జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలు రెండిటిని బ్యాలన్స్ చేస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా పవన్ ఏకంగా ఒకేసారి 3 చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కు కమెడియన్ అలీ మంచి మిత్రుడు. ఈ విషయం ఇండస్ట్రీతో పాటు అభిమానులకు కూడా బాగా తెలుసు.
పలు సందర్భాల్లో పవన్.. అలీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.. పవన్ నటించిన దాదాపు అన్ని చిత్రాల్లో అలీ కనిపిస్తాడు. ఇంతటి స్నేహ సంబంధాలు ఉన్న అలీ, పవన్ మధ్య రాజకీయాల వల్ల మనస్పర్థలు ఏర్పడ్డాయి. గతసార్వత్రిక ఎన్నికల్లో భాగంగా అలీ వైసిపిలో చేరాడు. అప్పటి నుంచి వీరి మధ్య గ్యాప్ ఏర్పడింది. ఆ సమయంలో పవన్ విమర్శలకు అలీ హర్ట్ కావడం జరిగింది. ఆ తర్వాత వీరిద్దరూ కలుసుకున్న సందర్భాలు పెద్దగా లేవు. ఇదిలా వుంటే ఈమధ్యనే ఒక ఇంటర్వ్యూలో అలీ పవన్ కళ్యాణ్ తో నటించిన సినిమాలని ఉద్దేశించి మాట్లాడుతూ పవన్ తో తనకున్న స్నేహం గురించి కూడా తన మనోభావాలను బయట పెట్టాడు. ప్రస్తుతం పవన్ నటిస్తున్న 3 చిత్రాల్లో ఏదో ఒక దానిలో అలీ నటించే అవకాశాలు ఉన్నట్లు కూడా ప్రచారం జరిగుతుంది.
ఇక అసలు విషయానికొస్తే.. టాలీవుడ్ స్టార్ కమెడియన్ ఆలీ.. తన ప్రాణ మిత్రుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. అవేమిటంటే.. తాను చిరంజీవి కోసం ఆయన ఇంటికి వెళ్తున్నప్పుడు సరిగ్గా అదే సమయానికి పవన్ కళ్యాణ్ అక్కడ ఉండేవారని.. ఆయనతో అలా పరిచయం ఏర్పడిందని, అప్పటికి పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలోకి రాలేదని అన్నారు. చిరంజీవి ఇంట్లో ఆలీని రిసీవ్ చేసుకున్న పవన్ ‘అన్నయ్య ఇప్పుడే వచ్చారు.. మీరు కూర్చోండి.. కాఫీ తాగుతారా, టీ తాగుతారా’ అని సరదాగా కబుర్లు మాట్లాడేవారు. అన్నీ సినిమా కబుర్లే. ఏం సినిమాలు చేస్తున్నారు అని అడిగేవారు. ఆ తరవాత ఆయన ‘అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి’ సినిమా చేశారు. ఆ ఒక్క సినిమా తప్ప దాదాపుగా అన్ని సినిమాల్లో నేను నటించాను. ఈమధ్యకాలంలో వచ్చిన ‘అజ్ఞాతవాసి’లో నేను నటించలేదు. ఆయన హీరోగా చేసిన 25 సినిమాల్లో 23 సినిమాల్లో నేను నటించాను. అలా సినిమారంగంలోని జర్నీ వలన మా స్నేహం బలపడింది. పవన్ కళ్యాణ్ గారితో ఆఖరిగా చేసిన సినిమా కాటమరాయుడు’’ అని ఆలీ చెప్పుకొచ్చారు.
బయట జరిగే కార్యక్రమాల్లో ఆలీ కనబడినా, మాట్లాడినా పవన్ కళ్యాణ్ నవ్వడం మొదలుపెడతారు. దీని గురించి ఆలీ ఏం చెప్పారంటే.. ‘‘మేం కొన్ని సైగలు చేసుకుంటూ ఉంటాం. అవి మా ఇద్దరికీ తప్ప ఎవరికీ తెలీవు. నావి కొన్ని ఎక్స్ప్రెషన్స్ అంటే ఆయనకి చాలా ఇష్టం. అలాగే, బ్రహ్మానందం గారన్నా ఆయనకు చాలా ఇష్టం. చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మానందం గారు చాలా క్లోజ్. మెగా ఫ్యామిలీలో ఫంక్షన్ జరిగిందంటే ఆ ఫంక్షన్ కి ఆహ్వానించేవాళ్ళలో బ్రహ్మానందం గారి పేరు, నా పేరు ఖచ్చితంగా ఉంటాయి’’ అని ఆలీ తెలిపారు. అయితే ప్రతి సంవత్సరం చిరంజీవి ఇంటి నుంచి పెద్ద జాడీతో ఆవకాయ పచ్చడి పంపుతారని చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా తన తోటలోని మామిడి పండ్లు పంపేవారని అన్నారు. ప్రస్తుతం రాజకీయాలతో పవన్ బాగా బిజీగా ఉన్నారు కాబట్టి ఈ ఏడాది మామిడి పండ్లు పంపలేదని.. బహుశా వచ్చే ఏడాది పంపుతారేమో అనే ఆశాభావం వ్యక్తం చేసారు ఆలి. చదివారుగా మెగా ఫ్యామిలీతో ఆలీకున్న అనుబంధం గురించి.. మరి పవర్ స్టార్.. కమెడియన్ స్టార్ ల మధ్య స్నేహం రాశి సిమెంటంత స్ట్రాంగ్ కావాలని ఆశిద్దాం.😀
Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ అనంతరం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.
ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఎప్పుడు చూసినా చాలా కూల్ గానే కనిపిస్తారు. ఈయన ఎప్పుడు కోప్పడిన సందర్భాలు కూడా లేవని చెప్పాలి. అయితే ప్రభాస్ ఏదైనా ఫ్రస్టేషన్లో ఉన్నప్పుడు లేదంటే సినిమాల విషయంలో కాస్త కంగారు పడినప్పుడు ఎవరిని కూడా కలవరట.
ప్రభాస్ ఏ విషయం గురించైనా కాస్త ఆలోచనలో ఉండి ఫ్రస్టేషన్ వస్తే కనుక తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా బయటకు పంపించేసి తలుపు గది వేసుకొని ఒక దమ్ము కొట్టేస్తారట అనంతరం తనకు నచ్చిన ఫుడ్ తిని ప్రశాంతంగా నిద్రపోతారని తెలుస్తుంది. ఇలా నిద్రపోయి లేచిన తర్వాత ఆయన ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయి ఫ్రెష్ మైండ్ తో బయటకు వస్తారట.
Advertisement
ఇష్టమైన ఫుడ్ తింటారు.. ఇలా ప్రభాస్ ఫ్రస్టేషన్ లో ఇలా వ్యవహరిస్తారని విషయం తెలిసి ప్రభాస్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ కోప్పడే సందర్భాలు చాలా తక్కువ అని ఆయనతో ఉన్నవాళ్లు చెబుతుంటారు ఆయన ప్రతి ఒక్కరితో చాలా సరదాగా గడుపుతూ ఉంటారని 99% తనకు కోపం అనేది రాదని తనతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు పలు సందర్భాలలో వెల్లడించారు.
Nikhil siddarth: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నటువంటి నటుడు నిఖిల్ సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన అనంతరం పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు.
ఇలా నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే ఈయన స్వయంబు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా షూటింగ్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈయన స్వయంబు సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.
త్వరలోనే స్వయంభూ సినిమా విడుదల తేదీ ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా తన కుమారుడికి సంబంధించిన పలు విషయాలను కూడా నిఖిల్ అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల తనకు కుమారుడు జన్మించిన సంగతి మనకు తెలిసిందే. తన కుమారుడు జన్మించారనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా తన కొడుకు బారసాల వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.
Advertisement
పార్టీలకు వెళ్లడం మానుకున్న.. ఇలా బారసాల వేడుకలను నిర్వహించిన నిఖిల్ దంపతులు తమ కుమారుడికి ఏ పేరు పెట్టారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు అయితే తన కుమారుడికి ధీర సిద్ధార్థ్ అనే పేరు పెట్టినట్లు నిఖిల్ వెల్లడించారు. అయితే తన కొడుకు పుట్టిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. పిల్లలు సరైన వాతావరణంలో పెరగాలి అందుకు మనం కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తనకు కొడుకు పుట్టిన తర్వాత నేను పార్టీలకు వెళ్లడం మానుకున్నానని తెలిపారు. వారంలో ఏదో ఒక రోజు తాను పార్టీకి వెళ్లే వాడినని ఇప్పుడు ఆ అలవాటు మార్చుకున్నాను అంటూ నిఖిల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది.
ఇక ఈ సినిమా థియేటర్లలోను అదేవిధంగా డిజిటల్ మీడియాలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే డిజిటల్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా సాటిలైట్ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ సాయంత్రం 5:30కు స్టార్ మాలో ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే.
ఇలా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో సలార్ మేకర్స్ అద్భుతమైనటువంటి ఆఫర్ అభిమానులకు కల్పించారు. ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు మనం సమాధానాలు చెబితే చాలు ఈ సినిమాలో ప్రభాస్ నడిపినటువంటి ఐకానిక్ మోటార్ సైకిల్ బైక్ మీ సొంతం చేసుకోవచ్చని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
Advertisement
క్విజ్ కాంటెస్ట్.. ఇలా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉండాలి అలాగే వారు పెట్టే కొన్ని కండిషన్స్ కూడా వర్తిస్తాయని వెల్లడించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి బైక్ మీ సొంతం చేసుకోవచ్చు అయితే ఇలా మేకర్ ప్లాన్ చేశారు అంటే ఈ ఎఫెక్ట్ టి ఆర్ పి రేటింగ్ పై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్లాన్స్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.