సినిమా అంటే రంగుల ప్రపంచం అంటారు. కానీ.., ఈ రంగుల లోకంలో ఎవరి స్థానం అయినా.., సక్సెస్ మీదే ఆధారపడి ఉంటుంది. ఇలా సూపర్ సక్సెస్ అయ్యి కూడా.. తరువాత కాలంలో సరైన విజయాలను అందుకోలేక.., తెరమరుగు అయిపోయిన స్టార్స్ ఎవ్వరో ఇప్పుడు చూద్దాం.
ఏ ఇండస్ట్రీలో అయినా.., ఒక హీరోకి లవర్ బాయ్ ఇమేజ్ రావడం అంత సులభం కాదు. కానీ.., హీరో తరుణ్ కి అతి తక్కువ కాలంలోనే లవర్ బాయ్ గా మంచి క్రేజ్ దక్కింది.
బాలనటుడిగానే సంచలనాలు సృష్టించిన తరుణ్ పెద్దయ్యాక ‘నువ్వే కావాలి, ప్రియమైన నీకు, నువ్వులేక నేనులేను, నువ్వే నువ్వే లాంటి సినిమాలతో స్టార్ అయిపోయాడు. కానీ.., తరువాత కాలంలో వరుసగా వచ్చిన ఫ్లాప్స్ తరుణ్ కెరీర్ ని దెబ్బ తీశాయి.
ఇక ఈ లిస్ట్ లో తప్పక చెప్పుకోవాల్సిన హీరో వేణు తొట్టెంపూడి. 90 చివరలలో వేణు వరుస విజయాలను అందుకున్నాడు. తరువాత కాలంలో హిట్స్ పడక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించాడు. కానీ.., ఇప్పుడు వేణు చాలా వరకు సినిమాలకి దూరం అయిపోయారు.
చాలా తక్కువ సమయంలో ఎక్కువ పేరు తెచ్చుకున్న హీరో వరుణ్ సందేశ్. హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం సినిమాతో వరుణ్ స్టార్ అయ్యాడు. కానీ.., తరువాత వరుస పరాజయాలు. మార్కెట్ పడిపోయింది. చివరికి బిగ్ బాస్ లో కూడా మెరిశాడు వరుణ్ సందేశ్. అయినా.., ఇప్పటికీ వరుణ్ కి అవకాశాలు రావడం లేదు.
ఇక బాగా హైలెట్ అయ్యి.., విజయాలను అందుకోలేక పడిపోయిన మరో స్టార్ నవదీప్. చందమామ, గౌతమ్ SSC లాంటి సినిమాలు బాగా ఆడినా ఈ హీరోకి సరైన అవకాశాలు అందలేదు. దీనితో.., ప్రస్తుతం నవదీప్ టీవీ షోలతో బిజీగా ఉన్నాడు.
ఒక్కోసారి ఎక్కడికో వెళ్ళిపోతారు అనుకున్న స్టార్స్.. ఒక్కసారిగా వెనకపడిపోతుంటారు. అలా ట్రాక్ తప్పిన స్టార్ రాజ్ తరుణ్. హ్యాట్రిక్ సక్సెస్ లతో ఇండస్ట్రీకి వచ్చాడు రాజ్ తరుణ్. కట్ చేస్తే ఇప్పుడు ఒక్క హిట్ కూడా రావడం లేదు. చేతిలో పెద్దగా సినిమాలు కూడా లేవు.
మీకు హీరో రోహిత్ గుర్తున్నారా? 6 టీన్స్ సినిమాతో 90ల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తరువాత రోహిత్ చాలా సినిమాల్లో నటించాడు. శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాలో చిరంజీవితో కూడా కలిసి నటించాడు రోహిత్. కానీ.., రోహిత్ ఖాతాలో ఒక్క మాస్ హిట్ కూడా లేదు. దీనితో రోహిత్ పూర్తిగా సినిమాలకి దూరం అయ్యాడు.
చిన్న చిన్న హీరోలు మాత్రమే కాదు .., వడ్డే నవీన్ లాంటి స్టార్ కూడా హిట్ సినిమాలు లేకనే పరిశ్రమకి దూరం అయ్యాడు. అప్పట్లో నవీన్ కి ఉండిన లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.
బాల నటుడిగా పరిశ్రమలో సూపర్ సక్సెస్ అయ్యాడు తనీష్. తరువాత హీరోగా కొన్ని సినిమాల్లో నటించాడు. అయినా.., మంచి అవకాశాలను అయితే అందుకోలేకపోయాడు. చివరికి బిగ్ బాస్ లో మెరిసిన తనీష్ తలరాత మాత్రం మారలేదు.
నటన పరంగా శివ బాలాజీకి అందరూ 100కి 100 శాతం మార్కులు వేశారు. కానీ.., ఆయనకి మాత్రం ఇండస్ట్రీ లాంగ్ రన్ లేకుండా పోయింది. ఆఖరికి బిగ్ బాస్ విన్నర్ గా నిలిచినా శివ బాలాజీకి మళ్ళీ అవకాశాలు రాకపోవడం బాధాకరం.
ఇక ఒకప్పటి స్టార్ హీరో రాజా కూడా ఈ లిస్ట్ లోకే వస్తాడు. ఆయన చేతిలో కొన్ని అవకాశాలు ఉండగానే పరిశ్రమలో ఇబ్బందులను తట్టుకోలేక బయటకి వెళ్లిపోయారు. ప్రస్తుతం పాస్టర్ గా తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు.
Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఈయన నటించిన త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ హీరోగా గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ సొంతం చేసుకున్నటువంటి రామ్ చరణ్ తదుపరి సినిమాలన్నింటిని కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు.
ప్రస్తుతం ఈయన శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా సినిమా తర్వాత బుచ్చిబాబు అనంతరం సుకుమార్ వంటి స్టార్ డైరెక్టర్ల సినిమాలలో రామ్ చరణ్ బిజీ కాబోతున్నారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రాబోతున్నటువంటి గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ఇటీవల చరణ్ పుట్టినరోజు సందర్భంగా అప్డేట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి జరగండి జరగండి అనే పాటను విడుదల చేశారు. అనంత శ్రీరామ్ రాసినటువంటి ఈ పాటను విడుదల చేయగా ఈ పాటకు అనుకున్న స్థాయిలో వ్యూస్ రాలేదని చెప్పాలి. ఈ పాట పట్ల మెగా ఫాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
18 కోట్లు ఖర్చు..
రామ్ చరణ్ వంటి స్టార్ హీరోకి పడాల్సిన పాట కాదు అంటూ కామెంట్లో పెడుతున్నారు. ఇక ఈ పాట కోసం ఏకంగా 18 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. ఈ స్థాయిలో ఖర్చు చేసిన సినిమాలోని ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా లేకపోవడంతో అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.
Rashmika: సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రష్మిక కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఉన్నటువంటి ఈమె పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస భాషా చిత్రాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఇకపోతే రష్మిక ఒకవైపు సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉంటే మరోవైపు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. అయితే ఈమె నటుడు విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉంది అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నప్పటికీ ఈ వార్తలు గురించి మాత్రం ఈమె స్పందించడం లేదు కానీ తరచూ వీరిద్దరూ వెకేషన్ లోకి వెళ్లడం ఒకే చోటే కలిసి పార్టీలు చేసుకోవడం వంటి ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
ఇదిలా ఉండగా తాజాగా మై డార్లింగ్ అంటూ విజయ్ దేవరకొండను ఉద్దేశించి ఈమె చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం పరుశురాం డైరెక్షన్లో ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈ ట్రైలర్ వీడియోని రష్మిక తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలియజేశారు.
Advertisement
ఆల్ ది బెస్ట్ మై లవ్.. మై డార్లింగ్స్ విజయ్ దేవరకొండ పరశురామ్ కు నా బెస్ట్ విషెస్. ఏప్రిల్ 5వ తేదీ విడుదల కాబోయే ఫ్యామిలీ స్టార్ సినిమా కోసం నేను ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. మీరు కచ్చితంగా హిట్ కొట్టబోతున్నారు నాకు పార్టీ కావాలి ఆల్ ద బెస్ట్ మై లవ్ మృణాల్ ఠాకూర్ అంటూ ఈ సందర్భంగా ఈమె చేస్తున్నటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.
Manoj -Charan: మెగా పవర్ స్టార్ రాంచరణ్ మార్చ్ 27వ తేదీ తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే . ఈ పుట్టిన రోజు సందర్భంగా ఈయన తన భార్య కూతురుతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుని తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. అనంతరం చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఓ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతోమంది సెలబ్రిటీలు, అభిమానులు హాజరై సందడి చేశారు. ఈ క్రమంలోనే మంచు మనోజ్ కూడా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మంచు మనోజ్ రామ్ చరణ్ ఇద్దరు కూడా మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే అంతే కాకుండా చరణ్ అంటే మనోజ్ కి చాలా అభిమానం అని పలు సందర్భాలలో తెలియజేశారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మంచు మనోజ్ రామ్ చరణ్ మంచితనం గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. చరణ్ ఎంతోమందికి ఎన్నో విధాలుగా సహాయం చేసిన ఎప్పుడు చెప్పుకోలేదు కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు సహాయం పొందిన వాళ్లు ఆయన మంచితనం గురించి చెబుతూ ఉంటారు.
Advertisement
ఆడబిడ్డకు సాయం.. ఈ క్రమంలోనే చరణ్ మంచితనం గురించి మనోజ్ మాట్లాడుతూ 2018 వ సంవత్సరంలో నేను అమెరికాలో ఉన్నాను. అర్ధరాత్రి సమయంలో దుబాయిలో ఓ ఆడబిడ్డ తన కుమార్తెతో కలిసి ఇమిగ్రేషన్ సమస్య కారణంగా అక్కడే చిక్కుకుపోయారు వెంటనే ఐదు లక్షలు కావాలి అని అడిగింది అప్పుడు నా దగ్గర అంత డబ్బు లేకపోవడంతో అర్ధరాత్రి చరణ్ కి ఫోన్ చేసి ఐదు లక్షల కావాలి అంటే ఎందుకు అని కూడా అడగకుండా ఐదు నిమిషాలలో పంపించారంటూ తన సహాయ గుణం పై మనోజ్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.