Connect with us

Featured

Karthika Deepam: దీప కాపురాన్ని నాశనం చేస్తున్న డైరెక్టర్.. మోనిత వీరప్రేమికురాలు అంటూ అబద్దాలు చెప్తూ?

Published

on

బుల్లితెరలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం మరింత ఆసక్తిగా మారింది. మోనిత చనిపోలేదన్న నిజం ఎప్పుడు తెలుస్తుందో అని ప్రేక్షకులు బాగా ఆసక్తిగా చూస్తున్నారు. రేటింగ్ కూడా మొదటి స్థానం లోనే ఉంటుంది.

ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో చూద్దాం. కార్తీక్ తో రత్నసీత ఇవాళ ఓ కొత్తమ్మాయి వస్తుందని చెప్పిన సంగతి తెలిసిందే. మొత్తానికి మోనిత పోలీస్ స్టేషన్ కు టీ పట్టుకుని వస్తుంది. అదే సమయంలో దీప కూడా వచ్చి మోనిత కనిపించిందని జరిగిన విషయాన్ని కార్తీక్ తో చెబుతుంది.

కార్తీక్ దీప మాటలను నమ్మలేకపోయాడు. మోనిత పక్కన ముసుగు వేసుకొని వీరి మాటలు వింటుంది. దీప మాత్రం మోనిత బతికే ఉందని, ఎలాగైనా పట్టుకుని వస్తాను అంటూ అనడంతో కార్తీక్ తన ఆవేశాన్ని ఓదార్చుతాడు. ఆలోచించుకోమని సలహా ఇస్తాడు.

వాళ్లు మాట్లాడుతుండగా మోనిత టీ ఇవ్వడానికి కార్తీక్ దగ్గరికి వస్తుంది. కార్తీక్ దీపకు ఇవ్వమంటాడు. అంతలోనే టీ గ్లాస్ జారిపడుతుంది. ఇక అక్కడికి పోలీస్ రావడంతో మోనితను ఎవరు అని అడిగేసరికి.. ఆమె మాట్లాడలేదని మూగ అమ్మాయని.. రత్నసీత పంపించిందని చెబుతాడు.

ఇక కార్తీక్ ను చూసుకుంటూ కార్తీక్ కు టీ ఇస్తుంది. కార్తీక్ ను అలాగే చూస్తూ ఉండిపోతుంది. టీ గ్లాస్ తీసుకొని అక్కడినుంచి వెళ్ళిపోతుండగా.. పోలీస్ ఆపి పగిలిన గ్లాస్ ముక్కలను తీయమంటాడు. ఇక మోనితకు గాజు ముక్క కాలికి గుచ్చుకోవడం తో అమ్మ అని అరిచి అక్కడి నుంచి వెళ్లి పోతుంది.

వెంటనే కార్తీక్ కు ఆమె మూగ అమ్మాయి అని.. కానీ అమ్మ అని అరిచింది అని అనడంతో ఆ విషయాన్ని దీపకు చెబుతాడు. దీప ఆమె మూగ అమ్మాయని అనేసరికి.. వెంటనే కార్తీక్ కు తనకు టీ ఇచ్చిన సమయంలో ఆ స్పర్శను, తన పర్సనాలిటీని చూసి మోనితనే అనుకుంటాడు.

ఆలోచనలో ఉన్న కార్తీక్ ను చూసి దీప ప్రశ్నించగా.. మోనిత అనే విషయాన్ని చెబితే వెంటనే వెళ్తుందని.. పోలీస్ స్టేషన్ లోకే అడుగు పెట్టిన మోనిత.. దీపను బతుకనిస్తుందా అనుకుంటూ దీపతో చెప్పలేకపోతాడు. వెంటనే రోషిణికి చెప్పాలనుకుంటాడు.

ఇక హాస్పిటల్ కి వెళ్ళిన రోషిణి మోనిత ఫోటోను చూసి గతంలో మోనిత మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటుంది. అక్కడ ఉన్న డాక్టర్ ను మోనిత, కార్తీక్ ల మధ్య ఉన్న బంధం గురించి అడుగుతుంది.ఆ డాక్టర్ కూడా మోనితకు సపోర్ట్ గా మాట్లాడుతుంది.

కానీ రోషిణి మోనితది కృత్రిమ గర్భమని విన్నాను మరి ఈ విషయం నిజమే అనుకుంటున్నారా అని ప్రశ్నిస్తుంది. వెంటనే ఆ డాక్టర్ కూడా నిజమే అని ఎందుకంటే వాళ్ల మధ్య స్నేహం పెళ్లి పీటల దాకా వచ్చి ఆగిందని అందుకే ఇలా చేసిందని అంటుంది.

కార్తీక్ ప్రేమ కోసమే ఇలా చేసిందని డాక్టర్.. రోషిణితో చెబుతుంది. అక్కడున్న ఒక పర్మినెంట్ ఉద్యోగిని పిలిపించి తనను ఎంక్వయిరీ చేస్తుంది. ఆమె కూడా మోనితకు సపోర్ట్ చేసినట్లు మాట్లాడుతుంది. ఇక రోషిణి మోనిత ఫోటోను ఫోన్ లో తీసుకొని వెళుతుంది.

మరోవైపు సౌందర్య ఫోన్ మాట్లాడుతుండగా పిల్లలిద్దరూ తన తల్లి కోసం ఎదురుచూస్తారు. పిల్లల దగ్గరికి వెళ్లి ఏమైంది అని ప్రశ్నించగా పిల్లలు మళ్లీ తమ మాటలతో కోపం వచ్చేలా మాట్లాడుతుండగా.. సౌందర్య వెంటనే వాళ్లను బెదిరిస్తుంది.

ఇక తర్వాత ఎపిసోడ్ లో దీప ఆటోలో వెళుతూ మోనితను ఎలాగైనా వెతకాలి అని అనుకుంటుంది. మోనిత కూడా ఈరోజు రాత్రికే ఏదైనా చెయ్యాలి అని రత్న సీతతో అంటుంది. ఇక రోషిణి కార్తీక్ కు గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు కనిపిస్తుంది.

Advertisement

Featured

Venu Swamy: ఆవిడ నన్ను ప్రేమించింది.. నేను ప్రేమించాల్సి వచ్చింది: వేణు స్వామి రియల్

Published

on

Venu Swamy: వేణు స్వామి పరిచయం అవసరం లేని పేరు. ఈయన ప్రముఖ జ్యోతిష్యులుగా ఎంతోమంది సెలబ్రిటీల జాతకాలను చెబుతూ తరచు వార్తల్లో నిలిచారు. కేవలం రాజకీయాలకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి ఈయన పెద్ద ఎత్తున అభిమానుల ఆగ్రహానికి గురవుతూ ఉంటారు.

ఇకపోతే ఇటీవల కాలంలో వేణు స్వామి తన భార్య వీణా వాణితో కలిసి రీల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్దిరోజుల క్రితం ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి సినిమాలోని డైలాగుకు రీల్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అయితే తాజాగా మరొకరి వీడియో ద్వారా ఈయన అభిమానుల ముందుకు వచ్చారు.

ఈ క్రమంలోనే నాగార్జున సోనాలి బింద్రే హీరో హీరోయిన్లుగా నటించిన మన్మధుడు సినిమాలోని ఒక సీన్ రీ క్రియేట్ చేశారు. ఈ సినిమాలో నాగార్జున సోనాలి బింద్రే ఇద్దరు ప్యారిస్ వెళ్లగా అక్కడ బ్రహ్మానందంతో ఓ సన్నివేశం వస్తుంది. మీ ఇద్దరిదీ లవ్ మ్యారేజ్ అంటూ నాగార్జున బ్రహ్మానందం ని అడగడంతో అందుకు ఆయన చెబుతూ మొదట ఆమె నన్ను ప్రేమించింది తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది అనే డైలాగును వేణు స్వామి కూడా రీ క్రియేట్ చేశారు.

Advertisement

ఊపిరి పీల్చుకో..

ఇలా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది వామ్మో వేణు స్వామిలో ఈ యాంగిల్ కూడా ఉందా సోషల్ మీడియా ఇక ఊపిరి పీల్చుకో అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలా జ్యోతిష్యం చెబుతూనే వార్తలలో నిలిచినటువంటి ఈయన ఇప్పుడు మాత్రం రీల్స్ చేస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారని చెప్పాలి.

https://www.instagram.com/reel/C5oDUlhxisr/?utm_source=ig_embed&ig_rid=c69f6a00-74ea-461b-b532-7e7a5316f48a

Advertisement

Continue Reading

Featured

Rashmika: నాకంటే అందగత్తెలు ఉన్నారు.. రష్మిక కామెంట్స్ వైరల్!

Published

on

Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు భాషతో సంబంధం లేకుండా వరుస భాషా చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా స్టార్ డం గురించి ఈమె మాట్లాడారు.

ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎంతో మంది ప్రయత్నాలు చేస్తున్నారు అయితే నాకంటే ఎంతో అందమైన అమ్మాయిలు ఉన్నారు అలాగే బాగా నటించగలిగే వారు ఉన్నారు వారందరూ అవకాశాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారని తెలిపారు.

ఇలా నేను ఇక్కడ వాళ్లు అక్కడ ఉండటానికి కారణం అదృష్టం మాత్రమేనని ఈమె తెలిపారు. నాకు అదృష్టం రావడంతో ఇక్కడికి వచ్చానని ఈమె తెలియజేశారు. ఇలా వచ్చిన అదృష్టాన్ని సరైన మార్గంలో ఉపయోగించుకొని నన్ను నేను నిరూపించుకోవడం కోసం ప్రయత్నాలు చేశానని రష్మిక తెలిపారు.

Advertisement

పతనానికి కారణం..
సినిమా ఇండస్ట్రీలో అని మాత్రమే కాదు ఏ రంగంలో అయినా కూడా జయాలు అపజయాలు అనేది సర్వసాధారణంగా ఉంటాయి అయితే మనం విజయం సాధించినప్పుడు ఆ పొగరు తలకెక్కించుకోకూడదు అలా ఎక్కించుకున్నాము అంటే ఆ ప్రభావం మన మనసుపై పడుతుందని అది పతనానికి కారణం అవుతుంది అంటూ రష్మిక ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Ramcharan: డాక్టరేట్ అందుకున్న రామ్ చరణ్.. ఇది వారందరికీ దక్కిన గౌరవం అంటూ?

Published

on

Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ఇటీవల చెన్నై వేల్స్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈయన ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ ఇండస్ట్రీకి అందించినటువంటి సేవలను గుర్తించినటువంటి వేల్స్ యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసింది. ఏప్రిల్ 13వ తేదీ సాయంత్రం జరిగినటువంటి యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమాలలో భాగంగా రామ్ చరణ్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన డాక్టరేట్ అందుకోవడంతో రామ్ చరణ్ కాస్త ఇకపై డాక్టర్ రామ్ చరణ్ గా మారిపోయారని చెప్పాలి. ఇక ఈయనకు డాక్టర్ అందించడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇలా డాక్టరేట్ అందుకున్నటువంటి రామ్ చరణ్ ఈ విషయం గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

చెన్నైలో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నటువంటి వేల్స్ యూనివర్సిటీ నుంచి నాకు ఈ గౌరవం దక్కడం నిజంగా సంతోషంగా అనిపిస్తుందని ఈయన వెల్లడించారు. ఆర్మీ లాంటి గ్రాడ్యుయేషన్ మధ్యలో నేను ఇలా ఈరోజు ఉండటం  ఊహిస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

Advertisement

అందరి గౌరవం ఇదీ…
ఈరోజు ఇలా డాక్టరేట్ అందుకున్నాను అంటే అది కేవలం నాకు దగ్గర గౌరవం మాత్రమే కాదని తెలిపారు నన్ను ఆదరించిన అభిమానులది నన్ను నమ్మి సినిమా అవకాశాలు ఇచ్చిన దర్శక నిర్మాతలది అంటూ రాంచరణ్ కామెంట్స్ చేశారు. ఇక ఈ యూనివర్సిటీని ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నటువంటి ఇక్కడ నిర్వాహకులకు అధ్యాపకులకు అలాగే విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నానని తెలిపారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!