Kapil Dev: టి20 ప్రపంచ కప్ మ్యాచ్లలో భాగంగా టీమిండియా సెమీఫైనల్స్ వరకు వెళ్లి ఇంగ్లాండ్ చేతిలో దారుణంగా ఓటమిపాలై ఇంటిదారి పట్టారు. ఇలా ఫైనల్ కు వెళ్లి కప్పు కొడుతుందని భావించిన వారికి టీమిండియా షాక్ ఇచ్చిందని చెప్పాలి.ఇలా సెమీఫైనల్స్ లో ఇంగ్లాండ్ చేతిలో ఓటమిపాలు కావడంతో ఎంతోమంది ఇండియన్ కాకుండా ఇతర దేశాల క్రికెటర్లు సైతం టీమిండియా పై విమర్శలు కురిపిస్తున్నారు.
ఈ సిరీస్ కి ముందు ఇండియా తప్పనిసరిగా కప్ అందుకుంటుందని ఎంతోమంది ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే చివరికి నిరాశతో వెనుతిరగాల్సి వచ్చింది. ఈ ఓటమిపై ఇండియన్ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ స్పందించారు.ఈ సందర్భంగా ఆయన ఈ మ్యాచ్ గురించి మాట్లాడుతూ టీమ్ ఇండియాని చోకర్స్ అంటూ కామెంట్ చేశారు.
కపిల్ దేవ్ ఒక ఇంగ్లీష్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని టీం ఇండియా పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే టీమ్ ఇండియాను చోకర్స్ అంటూ ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి అయితే చోకర్స్అంటే ఏంటి అనే విషయానికి వస్తే క్రికెట్ భాషలో టోర్నీలో కీలకమైన మ్యాచులలో అధిక ఒత్తిడిని తట్టుకోలేక ఓడిపోయే జట్టులను చోకర్స్ అంటారు.
Kapil Dev: విమర్శలు పాలవుతున్న టీమిండియా…
ఇలా ఈ పదాన్ని ఇదివరకు సౌత్ ఆఫ్రికాకు ఎక్కువగా ఉపయోగించేవారు. సౌత్ ఆఫ్రికా సైతం ఇలాంటి టోర్నమెంట్స్ లో ఫైనల్స్ వరకు వెళ్లి ఓటమితో వెనుతిరిగేది అయితే తాజాగా కపిల్ దేవ్ సైతం ఈ పదాన్ని టీమిండియాని ఉద్దేశిస్తూ చెప్పడంతో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. టీమిండియా సైతం 2007 నుంచి నాలుగు సార్లు సెమీస్ కి చేరుకుంటే కేవలం ఒక్కసారి మాత్రమే కప్పు గెలిచిందని, ఇలా ఎక్కువసార్లు ఓటమిపాలు కావడంతో కపిల్ దేవ్ టీమ్ ఇండియాని చోకర్స్ అంటూ వ్యాఖ్యానించారు.
ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…
దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…
జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…
ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…
ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…
విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…