దక్షణ భారత్ లో గ్లామర్కే గ్రామర్ నేర్పిన లేడీశ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ విజయశాంతి పుట్టినరోజు సందర్భంగా ఆమెకోసం ప్రేక్షకులకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు..
విజయశాంతి టాలీవుడ్ లోకి ఎంటర్ కాకముందు సినిమా కధలన్నీ హీరో చుట్టూనే తిరుగుతుండేవి. అప్పట్లో ఏడాదికి ఒకటో.. రెండో లేడీ ఓరియంటెడ్ సినిమాలు విడుదలయ్యేవి. కానీ అసలు సిసలైన లేడీ ఓరియెంటెడ్ సినిమా కధలు ఎలా వుంటాయో తాను నటించిన చిత్రాలతో నిరూపించింది మన లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో టాలీవుడ్కి కొత్త రూపు తీసుకువచ్చిన ఘనత ఈ లేడీ సూపర్ స్టార్కే దక్కుతుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అత్యధిక హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలలో నటించి తనకంటూ ఓ ట్రెండ్ ను క్రియేట్ చేసిన విజయశాంతి తన 30 సంవత్సరాల సినీ ప్రస్థానంలో సుమారు 180కి పైగా సినిమాలలో నటించింది. చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలు సైతం ఈమెతో నటించడానికి ఉత్సాహం చూపించేవారంటే విజయశాంతికి ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి-విజయశాంతి హిట్ కాంబినేషన్లో 19 చిత్రాల్లో కథానాయికగా నటించిన విజయశాంతి నందమూరి బాలకృష్ణతో 17 చిత్రాల్లో నటించింది. ఇక విజయశాంతి వ్యక్తిగత విషయాలు చాలామందికి తెలియవు. గత సంవత్సరం రిలీజ్ అయిన “సరిలేరు నీకెవ్వరు” చిత్రంలో నటించారు విజయశాంతి ఆ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే..
1966 జూన్ 24న వరంగల్లో జన్మించిన విజయశాంతి.. తన పిన్ని విజయలలిత వారసత్వం కారణంగా ఏడేళ్ల వయసులోనే బాల నటిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘కిలాడీ కృష్ణుడు’ సినిమాలో కధానాయికగా నటించిన విజయశాంతి ఆ తరువాత ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. 1991లో ‘కర్తవ్యం’ సినిమాలో ఆమె నటనకు గానూ జాతీయ ఉత్తమ నటి గా పురస్కారాన్ని అందుకున్న విజయశాంతి తన 17 ఏళ్ళ వయస్సులోనే తండ్రిని పోగొట్టుకుంది. ఆ తర్వాత ఏడాది తిరగకుండానే తల్లి కూడా పోగొట్టుకుంది. తను జీవితంలో ఇలా అష్ట కష్టాలు పడుతున్న సమయంలో దైవమిచ్చిన భర్త శ్రీనివాస ప్రసాద్ అని, తనకు బాగా గుర్తింపును తీసుకొచ్చిన ‘కర్తవ్యం’ సినిమా నిర్మాత అతనేనని, అతనితో తన పెళ్ళై నేటికి 32 ఏళ్లయిందని.. 1988, మార్చ్ 29న రిజిష్టర్ మ్యారేజ్ చేసుకున్నామంటూ మరికొన్ని సంచలన విషయాలను మీడియా ప్రతినిధులతో పంచుకుంది మన లేడీ సూపర్ స్టార్.
టాలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్గా మంచి గుర్తింపును సంపాదించుకున్న విజయశాంతి ఒక్కసారిగా రాజకీయాల్లోకి ప్రవేశించడంతో సినీ రంగానికి దూరమయ్యారు. 2006లో వచ్చిన ‘నాయుడమ్మ’ సినిమా ఆమె హీరోయిన్ గా నటించిన ఆఖరు చిత్రం. మళ్ళీ 13 ఏళ్ల తర్వాత టాలీవుడ్ లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి మహేష్ బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో తల్లి పాత్రలో కనిపించారు. మొత్తానికి చాలా సంవత్సరాల తరువాత టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి ఆ తరువాత సినిమాలపై మక్కువ చూపించడం లేదు. అభిమానుల కోరిక మేరకు ఆమె మరిన్ని విజయవంతమైన చిత్రాల్లో నటించాలని కోరుకుంటూ.. హ్యాపీ బర్త్ డే లేడీ సూపర్ స్టార్.
Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్ ట్యాపింగ్ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్ లీడర్ ప్రమేయం ఉందని వెల్లడించారు.
ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.
Advertisement
పొలిటికల్ లీడర్.. ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.
Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.
ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.
Advertisement
పార్టీని కాదు, నాయకుడిని చూడాలి.. పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమెకు తదుపరి పలు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
ఈ సినిమా తర్వాత ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ నాకు కాబోయే భర్త ఎలా ఉండాలి అంటే హాయ్ నాన్న సినిమాలో హీరో నాని క్యారెక్టర్ ఉంది కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అబ్బాయి భర్తగా రావాలని కోరారు.
Advertisement
హీరో నాని.. గ్రీన్ ఫ్లాగ్ అయ్యి ఉండాలి… రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉండాలనీ కోరుకునే అబ్బాయి భర్తగా రావాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉన్న క్వాలిటీస్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇది చూసినటువంటి నెటిజన్ లు అమ్మడికి కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.