టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది ఎన్నో సినిమాల్లో నటించిన కానీ, చివరికి సంపాదన మాత్రం లేకుండా ఎంతో మంది ఇబ్బందులు పడిన వారిని మనం చాలా మందినే చూశాం. అయితే కేవలం తెలుగులోనే మాత్రం కాకుండా మిగతా భాషల్లో కూడా వివిధ సినిమాల్లో వివిధ క్యారెక్టర్లు వేస్తూ పేరు అంతగా లేకపోయినా సంపాదన గడించిన వారు ఎందరో ఉన్నారు కూడా. ఇక అసలు విషయంలోకి వెళితే.. మెగాస్టార్ స్నేహితుడు కమెడియన్ సుధాకర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కమెడియన్ సుధాకర్ తమిళ భాషలో ఒకానొక సమయంలో స్టార్ హీరోగా చేసిన వ్యక్తి. ఒకవైపు తమిళంలో హీరోగా నటిస్తూనే మరోవైపు తెలుగులో స్టార్ కమెడియన్ గా ఎదిగారు.
ఇక ఈయన ఫిబ్రవరి 1,1956 సంవత్సరంలో జన్మించారు. ఈయన స్వస్థలం ప్రకాశం జిల్లాలోని మార్కాపురం. సుధాకర్ తండ్రిగారు రత్నం. ఈయన ఓ డిప్యూటీ కలెక్టర్. తల్లి పేరు కటాక్షమ్మ. ఈ ఇరువురి దంపతులకు మొత్తం ఏడు మంది మగ సంతానం. ఇందులో సుధాకర్ చివరి వ్యక్తి. తండ్రి ఉద్యోగంలో విధులు నిర్వర్తించడానికి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహించడం కారణంగా ఆయన తన కుటుంబాన్ని తీసుకోని వెళ్లి అక్కడ వివిధ ప్రాంతాలలో విధులు నిర్వహించారు. ఇందులో భాగంగానే కర్నూలు జిల్లా కోవెలకుంట్ల లో సుధాకర్ జన్మించారు.
ఆయన బాల్యం మొత్తం కోవెలకుంట్ల, ఆదోని, కోడుమూరు, కర్నూల్, బోధన్, కాకినాడ మొదలగు ప్రాంతాలలో గడిచింది. ఆయన విద్యాభ్యాసం ఎక్కువగా ఏలూరు, గుంటూరు లో జరిగింది. ఇక తను సినిమా మొదటి రోజుల్లో చిరంజీవి, హరి ప్రసాద్, నారాయణరావు లతో కలిసి ఒకే గదిలో నివసించేవారు. అలా మొదట్లో సినిమాల కోసం వేటలో ఉన్న సుధాకర్ కు ఆ సమయంలో దర్శకుడిగా ఉన్న భారతీరాజాను కలవడం తో ఆయనకు కిళుక్కెమ్ పోంగెమ్ రెయిల్ అనే సినిమాలో నటించాడు. ఈ అప్పట్లో భారీ సినిమా విజయం సాధించింది.
తమిళంలో స్టార్ హీరో గా కొనసాగిన సుధాకర్ జూన్ 29, 2010 న అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరి కోమాలోకి వెళ్లిపోయారు. ఈయన తెలుగులో సృష్టి రహస్యలు అనే సినిమా ద్వారా తెలుగు చిత్ర సీమకు పరిచయం అయ్యారు. సుధాకర్ తెలుగులో ఒక కమెడియన్ గా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక సేవలను టాలీవుడ్ కి అందించారు. ఈయన తెలుగులో కొన్ని సినిమాలలో నటనకు ఆయన చాలా మంచి పేరు సంపాదించుకున్నారు. ఈయన చిరంజీవి కంటే ముందుగా హీరోగా తమిళంలో సినిమా చేశారు.
ఇక ఈయనతో తమిళంలో హీరోయిన్ అయిన రాధిక తో కలిసి 18 సినిమాల్లో నటించారు. అంతే కాకుండా తమిళంలో మొత్తం 45 సినిమాల వరకు ఈయన నటించారు. వీరి స్నేహితులైన చిరంజీవి, హరి ప్రసాద్ ల కంటే ఈయన చాలా ముందు ఉండేవారు. అయితే తమిళ ఇండస్ట్రీ, రాజకీయాల్లో వచ్చిన మార్పుల కారణాల వల్ల ఆయన తమిళంలో సినిమాలు చేయడం మానేశారు. ఆ తర్వాత కేవలం టాలీవుడ్ సినిమాలకే పరిమితం అయ్యారు. ఇక టాలీవుడ్ లో ఆయన విలన్ క్యారెక్టర్స్, అలాగే కమెడియన్ గా స్థిరపడిపోయారు. అంతే కాదు ఆయన కొన్ని చిత్రాలను కూడా నిర్మించాడు.
అందులో మొదటగా చిరంజీవితో కలిసి యముడికి మొగుడు సినిమా ను కూడా నిర్మించాడు. సుధాకర్ తో పాటు వారి స్నేహితులు కూడా కలిసి ఆ సినిమాను నిర్మించారు. వీటితోపాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో మరికొన్ని సినిమాలను కూడా ఆయన నిర్మించాడు. ఇక పెద్దరికం లాంటి కొన్ని సినిమాలలో సుధాకర్ నటన ను బయటకు తీసుకువచ్చాయి. శుభాకాంక్షలు,స్నేహితులు వంటి సినిమాలకు ఆయనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి నంది అవార్డులు గెలుచుకున్నారు.
అయితే 2010 సంవత్సరంలో అనారోగ్యం కారణంగా కోమాలోకి వెళ్లిన ఆయన 2015 సంవత్సరంలో తిరిగి కోలుకున్నారు. ఆ తర్వాత కూడా తాను సినిమాల్లో నిర్మించబోతున్నట్లు తెలియజేశాడు. అయితే తాను నటన జీవితంలో హీరోగా, విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా వివిధ రూల్స్ పోషించిన ఆయన ఆస్తులను అప్పట్లో బాగానే కూడబెట్టారని టాలీవుడ్ టాక్. ఆయన ఆస్తులు కొన్ని కోట్ల రూపాయలు ఉంటాయని చాలామంది చెప్పేవారు. ఆయన మిత్రుడు నారాయణ రావు కూడా ఈ విషయాన్ని చెప్పకనే చెప్పారు. సుధాకర్ కోమలో ఉన్నప్పుడు ఆయన కుటుంబానికి అన్ని విధాల తన స్నేహితులు నారాయణరావు, చిరంజీవి లు సహాయం చేశారు.
AP Politics: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రోజురోజుకు మద్దతు పూర్తిగా తగ్గిపోతుందని చెప్పాలి.ఇలా వైసిపికి మద్దతు తగ్గిపోతూ కూటమికి భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం కూటమికి మద్దతు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇటీవల చిరంజీవిని సీఎం రమేష్, పంచకర్ల రమేష్ కలిసారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. తెలుగుదేశం బిజెపి, జనసేన కూటమిగా ఏర్పడటం శుభ పరిణామం అని తెలిపారు. చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని తెలిపారు.
ఇలా నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను అంటే కేవలం తమ్ముడు పవన్ కళ్యాణ్ కారణం ఈయన తెలిపారు. సీఎం రమేష్ నా చిరకాల మిత్రుడు చాలా మంచివారు. పంచకర్ల రమేష్ నా ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరు నాకు కావలసినవారు ఇద్దరు సమర్థులే వారికి ఓటు వేసే గెలిపించాలి అంటూ చిరంజీవి తెలిపారు. వీరిద్దరు గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధికి దోహదపడతారని చిరంజీవి తెలిపారు.
Advertisement
మెగా ఫాన్స్ ఓట్లు కూటమికే.. ఈ విధంగా చిరంజీవి కూటమికి మద్దతు తెలియజేయడంతో మెగా ఫాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే చిరంజీవి ఇలా పరోక్షంగా మద్దతు తెలియజేయడంతో కూటమికి భారీ స్థాయిలో అభిమానుల ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఇది జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాకే అని స్పష్టంగా తెలుస్తుంది.
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీ తరఫున 21 మంది ఎన్నికలలో పోటీ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ భీమవరంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం కాస్త సంచలనగా మారింది. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఆ వ్యక్తుల జోబులలో కత్తులు కనిపించడం సంచలనంగా మారింది.
ఈ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వేరువేరుగా పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ యువకులు పోలీసులపైనే దాడికి ప్రయత్నించి తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ పోలీసులు వీరిని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. ఇక వీరి వద్ద కత్తి ఉండడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేశారు.
Advertisement
దాడికి ప్రయత్నమా.. ఈ సభలో ఇలా వీరిద్దరూ అనుమానాస్పదంగా కత్తులతో కనిపించడంతో బహుశా జోబు దొంగలు అయ్యి ఉంటారా లేదంటే ఎవరిపైన దాడి చేయడానికి ఇలా వచ్చారా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఇద్దరు యువకులు కూడా భీమవరంలోని బలుసుమూడి, దుర్గాపురానికి చెందిన యువకులుగా వారిని పోలీసులు గుర్తించారు.
AP Politics: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలి జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత చూపిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈమె కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి పై పోటీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇటీవల ఈమె నామినేషన్ కూడా దాఖలు చేశారు.
ఈ క్రమంలోనే ఈమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ విషయం గురించి షర్మిల మాట్లాడుతూ ఒక గులకరాయికే హత్యాయత్నం అంటూ తన సొంత పత్రికలో పెద్ద ఎత్తున వార్తలు రాశారు అలాగే బ్యానర్లు కూడా కట్టారు.
ఒక చిన్న గులకరాయికి ఇంతలా విలవిలలాడితే ఏడుసార్లు గొడ్డలితో వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు ఏమైంది జగనన్న అంటూ ఈమె ప్రశ్నించారు. తన తండ్రి దారుణంగా హత్యకు గురి అయితే గత ఐదు సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నటువంటి సునీత మీకు కనపడలేదా అంటూ ప్రశ్నించారు.
Advertisement
కంచుకోటకు బీటలు.. ఈ విధంగా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి వైయస్ షర్మిల సునీత పదేపదే మాట్లాడుతూ వైసీపీకి ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్నటువంటి కడపలో ఈసారి షర్మిల దెబ్బకు కంచుకోట బద్దలు కాబోతోందని తెలుస్తోంది. ఇలా వీరి వ్యాఖ్యలతో అక్కడ ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.