Analyst Damu Balaji : ఒకప్పుడు కలెక్షన్ కింగ్ అనిపించుకున్న మోహన్ బాబు నేడు కొడుకుల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొడుకులిద్దరూ సినిమాల్లో పెద్దగా రానించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఎక్కువగా వైరల్ అవుతుంటారు. ఇటీవలే విష్ణు మనోజ్ గొడవ పడిన వీడియో మనోజ్ షేర్ చేసి ఇంటి పరువును రచ్చకీడిస్తే దాన్ని కవర్ చేయలేక అటు మోహన్ బాబు ఇటు విష్ణు చాలా కష్టపడ్డారు. అయినా కూడా ఆ మ్యాటర్ జనాలకు అర్థమైంది. కాగా నేడు ఆస్తుల పంపకం అనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ ఇష్యూ గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

ఆస్తులను పంచనున్న మెహన్ బాబు…
తాజాగా వినిపిస్తున్న వార్త మోహన్ బాబు పిల్లలు ముగ్గురికీ ఆస్తి పంచి ఇవ్వబోతున్నారంటూ బాలాజీ తెలిపారు. నిజానికి ఆస్తి పంపకం ఎప్పుడో అయిపోయినా మరి కొన్ని ఆస్తులను మోహన్ బాబు ముందు పంచలేదట. ఇక ఇపుడు వాటిని కూడా ఇవ్వబోతున్నట్లు బాలాజీ తెలిపారు. అందులో విద్యానికేతన్ విద్యాసంస్థలు, హైదరాబాద్ లోని ఇల్లు విష్ణు, లక్ష్మి కి హైదరాబాద్ లోని కొన్ని స్థలాలు మనోజ్ కి ఇవ్వబోతున్నారట.

ఇందుకోసం రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి వెళ్లినట్లు బాలాజీ చెప్పారు. అయితే ఇప్ప్పటికే విష్ణు కి మనోజ్ కి ఆస్తి విషయంలో మరికొన్ని విషయాలలోనూ బేధభిప్రాయాలు ఉన్నాయి. ఇక తాజాగా చూస్తే మంచు లక్ష్మి కూడా విష్ణుతో పెద్దగా మాట్లాడటం లేదని ఇటీవల ఇంటర్వ్యూ ద్వారా తెలుస్తోందంటూ చెప్పారు బాలాజీ. ఇంటర్వ్యూలో కేవలం మనోజ్ గురించి అలాగే మౌనిక రెడ్డి గురించి ఎక్కువగా మాట్లాడింది అంటూ విష్ణు ప్రస్తావన ఎక్కువ తీలేదని, తాను కూడా విష్ణు కి దూరంగా ఉన్నట్లు ఆస్తి విషయంలోనే ఈ గొడవలు ఉండొచ్చని బాలాజీ అభిప్రాయపడ్డారు.




























