సాయిధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. దీనిపై సినీ వర్గాలతో పాటు ఏపీ మంత్రులు తీవ్రంగా స్పందించారు. సినీ పరిశ్రమలో అయితే పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డాడు. రెండు రోజుల పాటు విలేకరులతో సమావేశం ఏర్పాటు చేసి మరీ వ్యక్తిగంతగా కూడా దూషించాడు.
దీనికి పవన్ అభిమానులతో పాటు జనసేన కార్యకర్తలు దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. దారుణమైన బూతులతో పవన్ ని కించపరిచిన పోసానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా జనసేన నాయకురాలు నిహారిక కూడా మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోసాని కృష్ణమురళి మానసిక రోగిగా మారాడని.. అతడిన వెంటనే ఆసుపత్రిలో చూపించండి.. లేదంటే సమాజానికి ప్రమాదం అంటూ అతని పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అతడికి తగినట్లుగా మెంటల్ కృష్ణ సినిమా తీశాడని.. ప్రస్తుతం అతడికి ఆ టైటిల్ సరిగ్గా సరిపోతుందంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.
పవన్ కళ్యాణ్ ఆడవాళ్లపై ఎలాంటి బ్యాడ్ కామెంట్లు చేయలేదని.. అయితే జగన్ పై వ్యాఖ్యలు చేశారనే పోసాని రియాక్ట్ అవుతున్నారని పవన్ పై అనవసరమైన ఆరోపణలు చెయ్యవద్దని హెచ్చరించింది. పోసానిపై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని.. ఈ సందర్భంగా జనసేన నాయకులు నిహారిక డిమాండ్ చేసింది. అతడిని వెంటనే అరెస్టు చేయాలని ఈ సందర్భంగా నిహారిక కోరింది. ప్రస్తుతం ఈమె చేసిన వ్యాఖ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…
దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…
జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…
ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…
ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…
విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…