Connect with us

Movie News

వీళ్లను చూస్తే మీరు అస్సలు గుర్తుపట్టరు

Published

on

ఒకప్పుడు టాలీవుడ్ తెరమీద తళుక్కున మెరిసి … మాయమైన ఈ అందాల భామలు
ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా?

వాళ్లంతా ఒకప్పుడు టాలీవుడ్ లో తళుక్కున మెరిసిన అందాల తారలు. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించారు. అందం , అభినయం కలబోసిన ఆ ముద్దు మందారాలు .. చేసినవి అతి తక్కువ సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్రవేసారు. కెరీర్ లో మంచి హిట్స్ పడిన తరుణంలోనే ఏం జరిగిందో కానీ, సినీ జీవితానికి గుడ్ బై చెప్పేసి, వేరే రూట్లో పయనిస్తున్నారు. మరి వీళ్లంతా ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు ఎక్కడుంటున్నారో ఏం చేస్తున్నారో అనే ఆతృత అందరికీ ఉండడం సహజం.

Advertisement

ముందు గా ఈ లిస్ట్ లో ఉన్న అందాల తార అపర్ణ. నైంటీస్ లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సుందర కాండ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం చేసిన ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఆ ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఈ ముద్దు గుమ్మ, ఈ సినిమా తర్వాత అక్కపెత్తనం చెల్లెలి కాపురం అనే ఒక్క సినిమా మాత్రమే చేసి తెలుగు తెరకు టాటా చెప్పేసింది. బెంగళూర్ కు చెందిన అపర్ణ ఈ సినిమా తర్వాత హిందీలో నాక్ అవుట్ అనే సినిమాలో మాత్రమే నటించి,2002 లోనే యు.ఎస్ శాన్ ఫ్రాన్సిస్కో లో సెటిల్ అయిపోయింది. చక్కటి భర్త, ముద్దులొలికే ఇద్దరు పిల్లలతో అపర్ణ అక్కడే హ్యాపీగా ఉంటున్నారు.

ఇక అతి తక్కువ సినిమాలతో ఇండియన్ స్ర్కీన్ మీద కనిపించి మాయమైన మరో అందాల హీరోయిన్ గిరిజ. తండ్రి కర్ణాటకకు చెందిన వైద్యుడు, తల్లి ఇంగ్లాండుకు చెందిన వ్యాపారవనిత. ఇంగ్లాండులో పుట్టి పెరిగిన ఈమె 18 యేళ్ల వయసులో దక్షిణ భారత శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించడానికి భారతదేశానికి వచ్చింది. భారతదేశముపై మమకారముతో హిందూ తత్త్వము మరియు మతముపై విస్తృతముగా పరిశోధన చేసింది. 1998లో ఇంగ్లాండుకు తిరిగి వెళ్ళి భారతీయ మతాలపై ఎం.ఏ కోర్సు పూర్తిచేసి, అరబిందో తత్త్వముపై డాక్టరేటు పరిశోధన చేసింది.

1989లో మణిరత్నం గీతాంజలితో సౌత్ స్ర్కీన్ మీద మెరిసింది. ఆ సినిమా తెచ్చిపెట్టిన క్రేజ్ తో ఆమె ఆ తర్వాత కాలంలో పెద్ద హీరోయిన్ అయిపోతుందని అనుకున్నారు అందరూ. కానీ ఆమె వందనం అనే ఒక మలయాళ సినిమాలోనూ, హృదయాంజలి అనే మరో తెలుగు సినిమాలో మాత్రమే నటించగలిగింది. గిరిజ ప్రస్తుతం రచయితగా లండన్లో స్థిరపడింది. ఈమె నటనపై ఇప్పటికీ తన అధ్యయనము కొనసాగిస్తూ ఇతర నటులు మరియు సినీ నిర్మాతలతో పనిచేస్తూనే ఉంది. 2005 నుండి లండన్ లో ఆరోగ్య సంబంధ విషయాల విలేఖరిగా పనిచేస్తున్నది. ప్రస్తుతం గిరిజ అక్కడే ఉంటోంది.

Advertisement

తెలుగు తెరమీద అతి తక్కువ సినిమాల్లో నటించిన మరో అందాల తార మీనాక్షి శేషాద్రి. పెయింటర్ బాబు అనే హిందీ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రి ఇచ్చిన మీనాక్షి.. అతి తక్కువ టైమ్ లోనే నెం. 1 హీరోయిన్ అయింది. బాలీవుడ్ బడా హీరోల సరసన నటించి, మెప్పించిన మీనాక్షి కి తెలుగు లో బాగా క్రేజీ తెచ్చిపెట్టిన చిత్రం బ్రహ్మర్షి విశ్వామిత్ర. యన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటైమ్ లో తెరకెక్కించిన ఈ సినిమాలో మీనాక్షి మేనకగా అదరగొట్టేసింది.అంతకన్నా ముందు జీవనపోరాటం సినిమాలో కేమియో రోల్ పోషించింది. ఆ తర్వాత విశ్వనాథ్ , చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన ఆపద్బాంధవుడు లో మెరిసింది. 1998 వరుకూ మీనాక్షి బాలీవుడ్ తెరమీద లెక్కకు మించిన చిత్రాల్లో నటించి, చాలా ఏళ్లకు మళ్లీ 2016 లో సన్నిడియోల్ తో ఘాయల్ వన్స్ ఎగైన్ లో గెస్ట్ పాత్రలో కనిపించింది. ప్రస్తుతం మీనాక్షి శేషాద్రి, యూ.ఎస్. లో సెటిలైంది. అక్కడ చెరిష్ ఇన్స్ స్టిట్యూట్ ఆఫ్ డ్యాన్స్ అనే డ్యాన్స్ స్కూల్ రన్ చేస్తోంది. భర్త హరీష్, కేంద్ర, జోష్ , మ్యాట్ ఆమె పిల్లలు.

భద్రాచలం సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కేరళ కుట్టి సింధు మీనన్ కూడా ఇప్పుడు సినిమాలు వదిలేసి దాంపత్యజీవితంలోకి అడుగుపెట్టేసింది. రష్మి అనే కన్నడ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టిన సింధు మీనన్ ఆ తర్వాత లెక్కకు మించిన సినిమాలతో సౌత్ స్ర్కీన్ మీద మంచి పేరు తెచ్చుకుంది. త్రినేత్రం, శ్రీరామచంద్రలు, ఆడంతే అదో టైపు, ఇన్స్ పెక్టర్ అనే సినిమాలు చేసినా కృష్ణవంశీ చందమామ అమ్మడికి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. 2010 ఏప్రిల్ లో డామ్నిక్ ప్రభు అనే ఒక వ్యాపార వేత్తను పెళ్లిచేసుకొని యూ.ఎస్ లో సెటిల్ అయింది. ఆమెకు స్వెట్లానా అనే ఒక అమ్మాయి. సింధు మీనన్ ఆఖరి తెలుగు సినిమా సుభద్ర. సో.. అలా ఈ నలుగురు అందగత్తెలు .. మెరుపు తీగల్లా మెరిసి టాలీవుడ్ కు గుడ్ బై చెప్పేసారు.

Advertisement

Continue Reading
Advertisement

Featured

Magadheera: చరణ్ అభిమానులకు శుభవార్త.. థియేటర్లో రిలీజ్ కాబోతున్న.. ఎప్పుడో తెలుసా?

Published

on

Magadheera: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. గతంలో విడుదల అయిన సినిమాలను థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు మూవీ మేకర్స్. ఇప్పటికే తెలుగు థియేటర్స్ లో చాలా సినిమాలు విడుదలైన విషయం తెలిసిందే. మహేష్ బాబు ప్రభాస్ చిరంజీవి బాలకృష్ణ,రామ్ చరణ్,ఎన్టీఆర్ సినిమాలను థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. పోకిరి నుంచి ఇప్పటిదాకా రీసెంట్ గా సమరసింహా రెడ్డిదాకా ఈ ట్రెండ్ నడుస్తూనే ఉంది. కొన్ని రీరిలీజ్ సినిమాలు బాగానే డబ్బు చేసుకోగా మరికొన్ని మాత్రం జనం పెద్దగా పట్టించుకోని పరిస్దితి ఏర్పడుతోంది.

ఆ సంగతి పక్కన పెడితే త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీర సినిమా విడుదల కానుంది. మరి ఈ సినిమా ఎప్పుడు విడుదల కానుంది అన్న వివరాల్లోకి వెళితే.. మగధీర సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నెల 27న చరణ్‌ బర్త్‌డే సందర్భంగా మగధీర చిత్రాన్ని 26న రీ రిలీజ్‌ చేస్తున్నారు మేకర్స్‌. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించారు. గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ నిర్మించిన మగధీర 2009 జూలై 30న విడుదలై, బ్లాక్‌ బస్టర్‌ హిట్ గా నిలిచింది.

రీ రిలీజ్‌..

Advertisement

దాదాపుగా 14 ఏళ్ల తర్వాత ఈ చిత్రాన్ని శ్రీ విజయలక్ష్మి ట్రేడర్స్‌ అధినేత యర్రంశెట్టి రామారావు, అరిగెల కిశోర్‌బాబు రీ రిలీజ్‌ చేస్తున్నారు. మగధీర చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో రీ రిలీజ్‌ చేస్తున్నాము. తెలుగు ప్రేక్షకులు, మెగా అభిమానులు ఈ చిత్రాన్ని ఆదరించి మరోసారి ఘన విజయాన్ని అందించాలి అని తెలిపారు యర్రంశెట్టి రామారావు, అరిగెల కిశోర్‌ బాబు.

Advertisement
Continue Reading

Featured

Mokshagna: బోయపాటి డైరెక్షన్లో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ.. ఫిక్స్ చేసిన బాలయ్య?

Published

on

Mokshagna: సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అయ్యారు. ఈయనకు వయస్సు మీద పడుతున్నప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇక బాలయ్య వారసుడి రాక కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Mokshagna

మోక్షజ్ఞ ఎంట్రీ అదిగో ఇదిగో అంటూ దాదాపు మూడు సంవత్సరాల నుంచి అభిమానులను ఊరిస్తూ ఉన్నప్పటికీ ఇప్పటివరకు కూడా ఈయన సినీ ఎంట్రీ గురించి ఎలాంటి క్లారిటీ లేదు కానీ గత ఏడాది బాలయ్య మాట్లాడుతూ వచ్చే ఏడాది తన కుమారుడు సినీ ఎంట్రీ ఉంటుందని తెలిపారు.. ఇకపోతే మోక్షజ్ఞ ఎవరి డైరెక్షన్లో ఇండస్ట్రీకి పరిచయం అవుతారన్న సందేహాలు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. ఒకసారి అనిల్ రావిపూడి పేరు వినిపించగా మరోసారి బోయపాటి పేరు కూడా తెరపైకి వచ్చింది.

ఇప్పటికే వీరిద్దరూ స్క్రిప్ట్ గురించి కూడా డిస్కషన్స్ పూర్తి చేశారని ఇక త్వరలోనే ఈ సినిమా పనులను ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. ఇలా బాలయ్య తన కొడుకు ఎంట్రీ బోయపాటి పైనే భారం వేసారని తెలుస్తోంది ఇక ఈ విషయం తెలిసినటువంటి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా వెల్లడించబోతున్నారని తెలుస్తోంది.

Advertisement

బోయపాటి పైనే భారం..
ఈ క్రమంలోనే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి తాజాగా మరొక వార్త వైరల్ గా మారింది. మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి టైం ఫిక్స్ చేశారని ఇక ఈయన బోయపాటి డైరెక్షన్ లోనే ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారని తెలుస్తుంది. మాస్ సినిమాలకు బోయపాటి కేరాఫ్ అడ్రస్ తన కుమారుడి మొదటి సినిమా కూడా ఇలాంటి యాక్షన్ టచ్ ఇస్తేనే బాగుంటుందని భావించినటువంటి బాలయ్య బోయపాటిని ఫిక్స్ చేశారట.

Advertisement
Continue Reading

Featured

Venkata Chaitanya: ప్రతి ఒక్కటి తిరిగి ఇచ్చేయాల్సిందే.. వైరల్ అవుతున్న నిహారిక మాజీ భర్త పోస్ట్!

Published

on

Venkata Chaitanya: జొన్నలగడ్డ వెంకట చైతన్య పరిచయం అవసరం లేని పేరు మెగా డాటర్ నిహారిక మాజీ భర్తగా ఈయన ఎంత గుర్తింపు పొందారు. ఇరువురి కుటుంబ సభ్యుల సమ్మతితో వీరిద్దరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా విడాకులు తీసుకున్నటువంటి వీరిద్దరూ తమ వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఈ విధంగా నిహారిక ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల ఓ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈమె తన పెళ్లి విడాకులు అలాగే రెండో పెళ్లి గురించి కూడా కామెంట్లు చేసిన సంగతి మనకు తెలిసిందే .ఇలా ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇందుకు కౌంటర్ గా తన మాజీ భర్త సైలెన్స్ సైలెన్స్ అంటూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.

అయితే తాజాగా మరోసారి ఈయన సోషల్ మీడియాలో చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈయన పరోక్షంగా నిహారికను ఉద్దేశిస్తూ తనకు కౌంటర్ ఇస్తూనే ఇలాంటి పోస్టులు చేశారని స్పష్టంగా అర్థమవుతుంది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ అయినటువంటి చైతన్య తాజాగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

Advertisement

పాజిటివిటీని పెంచాలి..
చాలా రోజుల తర్వాత ఇలా మళ్లీ రాసుకు వస్తున్నాను. ఇంస్టా కమ్యూనిటీకి నా వల్ల అయినంతలో ఇలా చిన్నగా అయిన తిరిగి ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాను. కొంచమైనా పాజిటివిటీని పెంచాలని అనుకుంటున్నాను అంటూ ఈయన పోస్ట్ చేయడంతో ఇది చూసినటువంటి నేటిజన్స్ కచ్చితంగా ఇది నిహారికను ఉద్దేశించి చేశారంటూ కామెంట్లు చేస్తున్నారు. వీరిద్దరు విడిపోయిన సోషల్ మీడియాలో ఒకరిపై మరొకరు ఇలా పరోక్షంగా సెటైర్లు వేసుకుంటూ పోస్ట్ చేస్తున్నారని స్పష్టంగా అర్థం అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!