Anam Ramanarayana Reddy : నెల్లూరి జిల్లా రాజకీయనాయకులలో ఆనం బ్రదర్స్ అంటే తెలియని వారు ఉండరు. వారిలో ఒకరైన వేంకటగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే సీనియర్ నేత ఆనం రామ నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే ఎన్నుకునే ఎమ్మెల్సి ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు అనే ఆరోపణలు మీద వైసీపీ పార్టీ నుండి సస్పెండ్ అయ్యారు. మొదట టీడీపీ లో ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి గారు ఆపైన కాంగ్రెస్ మళ్ళీ టీడీపీ అంటూ చక్కర్లు కొట్టినా 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున నిలబడి గెలిచారు. అయితే మొదటి సంవత్సరం నుండే స్వపక్షంలో విపక్షంలా తయారైన ఈయన ప్రభుత్వంలోనే జరుగుతున్న అవినీతి మీద మీడియా సాక్షిగా మాట్లాడటం వంటివి చేయడంతో జగన్ కి ఈయన పంటి కింద రాయిలా తయారయ్యారు. ఇక తాజాగా క్రాస్ ఓటింగ్ కి పాల్పడి టీడీపీకి సహకరించారనే ఆరోపణల మీద సస్పెండ్ అయిన ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.
ఇసుక దందా గురించి సీఎం ఎమన్నారాంటే…
జగన్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే రాష్ట్రంలో జరుగుతున్న లిక్కర్ స్కాం అలాగే ఇసుక దందా గురించి జగన్ దృష్టికి తీసుకెళ్లానని అపుడు జగన్ గారు మీరే ఇలా అవినీతి అని చెబితే ఎలా, పనిగట్టుకుని ప్రతిపక్షం అలాగే పత్రికలు ఇక అదే న్యూస్ ని వేస్తూనే ఉంటారు, మీరు ఇలా అవినీతి జరుగుతోందని మాట్లాడకండి అని చెప్పారట. ఆయన దృష్టికి తీసుకెళ్లాలి గ్యాంగ్ లాగా ఏర్పడి ఇసుక మాఫియా చేస్తున్నారని చెప్పాలని అనుకున్నా కానీ ఆయనే మూల విరాట్ అని తెలియలేదు.
Advertisement
ఆ తరువాత జగన్ గారి తండ్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో సగంలో ఆగిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేయమని చెప్పినా ఆయన మాకే చెబుతారా అన్నట్లు సమాధానము ఇచ్చేవారు. నియోజకవర్గం సమస్యల గురించి వెళితే మమల్ని డబ్బులు అడగొద్ధు, మీరే మాకు కావాలంటే ఇవ్వండి లేకపోతే మేము ఎపుడైనా ఇస్తే తీసుకోండి, మీరు మమల్ని డబ్బులు అడుగుతారా ప్రశ్నిస్తారా అన్నట్లు చూసేవారు. ఇప్పుడు నన్ను వదిలించుకోవాలని డిసైడ్ అయ్యారు అందుకే నా మీద అర్థం లేని ఆరోపణలను చేసి సస్పెండ్ చేసారు. నేను టీడీపీ నుండి డబ్బు తీసుకోవడం చూసారా.. చూస్తే ఆధారాలతో బయట పెట్టమనండి అంటూ సవాల్ చేసారు.
Ravi Teja: టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు రవితేజ ఒకరు. కెరియర్ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా మొదలుపెట్టినటువంటి తన ప్రయాణం అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను ,హీరోగా సినిమా అవకాశాలను అందుకునే స్థాయికి వెళ్లారు.
ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఏమాత్రం తీరిక లేకుండా వరుస సినిమాలతో బిజీగా గడుపుతో ఉన్నారు. హిట్ ప్లాపులతో సంబంధం లేకపోయినా వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కొనసాగుతున్నటువంటి రవితేజ ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్టార్ హీరోయిన్స్ అందరి సరసన సినిమాలలో నటించారు.
ఇకపోతే తాజాగా రవితేజ ఈగల్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే ఎన్నో అంచనాల నడుమ విడుదలైనటువంటి ఈ సినిమా పెద్దగా ప్రేక్షకుల అంచనాలను మాత్రం చేరుకోలేక పోయింది. ఇక ఈ సినిమా తర్వాత రవితేజ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా పనులలో బిజీగా ఉన్నారు.
Advertisement
అనుష్క నటన సూపర్.. ఇకపోతే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రవితేజకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది. ఇప్పటివరకు మీరు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగిన ఇలియానా అనుష్క శ్రేయ త్రిష వంటి హీరోయిన్ల సరసన నటించారు అయితే వీరందరిలో మీకు ఏ హీరోయిన్ నటన అంటే ఇష్టం అనే ప్రశ్న ఎదురయింది.. ఈ ప్రశ్నకు రవితేజ సమాధానం చెబుతూ తనకు అనుష్క నటన అంటే చాలా ఇష్టమని తెలియజేశారు. ఇక వీరిద్దరి కాంబినేషన్లో విక్రమార్కుడు వంటి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ రాగ ఈ సినిమా తర్వాత బలాదూర్ అనే సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Mrunal Thakur: టీవీ సీరియల్స్ లో నటిగా నటిస్తూ అనంతరం బాలీవుడ్ సినిమా అవకాశాలను అందుకొని కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి వారిలో నటి మృణాల్ ఠాకూర్ ఒకరు. ఈమె హీరోయిన్ గా బాలీవుడ్ సినిమాలలో నటిస్తే బిజీగా ఉన్నారు. అయితే ఈమె సీతారామం అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈమెకు వరుసగా తెలుగులో నటించే అవకాశాలు వచ్చాయి. ఇకపోతే ఇటీవల నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమా ద్వారా కూడా మంచి సక్సెస్ అందుకున్నటువంటి మృణాల్ ఠాకూర్ అనంతరం విజయ్ దేవరకొండతో కలిసి ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇకపోతే ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో వరుసగా సినిమాకు సంబంధించిన అప్డేట్స్ విడుదల చేస్తూ సినిమా పై భారీ స్థాయిలో అంచనాలను పెంచుతున్నారు. ఈ క్రమంలోనే నటి మృణాల్ ఠాకూర్ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడుతూ సెలబ్రిటీలకు అప్పుడప్పుడు విరామం అవసరమని కామెంట్లు చేశారు.
Advertisement
తీరిక లేకుంట గడిపాను.. ప్రస్తుతం సినీ ప్రయాణం చాలా వేగంగా కొనసాగుతుంది. ఇలాంటి సమయంలో కుటుంబానికి సరైన సమయం కేటాయించాలని తెలిపారు. అందుకే నటీనటులు ఇండస్ట్రీకి అప్పుడప్పుడు విరామం ఇచ్చి తమ కుటుంబంతో ప్రయాణాలు చేస్తూ గడపాలని తెలిపారు. నేను రెండు సంవత్సరాల పాటు తీరిక లేకుండా కష్టపడుతూ గడిపానని కొన్నిసార్లు నిద్ర కోసం ఆరాటపడిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటూ ఈమె చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Prabhas: తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా పలు సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో ప్రభాస్ (Prabhas) ఒకరు. ఈయన కృష్ణంరాజు వారసుడిగా ఈశ్వర్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ప్రభాస్ అనంతరం ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో నటించిన బాహుబలి (Bahubali) సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ రావడంతో ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అయితే బాహుబలి సినిమా ద్వారా మాత్రమే ప్రభాస్ బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వెళ్లారని మనం భావిస్తాము కానీ ఈయన పాన్ ఇండియా స్టార్ హీరో కాకముందే బాలీవుడ్ సినిమాలలో నటించారు.
ఇలా ప్రభాస్ బాలీవుడ్ సినిమాలో నటించారు అనే విషయం చాలా మందికి తెలియదు అయితే ఈయన హీరోగా కాకుండా ఒక హీరో సినిమాలో గెస్ట్ పాత్రలో కనిపించే సందడి చేశారట అది కూడా కేవలం కొన్ని సెకండ్ల పాటు ప్రభాస్ ఆ సినిమాలో కనిపిస్తారని తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలియడంతో ప్రభాస్ నటించిన బాలీవుడ్ సినిమా ఏంటి అని ఆరా తీయడం మొదలుపెట్టారు ప్రభాస్ ఫ్యాన్స్.
Advertisement
బాహుబలి కంటే ముందే ప్రభాస్ బాలీవుడ్ మూవీ యాక్షన్ జాక్సన్ (Action Jackson) సినిమాలో నటించి మెప్పించాడు. ఈ సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్లో కనిపించాడు. ఇలా కొన్ని సెకండ్ల పాటు గెస్ట్ పాత్రలో కనిపించి సందడి చేశారు. అయితే ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ప్రభాస్ నటించిన విషయం కూడా చాలామందికి తెలియదు. ఇక బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొంది వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక త్వరలోనే ఈయన కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక భాషలలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా మే తొమ్మిదవ తేదీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా అదే సమయంలోనే ఎన్నికలు కూడా జరగబోతున్నటువంటి నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితులలో ఈ సినిమా విడుదలను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. అయితే ఇప్పటివరకు ఈ సినిమా విడుదల వాయిదా గురించి మేకర్స్ ఏ విధమైనటువంటి ప్రకటన తెలియజేయలేదు.