Connect with us

Featured

Mirchi Madhavi : వ్యక్తిగత జీవితాన్ని పబ్లిక్ లో పెట్టకూడదు.. అడిగేవారు లేకపోతే ఇలానే ఉంటుంది : మిర్చి మాధవి

Published

on

Mirchi Madhavi : సోషల్ మీడియా పుణ్యమా అని తమకు నచ్చినట్టు సెలబ్రిటీలను మరింత చేరువయ్యారు ప్రేక్షకులు. అయితే ఎంత పాజిటివిటీ సోషల్ మీడియా ద్వారా ఉందో అంతే నెగెటివిటీ కూడా ఉంది. మనం చేసే పనులు కొంత మందికి నచవచ్చు కొంత మందికి నచ్చకపోవచ్చు. వ్యక్తిగత జీవితాన్ని సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఎంతో మంది సెలబ్రిటీలు ట్రోల్స్, నెగెటివ్ కామెంట్స్ వంటివి ఎదురుకొంటున్నారు, మానసికంగా ఇబ్బందిపడుతున్నారు. మరీ ముఖ్యంగా సినిమా, టీవీ రంగంలో ఉండే వాళ్ళు సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు తమ జీవితాన్ని చూపిస్తూ ట్రోల్స్ అనే అస్త్రాన్ని పబ్లిక్ ఇస్తున్నారు. ఇక ఎంత వరకు మనం జీవితాన్ని పబ్లిక్ లో ఉంచాలి లేదు అనేది మన వ్యక్తిగత అంశం. అయితే దానివల్ల వచ్చే పరిణామాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది మంచైనా, చెడైనా. ఇక ఈ విషయాలపై సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పనిచేతున్న మిర్చి మాధవి స్పందించారు.

అడిగేవారు లేకపోతే, భయం భక్తి లేకపోతే ఇలాగే ఉంటుంది…

తెలుగులో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న మాధవి సినిమాలకంటే ముందు ఆర్జే గా పనిచేయడం వల్ల మిర్చి మాధవి గా బాగా ఫేమస్ అయ్యారు. ఇక సోషల్ మీడియాలో చురుగ్గా ఉండటం మిగిలిన ఆర్టిస్టులు ఎదుర్కొంటున్న నెగెటివిటీ గురించి మాట్లాడుతూ ప్రగతి, సురేఖ వాణి వంటి వారు సోషల్ మీడియాలో పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను ఎక్కువగా పెడుతుంటారు దీనివల్ల వారు ట్రోల్ల్స్ ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. దీని గురించి మాట్లాడుతూ వ్యక్తిగత విషయాలను అందరికీ చెప్పాలనుకోవడం వారి సొంత విషయం దాన్ని గురించి మాట్లాడకూడదు. అయితే ఒకసారి మనం వ్యక్తిగత జీవితాన్ని నెట్టింట్లో పెట్టి మళ్ళీ కామెంట్స్ ఎలా ఉన్నా బాధపడకూడదు భరించాల్సిందే అని నేను భావిస్తాను. నాకు యూట్యూబ్ ఛానెల్ ఉంది దాని ద్వారా నా చదువు ఇలాంటివి ఒకరికి ఉపయోగపడాలని వీడియోస్ చేశాను మధ్యలో బిజీ అవ్వడం వల్ల మానేసాను.

Advertisement

కానీ కామెంట్స్ లో నువ్వు చెబితే మేము వినాలా చాల్లే వంటి కామెంట్స్ చూసినపుడు ఎలాంటి మానసిక స్థితిలో ఉండేవారు బయట ఉంటారో అని అనిపిస్తుంది. అయితే నేను నా వ్యక్తిగత జీవితాన్ని ఎపుడు పబ్లిక్ చేయలేదు. ఎందుకంటే నా కుటుంబం, మా అన్నయ్య యూకే లో ఉంటారు. అయన నాకు ఉన్న ఐదు మంది బాబాయ్ లు అందరూ వెంటనే అడుగుతారు ఏంటి ఇలా పెట్టావ్ అని ఆ భయం నాకు ఉంది అందుకే అలాంటివి ఆలోచించను. ఆ భయం, భక్తి ఉంటే మనం పర్సనల్ లైఫ్ ఎంతవరకు బయటికి చెప్పాలో అంతే చెప్పాలి అనే లిమిట్ ఉంటుంది. లేకపోతే పబ్లిక్ మాట్లాడే మాటలను వినాల్సి వస్తుంది అంటూ మాధవి చెప్పారు.

Continue Reading
Advertisement

Featured

Vishal: మళ్లీ ఆయనే ఏపీ సీఎం.. హీరో విశాల్ కామెంట్స్ వైరల్!

Published

on

Vishal: సినీ నటుడు హీరో విశాల్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన సినిమాలో పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గానే ఉంటారు. అంతేకాకుండా తమిళ రాజకీయాలలో కూడా ఈయన యాక్టివ్ గా ఉంటూ తరచూ రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు.

ప్రస్తుతం హీరో విశాల్ నటించిన రత్నం సినిమా ఈనెల 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఈయన ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం హైదరాబాద్ వచ్చారు ఇలా హైదరాబాద్ వచ్చినటువంటి ఈయనకు ఏపీ రాజకీయాల గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఇలా రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురు కావడంతో ఈయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కూడా గెలిచేది వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఆయనే మరోసారి ఏపీ సీఎం అవుతున్నారని విశాల్ వెల్లడించారు. ఇక జగన్మోహన్ రెడ్డి పట్ల ఇలాంటి దాడులు ఇదివరకు ఎన్నో జరిగాయి. వాటిని ఆయన ఎదుర్కొన్నారని తెలిపారు.

Advertisement

జగన్ అంటే అభిమానం..
ఇక్కడ తప్పకుండా వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని అయితే నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదని తెలిపారు. తనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైనటువంటి అభిమానం ఉందని ఈ సందర్భంగా విశాల్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ 8 లో మాజీ కంటెస్టెంట్లు.. మళ్లీ రచ్చ షూరు!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారు ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలు అందుకున్నటువంటి పలువురు బిగ్ బాస్ సీజన్ సెవెన్ మాజీ కంటెస్టెంట్ లో తిరిగి సీజన్ 8 లో కంటెస్టెంట్లుగా పాల్గొన్న పోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇటీవల బిగ్ బాస్ 7 కార్యక్రమం ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమం ద్వారా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సినీ నటుడు శివాజీ, అమర్ దీప్, విన్నర్ పల్లవి ప్రశాంత్ ఈ ముగ్గురు కూడా సీజన్ 8 కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.

సీజన్ 7లో అత్యధిక కంటెంట్ ఇచ్చింది ఈ ముగ్గురే. శోభ శెట్టి ఉన్నప్పటికీ ఆమె పట్ల అత్యంత నెగిటివిటీ నడిచింది. అమర్ దీప్ తో శివాజీ, పల్లవి ప్రశాంత్ ఫైట్స్ హైలెట్ అయ్యాయి. అందుకే ఈ ముగ్గురిని తిరిగి సీజన్ 8 లో కూడా తీసుకురావాలని ఆలోచనలో మేకర్స్ ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటన మాత్రం వెలబడలేదు.

Advertisement

కార్తీకదీపం డాక్టర్ బాబు..
బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో ఈ ముగ్గురి మధ్య పెద్ద ఎత్తున యుద్ధం నడిచింది అయితే తిరిగి ఈ ముగ్గురు మరోసారి సీజన్ 8 లో పాల్గొన్నారు. అంటే మరోసారి రచ్చ జరుగుతుందని పలువురు భావిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రశాంత్ విన్నర్ కాగా, అమర్ రన్నర్ గా నిలిచారు. ఇక ఈ కార్యక్రమంలో కార్తీకదీపం ఫేమ్ నిరుపమ్ రాబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: వేణు స్వామి ఇంటి నుంచి ప్రభాస్ అడిగి మరీ అవి తీసుకున్నారు: వేణు స్వామి వైఫ్

Published

on

Prabhas: ప్రముఖ జ్యోతిష్యుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలను చెబుతూ ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తున్నారు.

ముఖ్యంగా ఈయన ప్రభాస్ జాతకం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రభాస్ అభిమానులు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉంటారు అంతేకాకుండా వేణు స్వామి పై భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఇలా సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు వేణు స్వామి మధ్య పెద్ద ఎత్తున మాటలు యుద్ధం జరుగుతుందని చెప్పాలి.

ఇలా వేణు స్వామి విషయంలో ఆయన అభిమానులు భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నప్పటికీ వేణు స్వామి అలాగే ప్రభాస్ మధ్య మంచి అనుబంధమే ఉందని చెప్పాలి. ఈ విషయం గురించి తాజాగా వేణు స్వామి భార్య ఓ సందర్భంలో వెల్లడించారు. ఒకసారి తన తోటలో పండిన సీతాఫలం పండ్లను వేరే వారికి పంపించగా అవి ప్రభాస్ వద్దకు చేరాయి.

Advertisement

సీతాఫలం..
అవి తిన్న ప్రభాస్ చాలా బాగున్నాయని అడిగి మరి మా ఇంటి నుంచి తెప్పించుకున్నారు అంటూ వేణు స్వామి భార్య వీణ వాణి తెలిపారు. అంతేకాకుండా ఈమె ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ బ్యాగ్ ను కూడా తయారు చేసి కానుకగా పంపించినట్లు ఈ వీడియో ద్వారా వెల్లడించారు. ఇది చూసిన అభిమానులు మీరేమో ప్రభాస్ పై అభిమానం చూపిస్తారు మీ ఆయనేమో అలా మాట్లాడతారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!