గునుపూడి విశ్వనాథశాస్త్రి.. ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. అయితే ఐరన్ లెగ్ శాస్త్రి అంటే తెలుగు ఆడియన్స్ కు బాగా సుపరిచితులు. అవును.. 150 పైగా వెండితెరపై తన కామెడీ టైమింగ్ తో టాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో నవ్వించారు. టాలీవుడ్ దర్శకుడు కీర్తిశేషులు ఈవీవీ సత్యనారాయణ గారు తెరకెక్కించిన అప్పుల అప్పారావు చిత్రంతో విశ్వనాథశాస్త్రి వెండితెరకు పరిచయమయ్యారు. ఈయన తనదైన భారీ ఆకారంతో అలాగే అదిరిపోయే కామెడీ టైమింగ్ తో వెండితెరపై ఒకానొక సమయంలో బాగానే పేరుపొందాడు.
ఈయన ముఖ్యంగా కామెడీ కింగ్ బ్రహ్మానందంకు శిష్యుడిగా అనేక సినిమాలలో నటించారు. ఆయనతో కలిసి నటించిన అనేక సినిమాలలో సంబంధించిన కామెడీ సీన్స్ ఇప్పటికి ఎవరు మర్చిపోరు. ఇప్పుడు కూడా ఆ సీన్లు టీవీ లో వస్తే ఛానల్ మార్చకుండా వాటినే చూస్తూ తెగ నవ్విస్తూ ఉంటారు. ఇకపోతే విశ్వనాధశాస్త్రి సినిమాల్లోకి రాక ముందు ఆయన పౌరోహిత్యం చేసేవారు. ఐరన్ లెగ్ గా మొదటగా ఆయనను ఈవీవీ సత్యనారాయణ సిరి ఇండస్ట్రీకి పరిచయం చేయగా ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈయన అప్పుల అప్పారావు సినిమా ద్వారా పరిచయం అయిన తర్వాత ఆ తర్వాత ప్రేమఖైదీ, ఏవండీ ఆవిడ వచ్చింది, ఆవిడ మా ఆవిడ, పేకాట పాపారావు మొదలైన సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే సినిమాల్లో నటిస్తున్న సమయంలో ఆదాయం ఎక్కువవడంతో తాను చేస్తున్న పురోహితంని పూర్తిగా మర్చిపోయి సినిమాల్లోనే స్థిరపడి పోయాడు. అయితే సినిమాల్లో ఆదాయం ఎక్కువగా లభించడంతో ఆ సమయంలో ఆయన తాగుడుకు బానిస అయ్యారు. తాగుడుకు బానిస అవ్వడంతో చివరికి ఆయనను సినిమా అవకాశాలు కూడా రాకపోయాయి. దీంతో ఆయన అనేక ఆర్థిక ఇబ్బందులకు గురి అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇలాంటి పరిస్థితుల్లో ఆయన సినిమా అవకాశాలు లేక, తన పాత వృత్తి పురోహితం వైపు తిరిగి వెళ్లాలి అనుకున్నప్పటికీ తనను వెండి తెరపై చూపించే ఐరన్ లెగ్ పేరు కి తన జీవితం లో మళ్లీ పురోహిత వైపు అవకాశం దొరకలేదు. తన స్క్రీన్ నేమ్ అతనికి ఉపాధి కరువయ్యేలా చేసిందట. అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని విశ్వనాథశాస్త్రి తెలిపారు. సినిమాల్లో ఐరన్ లెగ్ పాత్రకు ఎక్కువగా దురదృష్టానికి, దరిద్రానికి సింబాలిక్ గా చూపించి నవ్వులు పూయించే వారు. నిజానికి ఆ పాత్ర కేవలం సినిమా తెరపై మాత్రమే అయినప్పటికీ ఆ పేరు ఆయన వ్యక్తిగత జీవితానికి బాగా ప్రభావితం చేసింది. ఆఖరి రోజుల్లో శాస్త్రి తన పురోహితం చేసుకుని పొట్ట పోసుకుందాం అనుకున్నప్పటికీ ఆయన సినిమాల్లో సైడ్ ఎఫెక్ట్ వల్ల ఎవరూ ఆయనకు శుభకార్యాలకు పిలిచేవారు కాదు.
అంతేకాదు సినీ పరిశ్రమలో కూడా ఏవైనా సినిమాకు సంబంధించి శుభకార్యాలు జరుగుతున్న సమయంలో కూడా ఆయన్ని అటువైపు కూడా కాలు పెట్టినవ్వలేదు. దీంతో ఆయన పరిస్థితి చివరిలో చాలా ఘోరంగా మారింది. బయట చేసుకోవడానికి పురోహితం ఛాన్స్ లేక అలాగే సినిమాల్లో నటించడానికి అవకాశాలు లేక ఎవరిని పడితే వారిని డబ్బులు అడగడం పరిపాటిగా మారిపోయింది. అంతే కాకుండా ఆయన మందుకు పూర్తిగా అలవాటు పడడంతో చాలా సమస్యలను ఎదుర్కొన్నారు. ఒకానొక సమయంలో తన కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన మీడియా పూర్వకంగా అడిగారు. దీంతో కొంతమంది సినీ వర్గానికి చెందిన వారు ఆయనకు కాసింత ఆర్థిక సహాయం అందించిన అది పూర్తిగా ఆయన కష్టాల్లో నుంచి బయటికి వెళ్లేలా చేయలేదు. చివరికి ఆయన ప్రతిభ ఆయన కు శాపంగా మారింది.
ఒక దశలో ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతినడంతో శాస్త్రి తన స్వగ్రామం తాడేపల్లిగూడెం వెళ్లిపోయాడు. ఓవైపు సినిమా అవకాశాలు లేక, మరోవైపు పౌరోహిత్యానికి ఎవరూ పిలవక దుర్భర దారిద్ర్యం అనుభవించాడు. చివరికి శరీరం భారీగా పెరిగిపోయి పచ్చకామెర్ల వ్యాధితో మంచం పట్టాడు. ఆ సమయంలో భార్యాబిడ్డలు హైదరాబాద్ లో ఉంటే గుండెపోటు వచ్చిందని ఐరన్ లెగ్ శాస్త్రిని అయన బంధువులు ఆసుపత్రిలో చేర్చారు. అయితే భార్య, కొడుకు వచ్చేసరికి ఆయన ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆయన 2006 జూన్ 19న తాడేపల్లిగూడెంలో మరణించారు.
అయితే ఐరన్ లెగ్ శాస్త్రి దేహాన్ని ఓ రిక్షాలో పడేసిన వైనం చూసి భార్య కళ్లు తిరిగి కిందపడిపోయిందట. ట్రైన్ దిగి నేరుగా ఆసుపత్రికి వెళుతున్న ఆయన భార్య, కుమారుడికి ఓ రిక్షాలో ఆయన దేహం ఎదురొచ్చింది. ఆ సమయంలో తన తండ్రి శరీరం సగమే రిక్షాలో ఉందని, కాళ్లు చేతులు రిక్షా బయటికి వేలాడుతూ ఉన్నాయని, ఆ స్థితిలోనే ఆయన్ను రిక్షాల్లో లాక్కెళ్లడం చూసి తన తల్లి తట్టుకోలేపోయిందని ఐరన్ లెగ్ శాస్త్రి కుమారుడు ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.
Siddharth -Aditiy: సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా కొనసాగుతూ ఉన్నటువంటి వారిలో సిద్ధార్థ్ అదితి రావు హైదరి జంట ఒకటి. వీరిద్దరూ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. అయితే వీరిద్దరూ కలిసి అవే భూపతి దర్శకత్వంలో వచ్చిన మహాసముద్రం సినిమాలో కలిసిన నటించారు. ఇక ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు..
ఇక వీరిద్దరూ కలిసి ముంబైలో సహజీవనం చేస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్లినా ఇద్దరు కలిసి జంటగా వెళ్లారు. అయితే వీరి రిలేషన్ గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి కానీ వీరు మాత్రం ఎప్పుడూ కూడా తమ రిలేషన్ గురించి ఓపెన్ అవ్వలేదు. ఇలా రహస్యంగా తమ రిలేషన్ మెయింటైన్ చేస్తూ వస్తున్నటువంటి ఈ జంట ఇటీవల రహస్యంగా పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు.
ఇలా ముంబైలో సహజీవనం చేస్తున్నటువంటి ఈ జంట తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్లోని రంగనాథ స్వామి ఆలయ మండపంలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులతో వీరి వివాహ వేడుక హిందూ సాంప్రదాయ పద్ధతిలో జరిగింది. ఇలా వీరిద్దరు పెళ్లి చేసుకున్నారనే వార్త వైరల్ గా మారడంతో అందరూ షాక్ అవుతారు.
Advertisement
తెలంగాణలో వివాహం.. రిలేషన్ లో ఉన్నటువంటి ఈ జంట ఇలా రహస్యంగా పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఏంటని ఆరా తీస్తున్నారు అయితే ఇలా వీరిద్దరూ పెళ్లి చేసుకున్నప్పటికీ ఇద్దరికీ ఇది మొదటి వివాహం కాదని వీరిద్దరికీ ఇది రెండో వివాహమనే చెప్పాలి ఇప్పటికే వీరిద్దరూ పెళ్లిళ్లు చేసుకొని విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటూ తిరిగి రెండో పెళ్లి చేసుకున్నారు.
Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ పరిచయం అవసరం లేని పేరు. ఒక సాధారణ రైతుబిడ్డగా పొలం పనులు చేసుకుంటూ ఉన్నటువంటి ఈయన ఎన్నో రకాల వీడియోలు చేస్తూ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫేమస్ అయ్యారు. ఇలా యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ ఉన్నటువంటి ఈయనకు బిగ్ బాస్ అవకాశం రావడంతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు. హౌస్ లోకి అడుగు పెట్టినటువంటి ప్రశాంత్ అనంతరం విన్నర్ గా బయటకు వచ్చారు.
ఇక గ్రాండ్ ఫినాలే రోజు ఈయన అభిమానులు చేసిన హంగామా గురించి మనకు తెలిసిందే. పెద్ద ఎత్తున కార్లు ధ్వంసం చేయడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేయడంతో ఈయనపై కేసులు పెట్టి జైలుకు పంపించారు. అయితే బెయిలు మీద బయటకు వచ్చినటువంటి పల్లవి ప్రశాంత్ తన రెండు రోజుల జైలు జీవితం గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తాను రెండు రోజులపాటు జైలులో చాలా ఇబ్బంది పడ్డాను అని తెలిపారు. బాధతో భోజనం కూడా చేయలేదని కానీ తోటి ఖైదీలు చెప్పడంతో భోజనం చేశానని జైలు కూడు బాగుందని తెలిపారు. నన్ను వీఐపీ ఇలా ట్రీట్ చేసిన లేక సాధారణంగా ట్రీట్ చేసిన కూడా అక్కడ భోజనం బాగుందని ఈయన వెల్లడించారు. ఇక ఖైదీలు అందరూ కూడా నాతో మాట్లాడుతూ బిగ్ బాస్ గురించి ప్రశ్నలు వేసే వాళ్ళు విన్నర్ ఎవరంటూ కూడా అడిగేవారు.
Advertisement
బిగ్ బాస్ గురించి అడిగేవారు.. ఇక నేను వెళ్ళిన తర్వాత జైలుకు వచ్చిన వారు బయట జరిగిన గొడవ గురించి తెలిపే వారని ప్రశాంత్ తెలిపారు. అయితే నేను జైలులో ఉంటే ఏ మాత్రం భయపడలేదు నేను తప్పు చేయలేదు అందుకే ఎవరికి భయపడలేదని కానీ నాపై విమర్శించిన వారికి కూడా అదే గతే పడుతుంది అంటూ ఈ సందర్భంగా జైలు జీవితం గురించి ప్రశాంత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్ ట్యాపింగ్ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్ లీడర్ ప్రమేయం ఉందని వెల్లడించారు.
ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.
Advertisement
పొలిటికల్ లీడర్.. ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.