Connect with us

Featured

‘బిగ్ బాస్’ లో ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ సింగర్ నోయల్ గురించి మీకు తెలియని విషయాలు..!!

Published

on

బుల్లితెర రియాలిటీ షోలలో బిగ్ షో ‘బిగ్ బాస్’. ఆదివారం రాత్రి అట్టహాసంగా మొదలైంది. వెండితెరపైనే కాదు… బుల్లితెరపై కూడా కింగ్ అనిపించుకున్న అక్కినేని నాగార్జున హోస్ట్ గా ఈ షో ప్రారంభమైంది.

ఈసారి బుల్లితెరపై నాగార్జున డ్యూయల్ రోల్‌లో కనిపించి సందడి చేశాడు. ప్రోమోలో కనిపించినట్టు యువకుడిగా, వయసైన తాతయ్యగా తెల్లజుట్టుతో కనిపించారు. యుంగ్ నాగ్ డ్యాన్సర్ల మధ్య స్టెప్పులు వేస్తే… ఓల్డ్ నాగ్ హౌస్ ‌లోపలికి వెళ్లి మొత్తం చూపించాడు. ఈసారి ‘కుమారి 21ఎఫ్’ లో హీరో రాజ్ తరుణ్ ఫ్రెండ్స్ లో ఒకరిగా నటించిన నోయల్ సేన్ పదమూడో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వడం విశేషం. నోయల్ సేన్ సింగర్, ర్యాపర్ కూడా.. కొన్ని షోలు, కార్యక్రమాలకు హోస్ట్‌గా చేశాడు. సునీల్ సరసన ‘భీమవరం బుల్లోడు’లో నటించిన హీరోయిన్ ఎస్తేర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్యా మనస్పర్థలు రావడంతో బిగ్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి కొన్ని రోజుల ముందే తామిద్దరం విడాకులు తీసుకున్నట్టు ఇద్దరూ ప్రకటించారు.

ఇక సింగర్ నోయల్ వ్యక్తిగత వివరాల్లోకి వెళ్తే మిలటరీ డిఫెన్స్ అకాడెమీలో స్టడీస్ పూర్తి చేసిన నోయల్ ఆ తర్వాత కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ పూర్తి చేసాడు. నోయల్ తల్లి సారా బాల్యం నుంచి అతడిని క్రమశిక్షణతో పెంచి పెద్ద చేసింది. తనకిష్టమైన ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ చేసిన తర్వాత వెబ్ డిజైనింగ్ చేసాడు నోయల్. ఆ తర్వాత టాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రత్నాలు చేసాడు. మొత్తానికి ఎలా అయితేనేం తన మిత్రుడు పల్లెల రవిశంకర్ ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి “సంభవామి యుగే యుగే” చిత్రం ద్వారా సిల్వర్ స్క్రీన్ పై మెరిశాడు. ఆ తర్వాత డైరెక్టర్ తేజ చిత్రానికి ఆడిషన్స్ కి వెళ్లి అక్కడ టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిని కలిసాడు. కీరవాణి సహకారంతో “విక్రమార్కుడు” చిత్రంలో ర్యాంప్ సాంగ్ ఆలపించి అందరినీ మెప్పించాడు. ఆవిధంగా టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళికి దగ్గరయ్యాడు.

అలాగే “మంత్ర” చిత్రంలోని మహా మహా సాంగ్ తో మహా ఫేమస్ అయిపోయాడు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు 93.5 ఎఫ్ ఎం లో పనిచేసాడు. సుకుమార్ చేసిన కుమారి 21 చిత్రం నోయల్ కి మంచి బ్రేక్ నిచ్చిందని చెప్పాలి. ఆ తర్వాత హీరోయిన్ హెబ్బా పటేల్ తో కలిసి నేను నాన్న బాయ్ ఫ్రెండ్స్ చిత్రంలో నటించినా ఆ చిత్రం పెద్దగా చేసినా క్లిక్ కాలేదు. సింగర్ నోయల్ జి తెలుగులో సూపర్ సింగర్ కి పని చేసాడు. జెమినిలో యాంకరింగ్ చేసాడు. తన తోటి సింగర్స్ తో కల్సి ఒక ట్రూప్ ఏర్పాటు చేసి సొంత యూట్యూబ్ ఛానల్ లో ఎన్నో ప్రయివేట్ సాంగ్స్ ను క్రియేట్ చేసాడు. లేటెస్ట్ గా నోయల్ క్రియేట్ చేసిన ‘కవర్ సాంగ్” 3 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతానికి టాలీవుడ్ హీరోయిన్ ఎస్తేర్ కి విడాకులిచ్చినా తర్వాత బిగ్ బాస్ లో తన ప్రతిభను నిరూపించుకోవడానికి ఎంట్రీ ఇచ్చాడు మన టాలీవుడ్ సింగర్ నోయల్.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Vishal: మళ్లీ ఆయనే ఏపీ సీఎం.. హీరో విశాల్ కామెంట్స్ వైరల్!

Published

on

Vishal: సినీ నటుడు హీరో విశాల్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన సినిమాలో పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గానే ఉంటారు. అంతేకాకుండా తమిళ రాజకీయాలలో కూడా ఈయన యాక్టివ్ గా ఉంటూ తరచూ రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు.

ప్రస్తుతం హీరో విశాల్ నటించిన రత్నం సినిమా ఈనెల 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఈయన ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం హైదరాబాద్ వచ్చారు ఇలా హైదరాబాద్ వచ్చినటువంటి ఈయనకు ఏపీ రాజకీయాల గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఇలా రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురు కావడంతో ఈయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కూడా గెలిచేది వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఆయనే మరోసారి ఏపీ సీఎం అవుతున్నారని విశాల్ వెల్లడించారు. ఇక జగన్మోహన్ రెడ్డి పట్ల ఇలాంటి దాడులు ఇదివరకు ఎన్నో జరిగాయి. వాటిని ఆయన ఎదుర్కొన్నారని తెలిపారు.

Advertisement

జగన్ అంటే అభిమానం..
ఇక్కడ తప్పకుండా వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని అయితే నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదని తెలిపారు. తనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైనటువంటి అభిమానం ఉందని ఈ సందర్భంగా విశాల్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ 8 లో మాజీ కంటెస్టెంట్లు.. మళ్లీ రచ్చ షూరు!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారు ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలు అందుకున్నటువంటి పలువురు బిగ్ బాస్ సీజన్ సెవెన్ మాజీ కంటెస్టెంట్ లో తిరిగి సీజన్ 8 లో కంటెస్టెంట్లుగా పాల్గొన్న పోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇటీవల బిగ్ బాస్ 7 కార్యక్రమం ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమం ద్వారా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సినీ నటుడు శివాజీ, అమర్ దీప్, విన్నర్ పల్లవి ప్రశాంత్ ఈ ముగ్గురు కూడా సీజన్ 8 కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.

సీజన్ 7లో అత్యధిక కంటెంట్ ఇచ్చింది ఈ ముగ్గురే. శోభ శెట్టి ఉన్నప్పటికీ ఆమె పట్ల అత్యంత నెగిటివిటీ నడిచింది. అమర్ దీప్ తో శివాజీ, పల్లవి ప్రశాంత్ ఫైట్స్ హైలెట్ అయ్యాయి. అందుకే ఈ ముగ్గురిని తిరిగి సీజన్ 8 లో కూడా తీసుకురావాలని ఆలోచనలో మేకర్స్ ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటన మాత్రం వెలబడలేదు.

Advertisement

కార్తీకదీపం డాక్టర్ బాబు..
బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో ఈ ముగ్గురి మధ్య పెద్ద ఎత్తున యుద్ధం నడిచింది అయితే తిరిగి ఈ ముగ్గురు మరోసారి సీజన్ 8 లో పాల్గొన్నారు. అంటే మరోసారి రచ్చ జరుగుతుందని పలువురు భావిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రశాంత్ విన్నర్ కాగా, అమర్ రన్నర్ గా నిలిచారు. ఇక ఈ కార్యక్రమంలో కార్తీకదీపం ఫేమ్ నిరుపమ్ రాబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: వేణు స్వామి ఇంటి నుంచి ప్రభాస్ అడిగి మరీ అవి తీసుకున్నారు: వేణు స్వామి వైఫ్

Published

on

Prabhas: ప్రముఖ జ్యోతిష్యుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలను చెబుతూ ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తున్నారు.

ముఖ్యంగా ఈయన ప్రభాస్ జాతకం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రభాస్ అభిమానులు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉంటారు అంతేకాకుండా వేణు స్వామి పై భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఇలా సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు వేణు స్వామి మధ్య పెద్ద ఎత్తున మాటలు యుద్ధం జరుగుతుందని చెప్పాలి.

ఇలా వేణు స్వామి విషయంలో ఆయన అభిమానులు భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నప్పటికీ వేణు స్వామి అలాగే ప్రభాస్ మధ్య మంచి అనుబంధమే ఉందని చెప్పాలి. ఈ విషయం గురించి తాజాగా వేణు స్వామి భార్య ఓ సందర్భంలో వెల్లడించారు. ఒకసారి తన తోటలో పండిన సీతాఫలం పండ్లను వేరే వారికి పంపించగా అవి ప్రభాస్ వద్దకు చేరాయి.

Advertisement

సీతాఫలం..
అవి తిన్న ప్రభాస్ చాలా బాగున్నాయని అడిగి మరి మా ఇంటి నుంచి తెప్పించుకున్నారు అంటూ వేణు స్వామి భార్య వీణ వాణి తెలిపారు. అంతేకాకుండా ఈమె ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ బ్యాగ్ ను కూడా తయారు చేసి కానుకగా పంపించినట్లు ఈ వీడియో ద్వారా వెల్లడించారు. ఇది చూసిన అభిమానులు మీరేమో ప్రభాస్ పై అభిమానం చూపిస్తారు మీ ఆయనేమో అలా మాట్లాడతారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!