Connect with us

Featured

అవును మూడు పెళ్లిళ్లు చేసుకున్నాను.. కానీ అందులో నేను అనుభవించిన బాధ మీ ఎవరికి తెలియదు !!

Published

on

సినీ జీవితంలో ఒక స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నటి రాధిక.. తన సినీ రంగ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న నటి రాధిక. అయితే రాధిక పెళ్లిళ్ల విషయం అందరికి తెలిసిందే. అలా పెళ్లిళ్లు చేసుకున్న రాధికను అందరూ వేలెత్తి చూపే ముందు ఒకసారి తను ఏ పరిస్థితుల్లో అలా పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చింది అనే విషయాన్ని తెలుసుకోవాలి. అయితే ఆ పెళ్లిళ్లే తన జీవితాన్ని ఎన్నో చేదు అనుభవాలను మిగిల్చాయి. ఎంతటి బాధను రాధికా అనుభవించిందో చాలామందికి తెలియదు. రాధిక పెద్ద స్టార్ హీరోయిన్. కానీ తనలో ఉన్న లోపం ఏంటంటే తన గురించి తాను పట్టించుకోకపోవడం. పెళ్లి విషయంలోను అదే తొందరపాటు నిర్ణయం తీసుకుంది.

1984 లో నటుడు, క్రెయేటర్, దర్శక, నిర్మాత అయిన ప్రతాప్ పోతాన్ తో రాధికకు పెళ్లి జరిగింది. అలాగే ఆయన బాగా డబ్బున్న వాడు, ఒక క్రియేటివ్ అలాగే చాలా మంచివాడు అనుకుని పెళ్లి చేసుకుంది. కానీ, అతడు ఒక మనసు లేని వ్యక్తి అని రాధికకు తెలియటానికి ఎన్నో రోజుల సమయం పట్టలేదు. పెళ్లి జరిగిన రెండు సంవత్సరాలకే అతని వ్యక్తిత్వం గురించి తెలుసుకుని, అతనితో ఇమడలేక ఇద్దరూ విడిపోవడం జరిగింది.

అయితే విడాకుల తర్వాత ప్రతాప్ పోతన్ రాధిక వ్యక్తిత్వం గురించి ప్రెస్ మీట్ పెట్టి మరీ రాధిక అలాంటిది.. ఇలాంటిది.. అని మీడియా ముందు రాధికా గురించి చెడుగా చెప్పటానికి ట్రై చేశాడు. కానీ, తన గురించి తన భర్త ఇంత చెడుగా చెబుతున్నా కానీ ఒక్క మాట కూడా తన భర్త గురించి చెడుగా చెప్పలేదు అంటే రాధిక వ్యక్తిత్వం ఏంటో అర్ధం అవుతుంది. 1986 లో వీరు ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు. కానీ ఆ ప్రభావం వృత్తి మీద పడనీయకుండా సినిమాల్లో నటిస్తునే వచ్చింది. అలాగే ఆ సమయానికి తాను ఒక స్థాయిలో ఉంది కూడా. నిజానికి ఒక వైఫల్యం నుంచి మనం ఒక పాఠం నేర్చుకోవాలి. లేదంటే ఆ వైఫల్యమే మరొక వైఫల్యానికి కారణం అవుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. కానీ రాధిక వైఫల్యాన్ని పాఠం లాగా నేర్చుకోలేదు.

మళ్ళీ ఒక బ్రిటన్ దేశస్థుడు అయిన రిచర్డ్ హార్డ్ ను పెళ్లి చేసుకుంది. అయితే ఈ బంధం కూడా ఎన్నో రోజులు నిలవలేదు. అయితే ఆ పెళ్లి జీవితంలో చేసిన అతి పెద్ద తప్పుగా రాధిక ఇప్పటికీ చెబుతూనే ఉంటుంది. ఒక బాధను ఎలా అర్థం చేసుకోవాలి అన్న విషయం అతనికి తెలియదు. ఆ విషయం తెలుసుకునే సమయానికి రాధిక ఆస్తి సగభాగం వరకూ కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. కొద్దికాలం తర్వాత మళ్ళీ ఆ బంధం తెగిపోయింది. సినీ ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నో సంవత్సరాలు అయింది రాధికకు. అయితే వాళ్ళిద్దరి ప్రేమకు అనుబంధంగా ఒక కూతురు పుట్టింది. ఆమె పేరు రేయాన్. అయితే ఆ కూతురే తన జీవితం, సర్వస్వంగా అనుకుంది. తెలుగు, హిందీ, కర్ణాటక, మలయాళం ఇలా అన్ని భాషల సినిమాల్లో నటించేసింది రాధిక. దాదాపు అందరి స్టార్ హీరోలతో నటించేసింది. అయితే ఒకానొక సమయంలో క్రమంగా వెండితెర మీద రాధిక నల్లపూస అయిపోయింది. అసలు సినిమాలు చేయడమే ఒకానొక సందర్భంలో మాని వేసింది. ఆస్తి మొత్తం కరిగిపోయింది. ఎక్కడా లేని అప్పులు అప్పుడు గానీ తనకు తెలిసి రాలేదు. రాధిక తన గురించి తాను తెలుసుకునే సమయానికి కోటిన్నర రూపాయల అప్పు మిగిలింది. సంపాదించినది అంతా పోయింది. తన భవిష్యత్తు, కూతురు భవిష్యత్తును తలచుకుని కన్నీరు మున్నీరు అయింది. తన ఆస్థి అంతా పోగా ఒక్క ఇల్లు మాత్రమే మిగిలింది. అప్పుడుగాని తనకు అర్ధం అయింది మనుషుల గురించి.. డబ్బు ఉన్నపుడు చుట్టూ తియ్యని మాటలతో చేరతారు.. అదే డబ్బు పోయాక కనుమరుగవుతారు అని.

అయితే రాధిక కు ఆత్మాభిమాని ఎక్కువే అని చెప్పాలి. డబ్బులు పోయిన, అప్పులు కళ్ల ముందు మెదులుతున్న గాని దేహి అని ఎవరిని అడగలేదు. బ్యాంకు బ్యాలన్స్ లేదు, చేతిలో చిల్లి గవ్వ లేదు.. ఏమి చేయాలో తోచని పరిస్థితులలో ఇల్లు ఒక్కటి కనిపించింది. అందుకనే 1993 -94 మధ్య కాలంలో మిగిలిన ఆ ఒక్క ఇంటిని తాకట్టు పెట్టి అప్పులు తీర్చాలి అనుకుంది. ఆ రోజు ఆదివారం.. ఇల్లు కొనుగోలు చేసుకోవడానికి బయ్యర్లు వచ్చి పోతున్నారు. అదే సమయంలో తనకి సన్నిహితుడు అయిన నంద కుమార్ తన ఇంటికి వచ్చాడు. అయితే ఆయన స్వతహాగా నటుడు, జ్యోతిష్యుడు.. అయితే ఆయన రాధికను ఇల్లు అమ్మవద్దు.. నీకు రాబోయే కాలంలో మంచి భవిష్యత్తు ఉంది అని చెప్పాడు. కానీ రాధిక ఆ మాటలు నమ్మలేదు. ఇల్లు అమ్మకపోతే అప్పులు ఎలా తీర్చాలి అని నంద కుమార్ ను అడిగింది. అప్పుడు రాధిక దృష్టి బుల్లితెరపై పడింది. కష్టం వచ్చింది కదా అని ఇల్లు అమ్మడమా.. లేక కష్టాలను దాటి ముందుకువెళ్ళే ప్రయత్నం చేయాలా అని ముందుకు అడుగులు వేసింది. అలా ఒక సీరియల్ స్క్రిప్ట్ తో ముందుకు సాగింది. ఒకవేళ ఆ ప్రయత్నం కూడా విఫలం అయితే ఉన్న ఆ ఒక్క ఇల్లు కూడా పోయి నడి రోడ్డున పడ్డ ప్రమాదం ఉంది అని సన్నిహితులు హెచ్చరించిన గాని తన మీద తనకు ఉన్న నమ్మకంతో ముందుకు అడుగువేసినది. అలా తన తండ్రి రాధా నాయుడు, కూతురు రేయాన్ పేరుతో కలిపి “రాడాన్” అనే ఒక టెలివిజన్ సంస్థను స్థాపించి సీరియల్స్ తో ముందుకు సాగింది. ఇంకా బుల్లితెరపై రాధిక హవా మొదలైపోయింది. బుల్లితెరపై విజయం సాధించింది. ఇంకా సీరియల్స్ మీద సీరియల్స్ చేస్తూ బాగా బిజీ అయిపోయింది. కేవలం ఒక్క భాషలోనే కాకుండా చాలా భాషల్లో సీరియల్స్ తీస్తుంది. అలాగే పెద్ద పెద్ద నిర్మాతలు సైతం రాధికను చూసి నివ్వెరపోయారు.

అలానే ఏక్తాకపూర్ వంటి నిర్మాతలు కూడా రాధిక టెలివిజన్ రంగం పై దృష్టి పెట్టారు. అయితే అందరికన్నా విజయాన్ని ముందు చూసిన ఘనత ఒక్క రాధిక కి మాత్రమే సొంతం అయింది. దక్షిణాది భాషలన్నీ అయిపోగా, గుజరాతీ భాషల్లో కూడా సీరియల్స్ నిర్మిస్తోంది రాడాన్ సంస్థ. తెలుగులో రెండు సినిమాలు తమిళంలో ఆరు సినిమాలు కూడా తీశారు. త్వరలోనే హిందీలో కూడా అడుగుపెట్టబోతోంది. అలాగే ఇతర దేశాలైన శ్రీలంక, అమెరికా వంటి దేశాల్లో కూడా పలు భాషల్లో అలరించబోతోంది రాడాన్ సంస్థ. ఈ సంస్థ స్థాపించిన నాలుగేళ్లలోనే ఒక కార్పొరేట్ సంస్థగా మారిపోయింది అంటే 1999 లోనే ఒక కార్పొరేట్ సంస్థ గా వ్యవహరిస్తోంది. ఇప్పుడు రాడాన్ సంస్థ 300 కోట్ల ఆదాయాన్ని రాబడుతుంది. అంటే అందులో రాధిక కష్టం ఎంత ఉందో అన్న విషయం అర్థమైపోతుంది. రెండు పెళ్ళిళ్ళతో పూర్తిగా అప్పులపాలై పోయి మళ్లీ విజయాన్ని అందుకున్న ఏకైక నటి రాధిక అని చెప్పడంలో అతిశయోక్తి లేదు,

1995 సంవత్సరంలో ప్రేమకథా చిత్రం సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో శరత్ కుమార్, రాధికను నన్ను పెళ్లి చేసుకుంటావా అని ప్రపోజ్ చేయగా అందుకు నిరాకరించింది. మొదట తాను తీసుకున్న రెండు పెళ్ళిళ్ళ విషయంలో తాను తీసుకున్న తప్పుడు నిర్ణయం గుర్తొచ్చింది. ఈసారి ఏదైనా కానీ తన తల్లి నిర్ణయానికే వదిలేస్తున్నాను అని శరత్ కుమార్ తో చెప్పింది. అలా శరత్ కుమార్ రాధిక తల్లిని ఒప్పించి రాధిక ని పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికీ ఒక బాబు కూడా ఉన్నాడు ఇవన్నీ చూసిన తర్వాత రాధిక మూడు పెళ్లిళ్ల విషయంలో ఎంత కష్టం ఉంది అన్న విషయం ఎవరికైనా అర్థం అవుతుంది. అందుకని పొరపాటున కూడా ఒకరి విషయంలో తొందరపడి ఏలాంటి అభిప్రాయాలకు రాకూడదని రాధిక జీవితమే ఒక సాక్ష్యం. అయితే రాధిక ఇప్పుడు సీరియల్స్ తో పాటుగా, కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటిస్తుంది.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Prabhas: ప్రభాస్ కి ఫ్రస్టేషన్ వస్తే అలా బిహేవ్ చేస్తారా.. డార్లింగ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా?

Published

on

Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ అనంతరం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఎప్పుడు చూసినా చాలా కూల్ గానే కనిపిస్తారు. ఈయన ఎప్పుడు కోప్పడిన సందర్భాలు కూడా లేవని చెప్పాలి. అయితే ప్రభాస్ ఏదైనా ఫ్రస్టేషన్లో ఉన్నప్పుడు లేదంటే సినిమాల విషయంలో కాస్త కంగారు పడినప్పుడు ఎవరిని కూడా కలవరట.

ప్రభాస్ ఏ విషయం గురించైనా కాస్త ఆలోచనలో ఉండి ఫ్రస్టేషన్ వస్తే కనుక తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా బయటకు పంపించేసి తలుపు గది వేసుకొని ఒక దమ్ము కొట్టేస్తారట అనంతరం తనకు నచ్చిన ఫుడ్ తిని ప్రశాంతంగా నిద్రపోతారని తెలుస్తుంది. ఇలా నిద్రపోయి లేచిన తర్వాత ఆయన ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయి ఫ్రెష్ మైండ్ తో బయటకు వస్తారట.

Advertisement

ఇష్టమైన ఫుడ్ తింటారు..
ఇలా ప్రభాస్ ఫ్రస్టేషన్ లో ఇలా వ్యవహరిస్తారని విషయం తెలిసి ప్రభాస్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ కోప్పడే సందర్భాలు చాలా తక్కువ అని ఆయనతో ఉన్నవాళ్లు చెబుతుంటారు ఆయన ప్రతి ఒక్కరితో చాలా సరదాగా గడుపుతూ ఉంటారని 99% తనకు కోపం అనేది రాదని తనతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు పలు సందర్భాలలో వెల్లడించారు.

Advertisement
Continue Reading

Featured

Nikhil siddarth: కొడుకు పుట్టిన తర్వాత ఆ అలవాటు మానుకున్నాను.. నిఖిల్ కామెంట్స్ వైరల్!

Published

on

Nikhil siddarth: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నటువంటి నటుడు నిఖిల్ సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన అనంతరం పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే ఈయన స్వయంబు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా షూటింగ్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈయన స్వయంబు సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.

త్వరలోనే స్వయంభూ సినిమా విడుదల తేదీ ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా తన కుమారుడికి సంబంధించిన పలు విషయాలను కూడా నిఖిల్ అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల తనకు కుమారుడు జన్మించిన సంగతి మనకు తెలిసిందే. తన కుమారుడు జన్మించారనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా తన కొడుకు బారసాల వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.

Advertisement

పార్టీలకు వెళ్లడం మానుకున్న..
ఇలా బారసాల వేడుకలను నిర్వహించిన నిఖిల్ దంపతులు తమ కుమారుడికి ఏ పేరు పెట్టారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు అయితే తన కుమారుడికి ధీర సిద్ధార్థ్ అనే పేరు పెట్టినట్లు నిఖిల్ వెల్లడించారు. అయితే తన కొడుకు పుట్టిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. పిల్లలు సరైన వాతావరణంలో పెరగాలి అందుకు మనం కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తనకు కొడుకు పుట్టిన తర్వాత నేను పార్టీలకు వెళ్లడం మానుకున్నానని తెలిపారు. వారంలో ఏదో ఒక రోజు తాను పార్టీకి వెళ్లే వాడినని ఇప్పుడు ఆ అలవాటు మార్చుకున్నాను అంటూ నిఖిల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: ఈ చిన్న పని చేస్తే చాలు ప్రభాస్ సలార్ సినిమా బైక్ గెలుచుకోవచ్చు.. ఎలాగంటే?

Published

on

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది.

ఇక ఈ సినిమా థియేటర్లలోను అదేవిధంగా డిజిటల్ మీడియాలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే డిజిటల్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా సాటిలైట్ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ సాయంత్రం 5:30కు స్టార్ మాలో ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే.

ఇలా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో సలార్ మేకర్స్ అద్భుతమైనటువంటి ఆఫర్ అభిమానులకు కల్పించారు. ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు మనం సమాధానాలు చెబితే చాలు ఈ సినిమాలో ప్రభాస్ నడిపినటువంటి ఐకానిక్ మోటార్ సైకిల్ బైక్ మీ సొంతం చేసుకోవచ్చని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Advertisement

క్విజ్ కాంటెస్ట్..
ఇలా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉండాలి అలాగే వారు పెట్టే కొన్ని కండిషన్స్ కూడా వర్తిస్తాయని వెల్లడించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి బైక్ మీ సొంతం చేసుకోవచ్చు అయితే ఇలా మేకర్ ప్లాన్ చేశారు అంటే ఈ ఎఫెక్ట్ టి ఆర్ పి రేటింగ్ పై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్లాన్స్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!