Tag Archives: money

లక్ష పెట్టుబడితో 28 లక్షలు మీ సొంతం.. ఎలా అంటే…?

మనలో చాలామందికి డబ్బు సంపాదించాలంటే ఆశ ఉంటుంది. అయితే ఏ విధంగా సంపాదించాలనే విషయం తెలియక చాలామంది సంపాదించిన డబ్బుపై ఎక్కువ లాభాలకు పొందలేరు. అయితే సరైన విధంగా ఇన్వెస్ట్ చేస్తే మాత్రం తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను చవిచూడవచ్చు. తక్కువ సమయంలో డబ్బు సంపాదించడానికి స్టాక్ మార్కెట్ కూడా ఒకటి. స్టాక్ మార్కెట్లలో రిస్క్ ఎక్కువగా ఉండటంతో లాభాలు కూడా ఎక్కువగా ఉంటాయి.

స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం ద్వార కేవలం సంవత్సరం కాలంలోనే కళ్లు చెదిరే లాభాలను పొందవచ్చు. అయితే స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టే సమయంలో స్టాక్ మార్కెట్ పై పూర్తిగా అవగాహన ఉంటే మాత్రమే ఇన్వెస్ట్ చేయడం మంచిది. మల్టీబ్యాగర్ స్టాక్ ను కనిపెట్టి పెట్టుబడి పెడితే కళ్లు చెదిరే లాభాన్ని గ్యారంటీగా సొంతం చేసుకోవచ్చు. బయోఫిల్ కెమికల్స్ అనే స్టాక్ ధర సంవత్సర కాలంలోనే 28 రెట్లకు పైగా పరుగు పెట్టింది.

గతేడాదిలో ఈ స్టాక్ లో ఎవరైనా పెట్టుబడులు పెట్టి ఉంటే వాళ్లకు ఏకంగా ఏకంగా 28 రెట్ల లాభం సొంతమవుతుంది. ఈ స్టాక్ పై గతేడాది లక్ష ఇన్వెస్ట్ చేసిన వాళ్లు ఏకంగా 28 లక్షలు, రెండు లక్షలు ఇన్వెస్ట్ చేసిన వాళ్లు 56 లక్షలు సొంతం చేసుకున్నారు. స్టాక్ మార్కెట్ పై పూర్తి అవగాహన ఉండి సరైన విధంగా పెట్టుబడులు పెడితే మీరు కూడా ఇంతే మొత్తాన్ని పొందే ఛాన్స్ ఉంటుంది.

బయోఫిల్ కెమికల్స్ గతేడాది రూ.4.42 దగ్గర ట్రేడ్ కాగా ప్రస్తుతం దాని ధర రూ.126కు పెరిగింది. సంవత్సర కాలంలో ఏకంగా 2768 శాతానికి పైకి పెరిగింది. ఈ కంపెనీకి పోటీగా ఉన్న ఇతర కంపెనీలు మాత్రం వెనకాలే ఉన్నాయి.

పది వేలు కడితే ఇరవై వేల రూపాయలు.. ఎక్కడంటే..?

ఈ మధ్య కాలంలో మోసాలు చేయడానికి మోసగాళ్లు ఎక్కువగా ప్రజల బలహీనతలను క్యాష్ చేసుకుంటున్నారు. డబ్బును ఆశ చూపి అమాయక ప్రజలను ఈ నిలువునా ముంచేస్తున్నారు. మాటలతో గారడీ చేస్తూ కోట్ల రూపాయలు దోచేస్తున్నారు. స్కీముల పేరుతో కొత్త తరహా స్కాములకు తెరలేపుతున్నారు. లక్ష కాదు రెండు లక్షలు కాదు ఏకంగా కోట్ల రూపాయలు వసూలు చేస్తూ అమాయకపు ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నారు.

ఏపీలో నెల్లూరు జిల్లాలో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. ఆన్ లైన్ ట్రేడింగ్ ద్వారా 84 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఒక ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నెల్లూరు ఎస్పీ భాస్కర్ భూషణ్ మీడియాతో మాట్లాడుతూ ముఠాకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కర్నూలు, నెల్లూరు జిల్లాలకు చెందిన కొందరు యువకులు ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో వెల్‌ పే ట్రేడర్స్‌ పేరుతో సంస్థను ప్రారంభించారు.

ప్రజలకు 10,000 రూపాయలు డిపాజిట్ చేస్తే 100 పనిదినాల్లో రోజుకు 200 రూపాయల చొప్పున ఆన్ లైన్ లో 20,000 రూపాయలు జమ చేస్తామని ప్రకటనలు ఇచ్చారు. సులభంగా డబ్బు సంపాదించవచ్చనే ఆశతో చాలామంది తమ కష్టార్జితాన్ని డిపాజిట్ చేశారు. ఒకరు కాదు ఇద్దరు ఏకంగా ఏపీకి చెందిన 12,600 మంది ఈ మోసానికి బలయ్యారు. అలా మోసపోయిన వారిలో కొందరు బాధితులు నెల్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరమ్మ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులను పట్టుకోవడం కోసం అధికారులు ప్రత్యేక బృందాలను నియమించాయి. ఈ బృందాలు కేసులో ప్రధాన నిందితులైన రవికుమార్, శ్రీను, సుమన్ లను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు మనీ స్కీంల పేర్లు చెప్పి మోసాలకు పాల్పడే వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.