertisement

ఉదయభాను పుట్టింది కరీంనగర్‌ దగ్గర కొహెడ. అమ్మ అరుణ, ఆయుర్వేద డాక్టర్‌. నాన్న ఎస్‌.కె పటేల్‌. నాన్న కూడా డాక్టరే. అయితే నాలుగేండ్ల వయసులోనే నాన్న చనిపోయారు. ఆయన చాలా దాన ధర్మాలు చేసేవారు. వందల ఎకరాలు దానం చేసిన గొప్ప దాత. కష్టపడేతత్వం వారి నుంచే తనకు వచ్చిందని, వారిచ్చిన ధైర్యంతోనే చిన్నతనం నుంచే మోయలేనన్ని భారాలు తనమీద ఉన్నా ముందుకు నడవగలిగానని అంటుంది ఉదయభాను.

అమ్మ డ్యాన్స్‌ నేర్పించింది. స్టేజ్‌ షోలు చేసేదాన్ని. అక్కడ నన్ను చూసి సినిమాల్లో అవకాశం ఇచ్చారు. మొదట చేసింది ఎర్రసైన్యం సినిమాలో. అప్పుడు ఎత్తు పెరిగాను గానీ చాలా చిన్నదాన్ని. డైలాగులు చెప్పడానికి వణికిపోయేదాన్ని. చెమటతో బట్టలు తడిసిపోయేవి.

అలాంటిది ‘హృదయాంజలి’ షో వందల మందిలో మైక్‌ పట్టుకున్నాను. అప్పుడు ఆ ధైర్యం ఎలా వచ్చిందో నాకే తెలియదు. బహుశా జీన్స్‌ నుంచి వచ్చిన ధైర్యమేమో. ‘నిగ్గిదీసి అడుగు’ వంటి ఛాలెంజింగ్‌ షోస్‌ కూడా అదే ధైర్యంతో చేయగలిగాను. అంటూ చెప్పుకోచింది ఉదయభాను..

Advertisement

నా పిల్లల్ని ఆడపులుల్లా పెంచుతాను. ఈ సమాజంలో అమ్మాయిలు అలా ఉంటేనే బతకగలరు. మమ్మల్ని కాపాడండీ అంటూ ఆర్తనాదాలు చేయకూడదు. దాడి చేసే వారిపై తిరగబడాలి. అందుకే ఆడపిల్లలకు కేవలం డ్యాన్స్‌, సంగీతం నేర్పిస్తే సరిపోదు. సెల్ఫ్‌డిఫెన్స్‌ కూడా నేర్పించాలి.

ఎక్కడి నుంచి ఏ రాక్షసుడు వస్తాడో తెలియదు. ఎలా వేధిస్తాడో తెలియదు. వారి బారి నుంచి తమను తాము కాపాడుకునే ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఆడపిల్లలకు ఇవ్వాలి. ఏడిస్తే ఇంకా ఇంకా ఏడిపిస్తారు. అందుకే ఏడ్చి కన్నీళ్ళను వృధా చేసుకోకూడదు అంటూ చెప్పుకొచ్చింది ఉదయభాను..

ఇవన్నీ నా అనుభవాల నుంచి నేర్చుకున్నాను. మన వైపు వేలెత్తి చూపించే వాళ్ళ వేలుని విరగ్గొట్టాలి. ప్రేమ పంచడంతో పాటు తేడా వస్తే తాట తీయాలి. ఇవన్నీ నా పిల్లలకు నేర్పిస్తాను. దీని గురించే ఓ పుస్తకం కూడా రిలీజ్‌ చేయాలనుకుంటున్నాను. దానికోసం ఓ సాంగ్‌ కూడా రాశాను. అయితే నేను పెన్ను కదిలిస్తే విప్లవం వచ్చేస్తుందేమో అని ఆలోచిస్తున్నాను. కానీ పుస్తకం వివరాలు కూడా త్వరలోనే మీడియాకు చెబుతాను.

Advertisement

బలం, ధైర్యం తన భర్తేనని, ముందు మేం ఆర్థికంగా స్థిరపడాలనుకున్నామని, అన్నేండ్ల తమ ప్రేమకు సాక్షాలే తమ కవల పిల్లలని, వాళ్ళను చూస్తే తన ఒత్తిడి మొత్తం ఇట్టే ఎగిరిపోతుందని అంటోంది ఉదయభాను. తమ పెండ్లి చాలా స్ట్రగుల్‌ పడి చేసుకున్నామని, జీవితం అనుక్షణం ఓ యుద్ధం. ఆ యుద్ధంలో జయిస్తేనే బతుకు. విజరు అనే సోల్జర్‌ నా పక్కన ఉన్నన్ని రోజులు విజయం నాదే అని అంటోంది ఉదయభాను…

సమస్యలు లేకుండా జీవితమే ఉండదు. ‘భయం తలుపు తట్టింది.. ధైర్యం తలుపు తీసింది ఎదురుగా ఎవరూ లేరు’. ఇది నాకు బాగా నచ్చిన వాక్యం. ఛాలెంజెస్‌ వచ్చినప్పుడే మనలో ఉన్న శక్తి ఏమిటో మనకు తెలుస్తుంది. నా దృష్టిలో స్త్రీ ఎప్పటికీ ఒంటరి కాదు. తనలోపల ఓ శక్తి స్వరూపిణి దాగి ఉందని ఎప్పుడూ మర్చిపోకూడదు. సమస్య వచ్చినప్పుడు ప్రతి స్త్రీకీ తనని తానే ఓ సైన్యంగా మార్చుకునే సత్తా ఉంటుంది. ఎలాంటి సవాల్‌ ఎదురైనా ధైర్యంగా నిలబడగలుగుతుంది. దీనికి నేనే ఓ మంచి ఉదాహరణ.

స్ట్రాంగ్‌గా ఉండాలి. మనల్ని మనం నమ్ముకోవాలి. తొందర తొందరగా పైకి వచ్చేయాలనే ఆరాటం ఉండకూడదు. మన కష్టాన్నే నమ్ముకోవాలి. కష్టపడితే ఫలితం కచ్చితంగా ఉంటుంది. అన్నింటికంటే ముందు మనలోని ఆత్మవిశ్వాసాన్ని ఎప్పటికీ చెక్కుచెదరనీయకూడదు. చిన్న వీక్‌ పాయింట్‌ దొరికినా మనతో ఆడుకోడానికి చాలా మంది ఎదురుచూస్తుంటారు. అందుకే అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. అధైర్యానికి తావు ఇవ్వకూడదు. అంటూ ఒక సక్సెస్ ఫుల్ మహిళ గా తన మనోభావాన్ని ఆవిష్కరించింది…ఉదయభాను…

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Vishal: మళ్లీ ఆయనే ఏపీ సీఎం.. హీరో విశాల్ కామెంట్స్ వైరల్!

Published

on

Vishal: సినీ నటుడు హీరో విశాల్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన సినిమాలో పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గానే ఉంటారు. అంతేకాకుండా తమిళ రాజకీయాలలో కూడా ఈయన యాక్టివ్ గా ఉంటూ తరచూ రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు.

ప్రస్తుతం హీరో విశాల్ నటించిన రత్నం సినిమా ఈనెల 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఈయన ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం హైదరాబాద్ వచ్చారు ఇలా హైదరాబాద్ వచ్చినటువంటి ఈయనకు ఏపీ రాజకీయాల గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఇలా రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురు కావడంతో ఈయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కూడా గెలిచేది వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఆయనే మరోసారి ఏపీ సీఎం అవుతున్నారని విశాల్ వెల్లడించారు. ఇక జగన్మోహన్ రెడ్డి పట్ల ఇలాంటి దాడులు ఇదివరకు ఎన్నో జరిగాయి. వాటిని ఆయన ఎదుర్కొన్నారని తెలిపారు.

Advertisement

జగన్ అంటే అభిమానం..
ఇక్కడ తప్పకుండా వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని అయితే నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదని తెలిపారు. తనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైనటువంటి అభిమానం ఉందని ఈ సందర్భంగా విశాల్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ 8 లో మాజీ కంటెస్టెంట్లు.. మళ్లీ రచ్చ షూరు!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారు ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలు అందుకున్నటువంటి పలువురు బిగ్ బాస్ సీజన్ సెవెన్ మాజీ కంటెస్టెంట్ లో తిరిగి సీజన్ 8 లో కంటెస్టెంట్లుగా పాల్గొన్న పోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇటీవల బిగ్ బాస్ 7 కార్యక్రమం ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమం ద్వారా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సినీ నటుడు శివాజీ, అమర్ దీప్, విన్నర్ పల్లవి ప్రశాంత్ ఈ ముగ్గురు కూడా సీజన్ 8 కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.

సీజన్ 7లో అత్యధిక కంటెంట్ ఇచ్చింది ఈ ముగ్గురే. శోభ శెట్టి ఉన్నప్పటికీ ఆమె పట్ల అత్యంత నెగిటివిటీ నడిచింది. అమర్ దీప్ తో శివాజీ, పల్లవి ప్రశాంత్ ఫైట్స్ హైలెట్ అయ్యాయి. అందుకే ఈ ముగ్గురిని తిరిగి సీజన్ 8 లో కూడా తీసుకురావాలని ఆలోచనలో మేకర్స్ ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటన మాత్రం వెలబడలేదు.

Advertisement

కార్తీకదీపం డాక్టర్ బాబు..
బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో ఈ ముగ్గురి మధ్య పెద్ద ఎత్తున యుద్ధం నడిచింది అయితే తిరిగి ఈ ముగ్గురు మరోసారి సీజన్ 8 లో పాల్గొన్నారు. అంటే మరోసారి రచ్చ జరుగుతుందని పలువురు భావిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రశాంత్ విన్నర్ కాగా, అమర్ రన్నర్ గా నిలిచారు. ఇక ఈ కార్యక్రమంలో కార్తీకదీపం ఫేమ్ నిరుపమ్ రాబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: వేణు స్వామి ఇంటి నుంచి ప్రభాస్ అడిగి మరీ అవి తీసుకున్నారు: వేణు స్వామి వైఫ్

Published

on

Prabhas: ప్రముఖ జ్యోతిష్యుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలను చెబుతూ ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తున్నారు.

ముఖ్యంగా ఈయన ప్రభాస్ జాతకం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రభాస్ అభిమానులు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉంటారు అంతేకాకుండా వేణు స్వామి పై భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఇలా సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు వేణు స్వామి మధ్య పెద్ద ఎత్తున మాటలు యుద్ధం జరుగుతుందని చెప్పాలి.

ఇలా వేణు స్వామి విషయంలో ఆయన అభిమానులు భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నప్పటికీ వేణు స్వామి అలాగే ప్రభాస్ మధ్య మంచి అనుబంధమే ఉందని చెప్పాలి. ఈ విషయం గురించి తాజాగా వేణు స్వామి భార్య ఓ సందర్భంలో వెల్లడించారు. ఒకసారి తన తోటలో పండిన సీతాఫలం పండ్లను వేరే వారికి పంపించగా అవి ప్రభాస్ వద్దకు చేరాయి.

Advertisement

సీతాఫలం..
అవి తిన్న ప్రభాస్ చాలా బాగున్నాయని అడిగి మరి మా ఇంటి నుంచి తెప్పించుకున్నారు అంటూ వేణు స్వామి భార్య వీణ వాణి తెలిపారు. అంతేకాకుండా ఈమె ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ బ్యాగ్ ను కూడా తయారు చేసి కానుకగా పంపించినట్లు ఈ వీడియో ద్వారా వెల్లడించారు. ఇది చూసిన అభిమానులు మీరేమో ప్రభాస్ పై అభిమానం చూపిస్తారు మీ ఆయనేమో అలా మాట్లాడతారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!