Connect with us

Featured

షాకింగ్.. ఈ హీరోస్ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు

Published

on

హీరోయిన్స్ అంటేనే సన్నగా ఉండాలని తమ నాజుకు అందాలతో యువత మతి పోగొట్టాలని అనుకుంటారు.. అందంగా ఉన్న హీరోయిన్స్ కొన్ని రోజుల లోనే ముద్దుగా బొద్దుగా కనబడితే మాత్రం చూసి చీ ఎంటి ఇలా తయరయ్యింది అంటూ చురకలెయ్యకుండా ఉండలేం. సినిమాలు తగ్గగానే పెళ్ళి చేసుకోని లేక ఏ పని లేకనో హీరోయిన్స్ గుర్తు పట్తకుండా అయిపోయారు. మన హీరోలలో కూడా మార్పు వస్తోంది. వారు కూడా కాలానుగుణంగా మారడానికి సిద్ధపడుతున్నారు. అయితే ఈ మార్పు బాలీవుడ్, కోలివుడ్లతో పోల్చుకుంటే చాలా నిదానంగా జరుగుతోంది. హిందీ, తమిళం, మళయాల హీరోలు మూస చిత్రాలకు చాలా వరకు స్వస్తి పలికారు. మల్టీస్టార్ చిత్రాలలో నటిస్తున్నారు. కథలలో కొత్తదనంతోపాటు, ఎటువంటి పాత్రనైనా చేస్తున్నారు. జనం మెప్పు పొందుతున్నారు. మన హీరోలు కూడా అదేబాటలోకి వెళుతున్నారు.

కొందరు తారలు ఒక్క సినిమాలో కనిపించినా చెరిగిపోని ముద్ర వేస్తారు. కొందరు నటీనటులు తెరమరుగై ఏళ్లు గడిచినా అభిమానుల మనసు పొరల్లో నిలిచే ఉంటారు. ఒకప్పటి నటి గిరిజా షెట్టర్‌, సర్వదమన్‌ బెనర్జీ, మంజునాథ్‌, మాధవి, అన్షు, రవళి, మీనాక్షీ శేషాద్రి, రక్షిత… లాంటి తారలు ఆ కోవకు చెందినవారే. ఇంతకీ వాళ్లు ఇప్పుడు ఎక్కడ, ఎలా ఉన్నారో తెలుసా…

Advertisement

1 . రోహిత్

ఈ హీరో చిన్న బడ్జెట్ సినిమాలకు రారాజులా వెలిగాడు. సిక్స్టీన్ సినిమాతో ఎంటర్ అయిన ఈ హీరో తరవాత గర్ల్ ప్రెండ్ ఈ రెండు సినిమాలు అప్పట్లో సంచనం సాధించాయి. ఆ తరవాత రోహిత్ కు ఆఫర్లు తగ్గి, ఇతర హీరోల సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాల్సి వచ్చింది. చిరు సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో రోహిత్ నటించిన పాత్ర ఇప్పటికి ప్రేక్షకుల మదిలో ఉంది. చివరిగా 2010 లో మా అన్నయ్య బంగారం లో కనిపించి ఆ తరవాత కనిపించడం మానేసాడు. తాజాగా ఒక ఫంక్షన్ లో రోహిత్ కనిపించాడు గాని అతనిని ఎవ్వరు గుర్తు పట్టలేకుండా ఉన్నారు.


2 . మంజునాథ్

పాతికేళ్ల కిందట దర్శకుడు కె. విశ్వనాధ్ తీసిన స్వాతి కిరణం చిత్రంలో హీరో మమ్ముట్టి. కానీ అతని కన్నా ఎక్కువ పేరొచ్చింది ఆ చిత్రంలో గంగాధరం పాత్ర పోషించిన కుర్రాడు మంజునాథ్ కే. బెంగళూరుకు చెందిన ఈ కుర్రాడు కన్నడ, హిందీ భాషల్లో 60కి పైగా చిత్రాల్లో నటించాడు. 19 ఏళ్ళ వయసులో చదువుకోసం నటనకు దూరమయ్యాడు. ప్రస్తుతం బెంగళూరు లో ఉంటూ సొంతంగా పీ ఆర్ కన్సల్టెన్సీ సంస్థను నిర్వహిస్తున్నాడు. బెంగళూరు – మైసూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ప్రోజెక్టుకూ పని చేస్తున్నాడు. కర్ణాటకకు చెందిన అథ్లెట్ స్వర్ణరేఖ ను పెళ్లి చేసుకున్న మంజునాథ్ కు ఓ బాబు కూడా ఉన్నాడు.

Advertisement


3 . సర్వదమన్‌ బెనర్జీ

సిరివెన్నెల సినిమాలో అంధుడైన ఫ్లూటిస్ట్‌గా సర్వదమన్‌ బెనర్జీ పోషించిన పాత్రను ఆ సినిమా చూసినవారెవ్వరూ మర్చిపోలేరు. దూరదర్శన్‌లో వచ్చిన రామానంద్‌ సాగర్‌ ‘కృష్ణ’ సీరియల్‌లో శ్రీ కృష్ణుడిగానూ దేశం మొత్తానికీ ఆయన సుపరిచితుడు. ఉత్తరాదిలో ఇప్పటికీ చాలామంది సర్వదమన్‌ని ‘కృష్ణ’ అనే పిలుస్తారు. విచిత్రం ఏంటంటే ఆ సీరియల్‌లో కృష్ణుడిగా నటించినప్పట్నుంచీ ఆయన పూర్తిగా కృష్ణతత్వంలోకీ ఆధ్యాత్మిక చింతనలోకీ వెళ్లిపోయారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లోని రిషీకేశ్‌లో స్థిరపడి ధ్యాన బోధన చేస్తున్నారు. పేద పిల్లల్ని చదివించే ‘పంఖ్‌’ అనే స్వచ్ఛంద సంస్థ తరఫున పనిచేస్తూ సొంత ఖర్చులతో కొందరు విద్యార్థులనూ చదివిస్తున్నారు సర్వదమన్‌.

4 . ఉదయ్ చోప్రా

ధూమ్‌’ సిరీస్‌లో తన కామెడీ అలరించిన ఉదయ్‌ చోప్రా గుర్తున్నాడా? యశ్‌ చోప్రా తనయుడైన ఉదయ్‌ చోప్రా బాలీవుడ్‌లో గొప్పగా రాణించలేదు. దీంతో సినిమాల నుంచి తప్పుకున్న ఉదయ్‌.. కేవలం ‘ధూమ్‌’ సిరీస్‌లో మాత్రం నటిస్తున్నాడు. 2013లో ఆమిర్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కిన ‘ధూమ్‌-3’ సినిమాలో ఉదయ్‌ చివరిసారిగా తెరపైన కనిపించాడు. ఆ సినిమాలో కండలు తిరిగిన దేహసౌష్టవంతో ఎనర్జిటిక్‌గా కనిపించిన ఉదయ్‌.. ఇప్పుడు కండలు లేవు సరికదా గుర్తుపట్టలేని రీతిలో మారిపోయాడు. బొద్దుగా గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆయన తాజా ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి. ఉదయ్‌ ఆ మధ్య నర్గీస్‌ ఫక్రీతో డేటింగ్‌ చేసినట్టు కథనాలు వచ్చిన వారి మధ్య ఇటీవల బ్రేకప్‌ అయిందని బాలీవుడ్‌ చెప్పుకుంటోంది.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Prabhas: ప్రభాస్ కి ఫ్రస్టేషన్ వస్తే అలా బిహేవ్ చేస్తారా.. డార్లింగ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా?

Published

on

Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ అనంతరం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఎప్పుడు చూసినా చాలా కూల్ గానే కనిపిస్తారు. ఈయన ఎప్పుడు కోప్పడిన సందర్భాలు కూడా లేవని చెప్పాలి. అయితే ప్రభాస్ ఏదైనా ఫ్రస్టేషన్లో ఉన్నప్పుడు లేదంటే సినిమాల విషయంలో కాస్త కంగారు పడినప్పుడు ఎవరిని కూడా కలవరట.

ప్రభాస్ ఏ విషయం గురించైనా కాస్త ఆలోచనలో ఉండి ఫ్రస్టేషన్ వస్తే కనుక తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా బయటకు పంపించేసి తలుపు గది వేసుకొని ఒక దమ్ము కొట్టేస్తారట అనంతరం తనకు నచ్చిన ఫుడ్ తిని ప్రశాంతంగా నిద్రపోతారని తెలుస్తుంది. ఇలా నిద్రపోయి లేచిన తర్వాత ఆయన ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయి ఫ్రెష్ మైండ్ తో బయటకు వస్తారట.

Advertisement

ఇష్టమైన ఫుడ్ తింటారు..
ఇలా ప్రభాస్ ఫ్రస్టేషన్ లో ఇలా వ్యవహరిస్తారని విషయం తెలిసి ప్రభాస్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ కోప్పడే సందర్భాలు చాలా తక్కువ అని ఆయనతో ఉన్నవాళ్లు చెబుతుంటారు ఆయన ప్రతి ఒక్కరితో చాలా సరదాగా గడుపుతూ ఉంటారని 99% తనకు కోపం అనేది రాదని తనతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు పలు సందర్భాలలో వెల్లడించారు.

Advertisement
Continue Reading

Featured

Nikhil siddarth: కొడుకు పుట్టిన తర్వాత ఆ అలవాటు మానుకున్నాను.. నిఖిల్ కామెంట్స్ వైరల్!

Published

on

Nikhil siddarth: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నటువంటి నటుడు నిఖిల్ సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన అనంతరం పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే ఈయన స్వయంబు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా షూటింగ్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈయన స్వయంబు సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.

త్వరలోనే స్వయంభూ సినిమా విడుదల తేదీ ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా తన కుమారుడికి సంబంధించిన పలు విషయాలను కూడా నిఖిల్ అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల తనకు కుమారుడు జన్మించిన సంగతి మనకు తెలిసిందే. తన కుమారుడు జన్మించారనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా తన కొడుకు బారసాల వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.

Advertisement

పార్టీలకు వెళ్లడం మానుకున్న..
ఇలా బారసాల వేడుకలను నిర్వహించిన నిఖిల్ దంపతులు తమ కుమారుడికి ఏ పేరు పెట్టారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు అయితే తన కుమారుడికి ధీర సిద్ధార్థ్ అనే పేరు పెట్టినట్లు నిఖిల్ వెల్లడించారు. అయితే తన కొడుకు పుట్టిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. పిల్లలు సరైన వాతావరణంలో పెరగాలి అందుకు మనం కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తనకు కొడుకు పుట్టిన తర్వాత నేను పార్టీలకు వెళ్లడం మానుకున్నానని తెలిపారు. వారంలో ఏదో ఒక రోజు తాను పార్టీకి వెళ్లే వాడినని ఇప్పుడు ఆ అలవాటు మార్చుకున్నాను అంటూ నిఖిల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: ఈ చిన్న పని చేస్తే చాలు ప్రభాస్ సలార్ సినిమా బైక్ గెలుచుకోవచ్చు.. ఎలాగంటే?

Published

on

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది.

ఇక ఈ సినిమా థియేటర్లలోను అదేవిధంగా డిజిటల్ మీడియాలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే డిజిటల్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా సాటిలైట్ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ సాయంత్రం 5:30కు స్టార్ మాలో ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే.

ఇలా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో సలార్ మేకర్స్ అద్భుతమైనటువంటి ఆఫర్ అభిమానులకు కల్పించారు. ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు మనం సమాధానాలు చెబితే చాలు ఈ సినిమాలో ప్రభాస్ నడిపినటువంటి ఐకానిక్ మోటార్ సైకిల్ బైక్ మీ సొంతం చేసుకోవచ్చని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Advertisement

క్విజ్ కాంటెస్ట్..
ఇలా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉండాలి అలాగే వారు పెట్టే కొన్ని కండిషన్స్ కూడా వర్తిస్తాయని వెల్లడించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి బైక్ మీ సొంతం చేసుకోవచ్చు అయితే ఇలా మేకర్ ప్లాన్ చేశారు అంటే ఈ ఎఫెక్ట్ టి ఆర్ పి రేటింగ్ పై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్లాన్స్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!