గత వారం రోజుల నుంచి తీవ్ర వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా తీవ్రమైన వరద నీటిలో మునిగిపోయింది. ఈ క్రమంలోనే గతంలో ఎప్పుడు చూడని విధంగా తిరుమల తిరుపతిలో భారీ వర్షాల కారణంగా తిరుపతి మొత్తం జల సందిగ్దంలో ఉండిపోయింది. ఈ క్రమంలోనే తిరుపతి ప్రజలు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు.
ఈ వరద నీటిలో భాగంగా ఎన్నో వాహనాలు పశువులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. తిరుమల గిరుల నుంచి వర్షపు నీరు జలపాతంగా ప్రవహించడంతో తిరుపతి వీధులన్నీ వరద నీటిలో చిక్కుకున్నాయి. ఈ క్రమంలోనే జనజీవనం స్తంభించిపోయి ప్రజలు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు . ఇదిలా ఉండగా తాజాగా తిరుపతి వరదలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.
ఈ సందర్భంగా చిరంజీవి ద్వారా స్పందిస్తూ గతంలో ఎప్పుడూ లేనంతగా కురుస్తున్న వర్షాలకు తిరుపతి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూస్తుంటే మనసు కలిచివేస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం టిటిడి కలిసికట్టుగా కృషి చేసి వీలైనంతవరకు పరిస్థితులను సాధారణ స్థితికి రావాలని ఏపీ ప్రభుత్వానికి టిటిడికి చిరు విజ్ఞప్తి చేశారు. అదే విధంగా అన్ని రాజకీయ పక్షాలు, అభిమాన సంఘాలు సైతం చేయూతనివ్వాలని ఈ సందర్భంగా చిరు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
గత వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చిత్తూరు జిల్లాలో వరద ముంచెత్తుతోంది. ఈ క్రమంలోనే పలు వాగులు వంకలు పొంగి పొర్లి జనజీవనం స్తంభించిపోయింది. ఇక చెట్లు కూలిపోవడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడి ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…
దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…
జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…
ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…
ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…
విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…