Connect with us

Featured

భడా డైరెక్టర్ తో కలిసి, నోట్ల కట్టలు కుమ్మరించి మాస్టర్ ప్లాన్ వేసిన రియా చక్రవర్తి !!

Published

on

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ కేసు ఇప్పుడు అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి చుట్టూ తిరుగుతోంది. సుశాంత్ కుటుంబ సభ్యులు పాట్నాలోని రాజీవ్ నగర్ పోలీస్ స్టేషన్ లో సుశాంత్ తండ్రి కేకే సింగ్ తన కుమారుడి మరణం వెనుక పెద్ద కుట్రయే దాగివుందని, అందులో రియా చక్రవర్తి హస్తం కూడా ఉందనే అనుమానాలున్నాయని.. ఆమె చేసిన మోసానికి బలై పోయిన సుశాంత్ ప్రాణాలు తీసుకున్నాడని, సుశాంత్ బలవాన్మరణానికి ముందే అంటే సరిగ్గా 6 రోజుల ముందు రియా తన ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్లి పోయిందని.. తన కుమారుడికి సంబంధించిన డబ్బు, ఆభరణాలు, ల్యాప్ టాప్, క్రెడిట్ కార్డు, ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లన్నీ రియా దగ్గరే ఉన్నాయని FIR లో తెలియజేస్తూ.. కేకే సింగ్ రియాతోపాటు ఆమె కుటుంబ సభ్యులు ఐదుగురుపై కంప్లైంట్ చేసారు. దీంతో పోలీసులు IPC సెక్షన్ 306, 340, 342, 380, 406 420 ప్రకారం రియాతో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు.

ఇక ఈ కేసు విచారణలో భాగంగా సుశాంత్ అకౌంట్ నుంచి రియాకు రూ. 15 కోట్లు ట్రాన్స్ ఫరైనట్టు గుర్తించారని తెలిసింది. ఈ కేసు దర్యాప్తు చేయడానికి CBI కూడా రంగంలోకి దిగడంతో పోలీసులు రియాను అరెస్ట్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్టుగా తాజా సమాచారం. అయితే ఇప్పటికే సుశాంత్ కేసులో FIR నమోదైన కారణంగా రియాను అరెస్ట్ నుంచి తప్పించేందుకు ఆమె లాయర్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేయడం ద్వారా నేరుగా రియాను కోర్టులో హాజరుపరిచేలా లాయర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే అప్పటివరకు ఎవరికీ అందుబాటులో లేకుండా తప్పించుకు తిరగాలని రియాకి సలహా ఇచ్చి ఉంటారనుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. సుశాంత్ బలవన్మరణం చేసుకొని 2 నెలలు దాటినా ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ మిస్టరీని ఛేధించే ప్రయత్నంలో ఇప్పటికే సుశాంత్‌తో సంబంధం ఉన్న 50 మందిని విచారించిన ముంబై పోలీసులు.. సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తిని టార్గెట్ చేస్తూ.. కొన్ని ముఖ్యమైన ఆధారాలను సేకరిస్తున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ తనపై ఎలాంటి అపవాదు రాకుండా చూసుకోవాలని రియా జాగ్రత్త పడుతున్నట్లుగా సోషల్ మీడియాలో రూమర్స్ చక్కెర్లు కొడుతున్నాయి.

ఈ నేపథ్యంలో సుశాంత్ కేసులో ప్రేక్షకులకు తనపై ఓ తప్పుడు అభిప్రాయం ఉందని గ్రహించిన రియా.. బాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ డైరెక్టర్ సహాయంతో ఓ సీనియర్ జర్నలిస్ట్ తో కుమ్మక్కై భారీ డీల్ కుదుర్చుకుందని, ప్రేక్షకులకు తనపై పాజిటివ్ ఫీలింగ్ కలిగేలా చేయాలని ఆ జర్నలిస్టును కోరిన రియా ఆ పనికి ఓకె చెప్పిన సదరు జర్నలిస్ట్ కు నోట్ల కట్టలు కుమ్మరించిందని, వెనుక నుంచి రియా PR టీమ్ ఈ కథను నడిపిస్తున్నారని, ఈ స్కెచ్‌ లో భాగంగానే రీసెంట్‌గా రియా వాట్సాప్ ఛాట్ ను బయటపెట్టి ఆ స్టార్ డైరెక్టర్ కి, రియాకు మధ్య తండ్రీ కూతుళ్ళ రిలేషన్‌షిప్ ఉన్నట్లుగా చీత్రీకరించారని, రియానే స్వయంగా ఈ వాట్సప్ ఛాట్ ను సదరు జర్నలిస్టుకిచ్చి మీడియాలో ప్రసారమయ్యేలా ప్లాన్ చేసిందనే రూమర్స్ వినబడుతున్నాయి. దీంతో సుశాంత్ మరణం వెనక పెద్ద కుట్ర దాగి ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Teenmar Mallanna: సమంత నాగచైతన్య విడాకులకు ఫోన్ ట్యాపింగ్ కారణం: తీన్మార్ మల్లన్న

Published

on

Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్‌ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్‌ లీడర్‌ ప్రమేయం ఉందని వెల్లడించారు.

ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.

Advertisement

పొలిటికల్ లీడర్..
ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.

Advertisement
Continue Reading

Featured

Anasuya: పవన్ కళ్యాణ్ గొప్ప లీడర్.. పిలిస్తే జనసేన ప్రచారానికి వెళ్తా: అనసూయ

Published

on

Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

sut

ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.

ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.

Advertisement

పార్టీని కాదు, నాయకుడిని చూడాలి..
పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Ananya Nagalla: ఆ హీరో లాంటి భర్త కావాలంటున్న పవన్ హీరోయిన్.. అమ్మడి ఆశలు మామూలుగా లేవు?

Published

on

Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమెకు తదుపరి పలు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఈ సినిమా తర్వాత ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ నాకు కాబోయే భర్త ఎలా ఉండాలి అంటే హాయ్ నాన్న సినిమాలో హీరో నాని క్యారెక్టర్ ఉంది కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అబ్బాయి భర్తగా రావాలని కోరారు.

Advertisement

హీరో నాని..
గ్రీన్ ఫ్లాగ్ అయ్యి ఉండాలి… రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉండాలనీ కోరుకునే అబ్బాయి భర్తగా రావాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉన్న క్వాలిటీస్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇది చూసినటువంటి నెటిజన్ లు అమ్మడికి కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!