రాజన్న సిరిసిల్ల జిల్లాలో తాజగా కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఈ నేపధ్యంలో జిల్లాలోని చందుర్తి, రుద్రంగి, ఎల్లారెడ్డి పేట, ఇల్లంతుకుంట తదితర మండలాలకు సంబందించిన పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ ఉంచారు.

అయితే తాజగా కురిసిన వర్షాల ధాటికి ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలంటూ రైతులు డిమాండ్ చేస్తునారు. ఈ క్రమంలో పోలీసులు ఘటన ప్రదేశానికి చేరుకుని రైతులకు సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు.



























