డబ్బు రెట్టింపు చేసే పోస్టాఫీస్ స్కీమ్.. అదిరిపోయే లాభాలు గ్యారంటీ..?

మనలో చాలామంది డబ్బు పెట్టుబడుల విషయంలో రిస్క్ తక్కువగా ఉండాలని.. లాభాలు ఎక్కువగా ఉండాలని భావిస్తూ ఉంటారు. మన దగ్గర ఉన్న డబ్బులను రెట్టింపు చేసే స్కీమ్ లలో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటూ ఉంటారు. తక్కువ పెట్టుబడితో రెట్టింపు లాభాలను సొంతం చేసుకోవాలనుకునే వాళ్ల కోసం పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్ లను అందుబాటులోకి తెచ్చింది. ఈ స్కీమ్ లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా గ్యారంటీగా లాభాలను సొంతం చేసుకునే అవకాశం ఉంది.

పోస్టాఫీస్ ఎన్నో రకాల కొత్తకొత్త స్కీమ్ లను ఆఫర్ చేస్తుండగా వాటిలో కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ కూడా ఒకటి ఈ స్కీమ్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా ఎలాంటి రిస్క్ లేకపోవడంతో పాటు లాభాలను ఖచ్చితంగా సొంతం చేసుకోవచ్చు. అయితే రిస్క్ లేకపోయినప్పటికీ రెట్టింపు లాభాలను పొందాలంటే మాత్రం దీర్ఘకాలం వేచి ఉండాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ కేంద్రం పోస్టాఫీస్ ల ద్వారా అమలు చేస్తున్న స్కీమ్ కావడంతో డబ్బు గురించి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు.

కనీసం 1000 రూపాయల నుంచి ఎంత మొత్తమైనా ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 124 నెలలు కాగా పెట్టుబడి పెట్టిన 124 నెలల తరువాత డబ్బులు గ్యారంటీగా రెట్టింపు అవుతాయి. ఈ స్కీమ్ కు జాయింట్ అకౌంట్ ఫెసిలిటీ కూడా ఉండటం గమనార్హం. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు 6.9 శాతం వడ్డీ రేటు అందిస్తోంది.

గరిష్ట పరిమితి అనేది లేకపోవడం వల్ల ఇన్వెస్ట్ చేసే వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుంది. అయితే ఈ స్కీమ్ లో 18 సంవత్సరాల వయస్సు పై బడిన వాళ్లు మాత్రమే ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ లో రెండు లక్షలు పెడితే నాలుగు లక్షలు, 20 లక్షలు పెడితే 40 లక్షలు పొందే అవకాశం ఉంటుంది.