ప్రస్తుత కాలంలోని మనుషులలో జాలి, దయ, కరుణ అనేవి మాయమయ్యాయి. సాటి మనుషుల పట్ల,మూగ జంతువుల పట్ల ఏమాత్రం మానవత్వం లేకుండా ఎంతో విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నారు.మనుషులతో కాకపోయినప్పటికీ నోరులేని మూగ జీవాల పట్ల ఎంతో మూర్ఖత్వంగా ప్రవర్తించి వాటిని హింసిస్తున్నారు. ఈ విధమైనటువంటి సంఘటనలు ఇది వరకు మనం ఎన్నో చూసాము. అచ్చం ఇలాంటి ఘటనే తమిళనాడులో చోటు చేసుకుంది.
తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలోని తిరుమూర్తి ఆనకట్ట దగ్గర నీళ్ల కోసం వచ్చిన ఏనుగులను చూసిన స్థానిక గిరిజనులు వాటిపట్ల ఎంతో విచక్షణారహితంగా ప్రవర్తించారు.ఏనుగుల పై దాడి చేస్తూ వాటిని కర్రలతో బాధడమే కాకుండా వేట కుక్కలను వదిలి రాక్షసానందం పొందారు.
ఈ విధంగా ఈ గిరిజన యువకులు ఏనుగుల పట్ల ప్రవర్తిస్తున్న తీరును కొందరు యువకులు ఈ కొండపై నుంచి వీడియో తీశారు. ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియో చూసిన జంతు ప్రేమికులు ఆ గిరిజన యువకులు చేసిన పనికి ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారికి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యి అటవీ శాఖ అధికారుల దృష్టికి చేరడంతో వీడియో ఆధారంగా అటవీశాఖ అధికారులు ముగ్గురు గిరిజన యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ విధంగా మూగజీవాలను హింసించినందుకుగాను వారిపై వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వారిపై కేసు నమోదు చేశారు.
ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…
దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…
జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…
ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…
ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…
విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…