Connect with us

Featured

నందమూరి హీరో కళ్యాణ్ చక్రవర్తి ఇండస్ట్రీకి ఎందుకు దూరమయ్యారో తెలుసా ??

Published

on

తెలుగు ఇండస్ట్రీలో నందమూరి కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సీనియర్ ఎన్టీఆర్ నుండి జూనియర్ ఎన్టీఆర్ వరకు తెలుగు తెరపై స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న వారే.. ఆ కుటుంబం నుంచి వచ్చిన మరో హీరో కళ్యాణ చక్రవర్తి అనే విషయం చాలా మందికి తెలియదు. 1980 దశకంలో ఎంతో మంది కథానాయకులు తెలుగు తెరకు పరిచయం అయ్యారు. సుమన్, రాజశేఖర్, నాగార్జున, వెంకటేష్, సురేష్, శ్రీకాంత్ లాంటి ఎంతో మంది హీరోలు తెలుగు తెరకు పరిచయమయ్యారు. అలా 1988లో అత్తగారు స్వాగతం అంటూ ఎన్టీ రామారావు సోదరుడు ఎన్ త్రివిక్రమరావు కొడుకు నందమూరి కళ్యాణ్ చక్రవర్తి వెండితెరకు పరిచయమయ్యారు.

1988 లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో భానుమతి రామకృష్ణ ప్రధానపాత్రలో వచ్చిన ‘అత్తగారు స్వాగతం’ చిత్రంలో అశ్విని తో జత కడుతూ హీరో కళ్యాణ్ చక్రవర్తి వెండితెరపై కనిపించారు. అయన తోలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత హీరోయిన్ కల్పనతో ‘మామ కోడళ్ళ సవాల్’ లో చిందేశారు. తర్వాత కళ్యాణ్ చక్రవర్తి హీరోయిన్ ఊర్వశి తో ‘ఇంటి దొంగ’ చిత్రంలో నటించారు. ఖుష్బు హీరోయిన్ గా కళ్యాణ్ చక్రవర్తి ‘ప్రేమ కిరీటం’ సినిమాల్లో కనిపించారు. హీరోయిన్ అశ్వినితో రౌడీ బాబాయ్ అలాగే హీరోయిన్ రజిని తో మేనమామ అనే చిత్రంలో నటించారు.

ఆ తర్వాత 1989లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన లంకేశ్వరుడు చిత్రం లో మెగాస్టార్ చిరంజీవికి కి చెల్లెలి భర్తగా అంటే చిరంజీవికి బావ గా కళ్యాణ్ చక్రవర్తి నటించారు. ఇలా వరుసగా సినిమాలు చేస్తూ.. టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే 2003 లో చివరగా కబీర్ దాస్ అనే సినిమాలో నటించారు. ఆ తరువాత మరే సినిమాలోనూ కనిపించలేదు కళ్యాణ్ చక్రవర్తి.

అందుకు కారణం ఎవరికీ తెలియకపోగా ఆయన సన్నిహితులలో కొందరు కొన్ని విషయాలు తెలిపారు. కళ్యాణ్ చక్రవర్తి కుమారుడు పృథ్వి రోడ్డు ప్రమాదంలో చనిపోయారట. ఆ తరువాత కొద్దిరోజులకు అయన తమ్ముడు హరీన్ చక్రవర్తి కూడా మరణించడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారట కళ్యాణ్ చక్రవర్తి.. అయితే ఇదే సమయంలో తన తండ్రి ఆరోగ్యం బాగా లేకపోవడంతో తనకు సినిమాలకంటే తండ్రి ఆరోగ్యమే ముఖ్యమని ఆయనకు సేవలు చేస్తూ మద్రాసులోనే ఉండిపోయారట. తర్వాత కొన్ని రోజులకు తండ్రి మరణించడంతో తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్లి పోయారు. ఇక అయన తండ్రి చనిపోయిన తరువాత హైదరాబాద్ తిరిగి రాకుండా అక్కడే అయన వ్యాపారాలు చూసుకుంటూ ఉండిపోయారట కళ్యాణ్ చక్రవర్తి.

Advertisement
Continue Reading
Advertisement

Featured

AP Politics: కూటమికి మద్దతుగా మెగాస్టార్ .. జగన్ కి ఇది ఊహించని షాక్!

Published

on

AP Politics: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రోజురోజుకు మద్దతు పూర్తిగా తగ్గిపోతుందని చెప్పాలి.ఇలా వైసిపికి మద్దతు తగ్గిపోతూ కూటమికి భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం కూటమికి మద్దతు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇటీవల చిరంజీవిని సీఎం రమేష్, పంచకర్ల రమేష్ కలిసారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. తెలుగుదేశం బిజెపి, జనసేన కూటమిగా ఏర్పడటం శుభ పరిణామం అని తెలిపారు. చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని తెలిపారు.

ఇలా నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను అంటే కేవలం తమ్ముడు పవన్ కళ్యాణ్ కారణం ఈయన తెలిపారు. సీఎం రమేష్ నా చిరకాల మిత్రుడు చాలా మంచివారు. పంచకర్ల రమేష్ నా ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరు నాకు కావలసినవారు ఇద్దరు సమర్థులే వారికి ఓటు వేసే గెలిపించాలి అంటూ చిరంజీవి తెలిపారు. వీరిద్దరు గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధికి దోహదపడతారని చిరంజీవి తెలిపారు.

Advertisement

మెగా ఫాన్స్ ఓట్లు కూటమికే..
ఈ విధంగా చిరంజీవి కూటమికి మద్దతు తెలియజేయడంతో మెగా ఫాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే చిరంజీవి ఇలా పరోక్షంగా మద్దతు తెలియజేయడంతో కూటమికి భారీ స్థాయిలో అభిమానుల ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఇది జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాకే అని స్పష్టంగా తెలుస్తుంది.

Advertisement
Continue Reading

Featured

Pawan Kalyan: పవన్ సభలో కత్తులు కలకలం.. పోలీసుల అదుపులోకి ఇద్దరు యువకులు?

Published

on

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీ తరఫున 21 మంది ఎన్నికలలో పోటీ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ భీమవరంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం కాస్త సంచలనగా మారింది. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఆ వ్యక్తుల జోబులలో కత్తులు కనిపించడం సంచలనంగా మారింది.

ఈ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వేరువేరుగా పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ యువకులు పోలీసులపైనే దాడికి ప్రయత్నించి తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ పోలీసులు వీరిని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. ఇక వీరి వద్ద కత్తి ఉండడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేశారు.

Advertisement

దాడికి ప్రయత్నమా..
ఈ సభలో ఇలా వీరిద్దరూ అనుమానాస్పదంగా కత్తులతో కనిపించడంతో బహుశా జోబు దొంగలు అయ్యి ఉంటారా లేదంటే ఎవరిపైన దాడి చేయడానికి ఇలా వచ్చారా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఇద్దరు యువకులు కూడా భీమవరంలోని బలుసుమూడి, దుర్గాపురానికి చెందిన యువకులుగా వారిని పోలీసులు గుర్తించారు.

Advertisement
Continue Reading

Featured

AP Politics: గులకరాయికే విలవిలలాడితే గొడ్డలి పోటు సంగతి ఏంటి జగనన్న: షర్మిల

Published

on

AP Politics: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలి జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత చూపిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈమె కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి పై పోటీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇటీవల ఈమె నామినేషన్ కూడా దాఖలు చేశారు.

ఈ క్రమంలోనే ఈమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ విషయం గురించి షర్మిల మాట్లాడుతూ ఒక గులకరాయికే హత్యాయత్నం అంటూ తన సొంత పత్రికలో పెద్ద ఎత్తున వార్తలు రాశారు అలాగే బ్యానర్లు కూడా కట్టారు.

ఒక చిన్న గులకరాయికి ఇంతలా విలవిలలాడితే ఏడుసార్లు గొడ్డలితో వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు ఏమైంది జగనన్న అంటూ ఈమె ప్రశ్నించారు. తన తండ్రి దారుణంగా హత్యకు గురి అయితే గత ఐదు సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నటువంటి సునీత మీకు కనపడలేదా అంటూ ప్రశ్నించారు.

Advertisement

కంచుకోటకు బీటలు..
ఈ విధంగా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి వైయస్ షర్మిల సునీత పదేపదే మాట్లాడుతూ వైసీపీకి ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్నటువంటి కడపలో ఈసారి షర్మిల దెబ్బకు కంచుకోట బద్దలు కాబోతోందని తెలుస్తోంది. ఇలా వీరి వ్యాఖ్యలతో అక్కడ ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!