Tag Archives: tenth class

Tenth Class: పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్..! పరీక్ష రాసే పేపర్లలో మార్పులు..!

Tenth Class: పదో తరగతి విద్యార్ధులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ విద్యాశాఖ. ఈసారి పదో తరగతి వార్షిక పరీక్షల్లో కేవలం ఆరు పేపర్లు మాత్రము ఉంటాయని తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

Tenth Class: పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్..! పరీక్ష రాసే పేపర్లలో మార్పులు..!

పదో తరగతి విద్యార్థులకు గతంలో పేపర్ 1, పేపర్ 2గా మొత్తం 11 ప్రశ్నా పత్రాలు ఉండేవి. అయితే కోవిడ్ ప్రభావంతో ఈసారి ఆరు పేపర్లకే కుదించారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

Tenth Class: పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్..! పరీక్ష రాసే పేపర్లలో మార్పులు..!

ఈసారి కూడా చాలా ఆలస్యంగానే విద్యా సంవత్సరం ప్రారంభం అయింది. ఇదే కాకుండా థర్డ్ వేవ్ కారణంగా ఇటీవల కొన్ని రోజులు స్కూళ్లు మూతపడ్డాయి.  ఇదిలా ఉంటే ఈసారి ఫస్ట్ లాంగ్వేజ్, ఇంగ్లీష్, గణితం, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్ క్వశ్చన్ పేపర్లను సింగిల్ పేపర్లకే పరిమితం చేస్తున్నామని పరీక్షల విభాగం డైరెక్టర్ వెల్లడించారు.

ఎలాంటి తప్పిదాలు ఉండకూడదని ఆదేశాలు..

ఫస్ట్ లాంగ్వేజ్ తో పాటు మిగతా సబ్జెక్ట్ ల పేపర్లను సింగిల్ పేపర్లకు పరిమితం చేశారు. మొత్తం వంద మార్కులకు జరిగే ఈ పరీక్షల్లో 80 మార్కులు బోర్డ్ ఎగ్జామ్స్ కాగా…20 మార్కులు ఇంటర్నల్స్ మార్కులు ఉంటాయని వెల్లడించింది. మరోవైపు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో రెగ్యులర్, ఓపెన్ టెన్త్, ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థుల వివరాలను తప్పులు లేకుండా తీసుకోవాలని, ఆన్ లైన్ డాటా సేకరణలో ఎలాంటి తప్పిదాలు ఉండకూడదని ఆదేశాలు జారీచేశారు. కాగా.. గతంలో కొన్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గడువు తేదీలు ముగిసినా కూడా రెండు, మూడు నెలలకు మన్యూ స్ట్రిప్ట్ నామినల్ రోల్స్(ఎంఎన్ఆర్) ను సమర్పిస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని… ఈసారి ఆలస్యం జరగకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. ఈసారి ఆలస్యం అయితే.. ఆలస్య రుసుము తప్పకుండా తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాల వారీగా విద్యాశాఖాధికారులు కార్యాయాలయాల్లో చలానాతో పాటు ఎంఎన్ఆర్ లను గడువులోగా సమర్పించాలని.. అందకపోతే తర్వాత చర్యలు తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

నిరుద్యోగులకు శుభవార్త… పదో తరగతి అర్హతతో పోస్టాఫీస్ ఉద్యోగాలు..?

గత కొన్ని రోజుల నుంచి నిరుద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వరుస నోటిఫికేషన్లు వెలువడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా భారత్ పోస్టల్ శాఖ 2582 పోస్టల్ సర్వెంట్ల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పదో తరగతి పాసైన వాళ్లను మెరిట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాతపరీక్ష, ఇంటర్వ్యూలు ఉండవు.

ప్రస్తుతం ఈశాన్య, పంజాబ్ పోస్టల్, జార్ఖండ్ సర్కిల్ లోని ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. జీడీఎస్ ఉద్యోగాలు కాకుండా ఇతర ఉద్యోగాలపై ఆసక్తి ఉంటే appost.in వెబ్ సైట్ ద్వరా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. 2582 పోస్టులలో జార్ఖండ్ పోస్టల్ సర్కిల్ లో 1,118 పోస్టులు, నార్త్ ఈస్టర్న్ పోస్టల్ సర్కిల్ లో 948 పోస్టులు , పంజాబ్ పోస్టల్ సర్కిల్ లో 516 పోస్టులు ఉన్నాయి.

గ్రామీణ్ డాక్ సేవక్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి పాస్ కావాల్సి ఉంటుంది. 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ కేటగిరీల అభ్యర్థులకు, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు.

అధికారిక పోర్టల్ కు వెళ్లి ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ నెల 11వ తేదీలోగా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బ్రాంచ్ పోస్ట్ మాస్ట‌ర్‌, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్ట‌ర్ ఉద్యోగాల భర్తీ కూడా జరుగుతోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.