Connect with us

Featured

నటుడు ప్రసాద్ బాబు కొడుకు ఒక హీరో అని, కోడలు హీరోయిన్ అని మీకు తెలుసా ?

Published

on

తెలుగు సినీ పరిశ్రమలో చాలామందికి నటించే టాలెంట్ ఉన్న కానీ, వారికి అవకాశాల్లేక మరుగున పడిపోయిన వారు ఎందరో. ఇలా టాలెంట్ కలిగి ఉండి, కేవలం సపోర్టింగ్ రోల్స్ కు మాత్రమే నటించిన వారిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రసాద్ బాబు కూడా ఒకరు. ఈయన ఎన్నో సినిమాల్లో విలన్ గా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు.

అంతేకాదు కొన్ని బుల్లితెర అ సీరియల్స్ లో కూడా నటించాడు. ఈయన టాలీవుడ్ పరిశ్రమలో మొట్టమొదటిసారిగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో పాటు ఈయనకు కూడా పునాది రాళ్లు మొదటి సినిమా. ప్రసాద్ బాబు చిరంజీవి మంచి మిత్రులు కూడా. అయితే ప్రసాద్ బాబు కేవలం మంచి క్యారెక్టర్ ఉన్న సినిమాల్లో మాత్రమే నటించే వారు. అంతే కాదు చిరంజీవి నటించిన చాలా చిత్రాలకు లో ప్రసాద్ నటించారు. చిరంజీవితో పాటు యముడికి మొగుడు, రుద్రవీణ, జేబుదొంగ వంటి సినిమాలలో సపోర్టింగ్ క్యారెక్టర్ లను ఆయన నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు.

ఇక ఈయన పర్సనల్ జీవితం విషయానికొస్తే.. ఈయన మార్చి 29, 1950 లో ఒంగోలు లో జన్మించారు. ఈయన తెలుగు, తమిళ సినిమాల్లో అనేక సహాయ పాత్రల్లో నటించారు. ఏకంగా 700లకు పైగా సినిమాల్లో నటించాడంటే అసలు నమ్మలేము. ఈయన ఎన్నో నాటకాలు వేసిన తరువాత అందరిలాగే సినిమా రంగం వైపు ఉన్న మక్కువ తో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ముందుగా ఆయన సినీ ఇండస్ట్రీలో చిన్న చిన్న క్యారెక్టర్ రోల్స్ చేస్తూ… ఆ తర్వాత విలన్ క్యారెక్టర్ చేసే స్థాయికి చేరుకున్నారు. ఈయన నటించిన సినిమాలలో యముడికి మొగుడు, జేబుదొంగ, త్రినేత్రుడు, అంతులేని కథ, కృష్ణావతారం, నేటి గాంధీ, రుద్రవీణ, ఘటోత్కచుడు, మురారి ఇలా అనేక తెలుగు సినిమాల్లో తన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఈయన మురారి సినిమాలో మహేష్ బాబు కి అన్న పాత్రలో నటించి మంచి గుర్తింపును పొందారు. ఈయన కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా నటన చేశారు. చిన్న కోడలు, రాములమ్మ, జయం లాంటి సీరియల్స్ ఈయన బుల్లి తెరపై నటించారు.

ఈయన కుటుంబంలో కొడుకు, కోడలు కూడా స్టార్ నటులే. ప్రసాద్ బాబు కు ఓ కొడుకు, ఓ కూతురు ఉన్నారు. కొడుకు పేరు శ్రీకర్. ఈయన తమిళ్, తెలుగు సీరియల్స్ లో నటించారు. అంతేకాదు తమిళంలో అనేక సినిమాల్లో కూడా హీరోగా నటించి మంచి పేరు పొందాడు.

ఇకపోతే శ్రీకర్ భార్య కూడా హీరోయిన్. ఆమె పేరు సంతోషి. ఈమె టాలీవుడ్ లో మొదటగా తేజ డైరెక్షన్లో వచ్చిన ‘ జై ‘ సినిమా లో నవదీప్ సరసన హీరోయిన్ గా నటించారు. ఆ తర్వాత నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఒక్కడే, బంగారం, ఢీ సినిమాలలో ఈవిడ నటించారు. అంతేకాదు ఈవిడ తెలుగు బుల్లితెరపై ప్రసారమైన నెంబర్ 23 మహాలక్ష్మి నివాసం సీరియల్ లో కూడా ప్రధాన పాత్రలో నటించింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా అనేక సీరియల్స్ లో నటించి అక్కడి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. వీరిద్దరికీ ఒక పాప కూడా ఉంది. వీరిద్దరు దంపతులు ఇప్పటికి కూడా కొన్ని సీరియల్స్ లో నటిస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Teenmar Mallanna: సమంత నాగచైతన్య విడాకులకు ఫోన్ ట్యాపింగ్ కారణం: తీన్మార్ మల్లన్న

Published

on

Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్‌ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్‌ లీడర్‌ ప్రమేయం ఉందని వెల్లడించారు.

ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.

Advertisement

పొలిటికల్ లీడర్..
ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.

Advertisement
Continue Reading

Featured

Anasuya: పవన్ కళ్యాణ్ గొప్ప లీడర్.. పిలిస్తే జనసేన ప్రచారానికి వెళ్తా: అనసూయ

Published

on

Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

sut

ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.

ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.

Advertisement

పార్టీని కాదు, నాయకుడిని చూడాలి..
పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Ananya Nagalla: ఆ హీరో లాంటి భర్త కావాలంటున్న పవన్ హీరోయిన్.. అమ్మడి ఆశలు మామూలుగా లేవు?

Published

on

Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమెకు తదుపరి పలు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఈ సినిమా తర్వాత ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ నాకు కాబోయే భర్త ఎలా ఉండాలి అంటే హాయ్ నాన్న సినిమాలో హీరో నాని క్యారెక్టర్ ఉంది కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అబ్బాయి భర్తగా రావాలని కోరారు.

Advertisement

హీరో నాని..
గ్రీన్ ఫ్లాగ్ అయ్యి ఉండాలి… రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉండాలనీ కోరుకునే అబ్బాయి భర్తగా రావాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉన్న క్వాలిటీస్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇది చూసినటువంటి నెటిజన్ లు అమ్మడికి కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!