Connect with us

Featured

బీ టౌన్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ క్వీన్ ‌కంగనారనౌత్ !

Published

on

సినీ రంగంలో కాస్టింగ్‌ కౌచ్‌ వ్యవహారం రోజు రోజుకీ ముదురుతోంది. చిన్న స్థాయి హీరోయిన్ల దగ్గర నుండి నుంచి టాప్‌ హీరోయిన్ల వరకూ సినీ రంగంలో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను బహిరంగపరచడానికి ముందుకొస్తున్నారు. ఆ మధ్య “సుచీ లీక్స్’‌ పేరుతో గాయనీ సుచిత్ర కలకలం సృష్టించింది. నటి శ్రీరెడ్డి కాస్టింగ్‌ కౌచ్‌ వ్యవహారంలో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ నటి తనూశ్రీదత్తా ప్రముఖ నటుడు నానాపటేకర్‌ లాంటి వారి లైంగిక హింసలను బట్టబయలు చేసింది. ఈ వ్యవహారం బాలీవుడ్‌ని కుదిపేసిన విషయం తెలిసిందే. నానాపటేకర్‌పై నటి తనూశ్రీదత్తా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇలాంటి లైంగిక వేధింపుల సంఘటనలు ఒక్కొక్కటి బయటకొస్తున్న నేపధ్యంలో తాజాగా బాలీవుడ్ క్వీన్ ‌ కంగనారనౌత్‌ బీ టౌన్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. బీ టౌన్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. గత కొన్నాళ్లుగా బాలీవుడ్ మాఫియాని చెడుగుడు ఆడేస్తోంది. సుశాంత్ మరణం తర్వాత.. కంగనా డోస్ మరింత పెంచింది. ఇండస్ట్రీ ఏ-లిస్టర్స్ అంటూ ఓ సెక్షన్‌ని ఏకిపారేస్తోంది. ఇన్నాళ్లూ.. ఇండస్ట్రీలో గుట్టుగా సాగిపోయే డ్రగ్ పార్టీల భాగోతాన్ని, కాస్టింగ్ కౌచ్ వ్యవహారాల్నిఈ సిల్వర్ స్క్రీన్ క్వీన్ బయట పెట్టేస్తోంది. తన ట్వీట్స్‌తో.. నెటిజన్లంతా విస్తుపోయే నిజాలను, బాలీవుడ్ పార్టీల్లో కిక్కు వెనకున్న సీక్రెట్స్ ‌ని.. బయటపెట్టేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ లో జరుగుతున్న లైంగిక దోపిడీ గుట్టువిప్పింది కంగనా.

బాలీవుడ్ సినిమాలలో ఐటెమ్‌ సాంగ్‌ చేసే ఛాన్స్ రావాలన్నా, 2 నిమిషాల సీన్‌లో నటించాలన్నా కూడా ఆ నటి హీరోతో రాత్రంతా గడపాల్సి ఉంటుందని, బాలీవుడ్ లోని నటీమణులపై లైంగిక వాంఛ తీర్చాలనే ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని, ప్రత్యేకించి తానూ ఏ ఒక్కరిని ఉద్దేశించి మాట్లాడటం లేదని, సర్వ సాధారణంగా బీ టౌన్‌లో జరుగుతున్న పరిస్థితుల గురించే మాట్లాడుతున్నానని, ఏ లిస్ట్, బీ లిస్ట్ అలాగే పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ అంతా హీరోయిన్స్ తమతో గడపాలని కోరుకుంటారని, షూటింగ్ స్పాట్స్ లో కూడా తమకు భార్యలా నడుచుకోవాలని ఆదేశిస్తుంటారని, సినిమాలు మారుతుంటే హీరోలు మారుతారు తప్ప పరిస్థితి మాత్రం అలాగే ఉంటుందని, ఎంతటి స్టార్ హీరోయిన్ అయినా సరే సినిమా ఛాన్స్ కోసం ఆ సినిమాకు సంబంధించిన ముఖ్యమైన వ్యక్తులకు లైంగికంగా లొంగిపోయి తృప్తి పరచనిదే పనికాదని సంచలనమైన కామెంట్స్ చేసింది ఈ ఫైర్ బ్రాండ్.

అలాగే దేశంలో నెంబర్ 1 చిత్ర పరిశ్రమ “బాలీవుడ్” అని అందరూ అనుకుంటారు. కానీ అది తప్పు. ప్రస్తుతం “టాలీవుడ్” అగ్రస్థానంలోకి ఉంది. ఈమధ్య ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కిస్తూ బాలీవుడ్ కు సవాలు విసురుతోందంటూ బీ టౌన్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది మన “ఏక్ నిరంజన్” బ్యూటీ కంగనా రనౌత్.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Meena: రెండో పెళ్లి వార్తలపై ఘాటుగా రియాక్ట్ అయిన మీనా… డబ్బుల కోసమే అంటూ?

Published

on

Meena: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మీనా గురించి ఇటీవల కాలంలో తరచూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఎప్పుడైతే ఈమె భర్త విద్యాసాగర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారో అప్పటినుంచి మీనా రెండో పెళ్లి గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ విధంగా మీనా రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈమె ఇదివరకే పలు సందర్భాలలో రెండో పెళ్లి గురించి స్పందించి క్లారిటీ ఇచ్చారు. అయితే ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె మరోసారి రెండో పెళ్లి వార్తలపై స్పందించారు.

ఈ సందర్భంగా మీనా రెండో పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందిస్తూ తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ సోషల్ మీడియాలో దారుణమైనటువంటి వార్తలు వస్తున్నాయి. కేవలం డబ్బు కోసమే ఇలాంటి వార్తలు రాయొద్దు రాసేటప్పుడు నిజా నిజాలు తెలుసుకొని రాయాలని ఈమె సూచించారు.

Advertisement

అలాంటి ఆలోచన లేదు..
ఇప్పటికే రెండో పెళ్లి గురించి పలు సందర్భాలలో తాను చెప్పానని ఇప్పుడు కూడా చెబుతున్నానని తెలిపారు. తాను రెండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఏమాత్రం లేనని తనకు ఆ ఆలోచన కూడా లేదని తెలిపారు. ఒకవేళ అలాంటి ఆలోచనలు కలిగి నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఈ విషయాన్ని నేనే అందరికీ తెలియజేస్తాను అంటూ ఈ సందర్భంగా మీనా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mokshagna: ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న మరో నందమూరి హీరో.. మోక్షజ్ఞనే ఆలస్యమా?

Published

on

Mokshagna: మోక్షజ్ఞ పరిచయం అవసరం లేని పేరు. నందమూరి వారసుడిగా బాలయ్య కుమారుడిగా అందరికీ సుపరిచితం అయినటువంటి మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారు అంటూ గత కొన్ని సంవత్సరాలుగా వార్తలు వస్తున్నప్పటికీ ఇంకా ఈయన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినటువంటి సందర్భాలు ఏమి లేవు.

ఇలా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురు చూసి ఆశలను కూడా నిరాశ చేసుకుంటున్నారు ఇలాంటి తరుణంలోనే మోక్షజ్ఞ కంటే ముందుగానే మరో నందమూరి హీరో ఇండస్ట్రీలోకి రాబోతున్నారని తెలిసి బాలయ్య అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. మరి మోక్షజ్ఞ కంటే ముందుగా ఇండస్ట్రీలోకి రాబోయే ఆ హీరో ఎవరు అనే విషయానికి వస్తే..

దివంగత నటుడు హరి కృష్ణ గారికి ముగ్గురు కుమారులు అనే సంగతి మనకు తెలిసినదే. వీరి పెద్ద కుమారుడు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈయనకు ఇద్దరు కుమారులు పెద్ద అబ్బాయి పేరు నందమూరి తారక రామారావు కావటం విశేషం. ఈ అబ్బాయి ఇదివరకే పలు సినిమాలలో బాలనటుడిగా నటించారు అయితే త్వరలోనే ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది.

Advertisement

వైబిఎస్ చౌదరి..
ఇండస్ట్రీలో దర్శకుడుగా ఒకానొక సమయంలో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వైవిఎస్ చౌదరి గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు అయితే ఈయన ఒక అద్భుతమైన ప్రేమ కథ సినిమాని సిద్ధం చేశారని రీ ఎంట్రీ ద్వారానే నందమూరి తారక రామారావును హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ విషయం తెలిసి మోక్షజ్ఞ విషయంలో బాలయ్య అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Continue Reading

Featured

Supritha: స్ప్రైట్ లో మందు కలుపుకొని తాగాను.. అమ్మకు తెలిసి పిచ్చ కొట్టుడు కొట్టింది: సుప్రీత

Published

on

Supritha: తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సురేఖ వాణి ఒకరు. ఈమె కుమార్తె సుప్రీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగు పెట్టకముందే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ కంటెస్టెంట్ బుల్లితెర నటుడు అమర్ హీరోగా ఇటీవల ఓ సినిమాలో నటిస్తున్నారు ఇందులో హీరోయిన్లు సుప్రీత అవకాశం అందుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసే రీతూ చౌదరి యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి దావత్ అనే కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులో భాగంగా రీతూ సుప్రీతను వివిధ రకాల ప్రశ్నలు అడిగారు.

ఈ సందర్భంగా ఈమెకు సుప్రీతను ప్రశ్నిస్తూ నీ కెరియర్లో జరిగినటువంటి బలుపుతో చేసిన పనులు గురించి చెప్పమని అడిగారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ కిక్ ఇచ్చే పనుల కోసం తాను స్కూల్ చదువుతున్న సమయంలోనే లైసెన్స్ లేకుండానే అమ్మ కారు వేసుకొని వెళ్లే దాన్ని ఈ విషయం తెలిసి అమ్మ పిచ్చ కొట్టుడు కొట్టిందని తెలిపారు. అంతేకాకుండా స్ప్రైట్ లో ఆల్కహాల్ కలుపుకొని తాగానని ఒక రోజు స్కూల్ కి వెళ్లి అందరికీ కూడా పంచానంటూ ఈమెకు తెలిపారు.

Advertisement

నంబర్ బ్లాక్ చేస్తే సహించెను..
ఇక ఎవరైనా నా ఫోన్ నెంబర్ బ్లాక్ చేస్తే అసలు సహించను. వేరే ఫోన్ నుంచి కాల్ చేసి మరి వారికి వార్నింగ్ ఇస్తాను అంతే కాకుండా నేను ఇష్టపడే అబ్బాయి వైపు చిన్నప్పుడు ఎవరైనా చూస్తే వెళ్లి కొట్టేదాన్ని అంటూ ఈ సందర్భంగా సుప్రీత చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!