హాస్య నటుడు రాజబాబు… తెలుగు సినిమాలు చూసేవారి ప్రతిఒక్కరికి ఈయన గురించి తెలిసే ఉంటుంది. అది ఎందుకు అంటారా …? ఈయన తన 20 సంవత్సరాల నట జీవితంలో 560 సినిమాలలో నటించారు. రాజబాబు అసలు పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు. రాజబాబు అక్టోబరు 20, 1935 తేదీన పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో పుట్టారు. నిడదవోలు లోని పాఠశాల చదువు చదువుతూనే బుర్రకథ నేర్చుకోవడానికి శ్రీ అచ్యుత రామయ్య గారి దగ్గర చేరాడు. తాను అప్పట్లోనే ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఆ తరువాత ఉపాధ్యాయ శిక్షణ కోర్సు ముగించి తెలుగు ఉపాధ్యాయుడుగా కొద్దికాలం ఆయన పనిచేశాడు. ఇక ఉపాధ్యాయునిగా పనిచేసేటప్పుడే నాటకాలలో పాలుపంచుకొనే వాడు. ఇక దీనితో ఆయన వారి స్నేహితుల ప్రోత్సహంతో చెన్నైకి వెళ్లి అక్కడ సినిమాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు.
రాజబాబు డిసెంబరు 5, 1965 తేదీన లక్ష్మీ అమ్ములును వివాహమాడాడు. వారికి నాగేంద్రబాబు, మహేశ్ బాబు అనే ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఒక సారి నాటకంలో రాజబాబును చూసిన గరికపాటి రాజారావు (దర్శకుడు) సినిమాలలో చేరమని ఉత్సాహపరిచాడు. ఆ తర్వాత మద్రాసు చేరుకొని పూట గడవడానికి హాస్యనటుడు అడ్డాల నారాయణరావు పిల్లలకు ప్రైవేటు చెప్పేవాడు. కొద్దీ రోజుల తరువాత అడ్డాల నారాయణరావు రాజబాబుకి సమాజం సినిమాలో అవకాశం కల్పించాడు. ఆ తరువాత వరుసగా తండ్రులు-కొడుకులు, కులగోత్రాలు , స్వర్ణగౌరి , మంచి మనిషి మొదలగు చిత్రాలలో అవకాశాలు వచ్చాయి. స్వర్ణగౌరి చిత్రానికి గాను మొట్టమొదటిగా 350 రూపాయలు పారితోషికంగా స్వీకరించాడు.
ఇకపోతే సినిమాలో ప్రేక్షకులను తన అద్భుత నటనతో కడుపుబ్బ నవ్వింవిన రాజబాబు నిజజీవితంలో గొప్ప మనసు ఉన్నగలవాడు ఆయన. ప్రతి ఒక్క సంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా పాతతరం నటుల్ని, నటీమణుల్ని సత్కరించే వాడు. ఇక ఈయన వరుసగా ఏడు సార్లు ఫిలింఫేర్ అవార్డు పొందిన మొట్టమొదటి హాస్యనటుడు రాజబాబు.అంతేకాదు ఆయన జీవితంలో మొత్తం 9 ఫిలింమ్ ఫేర్ అవార్డులు, 3 నంది బహుమతులు, ఎన్నెన్నో అవార్డులు అందుకున్నారు. అయితే అప్పట్లోనే రాజాబాబు బాగా సంపాదించారట. అప్పట్లో హీరోలతో సమానంగా రాజాబాబు రెమ్యునరేషన్ అందుకునే వారట. ఆ కాలంలోనే అయన కోట్ల ఆస్తులు సంపాదించారట. ఆ తర్వాత అయన సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారట.
ఇక అన్ని సాగుతున్న సమయంలో ఆయన స్వతహాగా బాబు అండ్ బాబు పేరుతో ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి అందులో మొదటి సినిమాగా “ఎవరికీ వారే యమునా తీరే” చేసారు. ఆ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఇక అయితే ఆ తర్వాత “మనిషి రోడ్డున పడ్డాడు” అనే సినిమా చేసారు. ఆ సినిమా ఆశించినంతగా ఆడకపోవడంతో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.
రాజబాబు 1983 సంవత్సరం ఫిబ్రవరి 14న 48 ఏళ్ల వయసులో మరణించారు. అయితే రాజబాబుకి నాగేంద్రబాబు, మహేష్ బాబు అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరూ అమెరికాలో సెటిల్ అయ్యారు. రాజబాబు తమ్ముడు చిట్టిబాబు ఇచ్చిన ఇంటర్వ్యూ లో రాజబాబు ఆస్తుల వివరాల గురించి మాట్లాడుతూ.. రాజబాబు చాలా దురదృష్టవంతుడు అన్నాడు. అప్పట్లోనే డబ్బు సంపాదించి అన్ని కోట్లు కూడబెట్టినా కూడా అయన మాత్రం అనుభవించకుండా వెళ్లిపోయాడని బాధ పడ్డాడు. ఆ రోజుల్లోనే రాజాబాబు ఫారెన్ కార్లలో తిరిగే వాడని, అప్పట్లో తమిళ నటుడు శివాజీ గణేషన్ నుంచి లక్ష రూపాయలకు ఆ ఫారెన్ కారు కొన్నాడన్నారు. అయితే వీరికి ఇండియాతో పాటు అమెరికాలోకూడా ఆస్తులున్నాయని చెప్పాడు. అంతేకాకుండా అమెరికాలో రాజబాబు పిల్లల్లిద్దరూ సొంత సాఫ్ట్ వేర్ కంపెనీ నడుపుతున్నారని.. ఆ సాఫ్ట్ వేర్ కంపెనీ విలువే సుమారు 30 కోట్ల వరకు ఉంటుందన్నాడు. వాటితో పాటు మరికొన్ని ఆస్తులు కూడా ఉన్నాయని చిట్టి బాబు వెల్లడించాడు.
AP Politics: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రోజురోజుకు మద్దతు పూర్తిగా తగ్గిపోతుందని చెప్పాలి.ఇలా వైసిపికి మద్దతు తగ్గిపోతూ కూటమికి భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం కూటమికి మద్దతు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇటీవల చిరంజీవిని సీఎం రమేష్, పంచకర్ల రమేష్ కలిసారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. తెలుగుదేశం బిజెపి, జనసేన కూటమిగా ఏర్పడటం శుభ పరిణామం అని తెలిపారు. చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని తెలిపారు.
ఇలా నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను అంటే కేవలం తమ్ముడు పవన్ కళ్యాణ్ కారణం ఈయన తెలిపారు. సీఎం రమేష్ నా చిరకాల మిత్రుడు చాలా మంచివారు. పంచకర్ల రమేష్ నా ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరు నాకు కావలసినవారు ఇద్దరు సమర్థులే వారికి ఓటు వేసే గెలిపించాలి అంటూ చిరంజీవి తెలిపారు. వీరిద్దరు గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధికి దోహదపడతారని చిరంజీవి తెలిపారు.
Advertisement
మెగా ఫాన్స్ ఓట్లు కూటమికే.. ఈ విధంగా చిరంజీవి కూటమికి మద్దతు తెలియజేయడంతో మెగా ఫాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే చిరంజీవి ఇలా పరోక్షంగా మద్దతు తెలియజేయడంతో కూటమికి భారీ స్థాయిలో అభిమానుల ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఇది జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాకే అని స్పష్టంగా తెలుస్తుంది.
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీ తరఫున 21 మంది ఎన్నికలలో పోటీ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ భీమవరంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం కాస్త సంచలనగా మారింది. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఆ వ్యక్తుల జోబులలో కత్తులు కనిపించడం సంచలనంగా మారింది.
ఈ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వేరువేరుగా పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ యువకులు పోలీసులపైనే దాడికి ప్రయత్నించి తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ పోలీసులు వీరిని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. ఇక వీరి వద్ద కత్తి ఉండడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేశారు.
Advertisement
దాడికి ప్రయత్నమా.. ఈ సభలో ఇలా వీరిద్దరూ అనుమానాస్పదంగా కత్తులతో కనిపించడంతో బహుశా జోబు దొంగలు అయ్యి ఉంటారా లేదంటే ఎవరిపైన దాడి చేయడానికి ఇలా వచ్చారా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఇద్దరు యువకులు కూడా భీమవరంలోని బలుసుమూడి, దుర్గాపురానికి చెందిన యువకులుగా వారిని పోలీసులు గుర్తించారు.
AP Politics: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలి జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత చూపిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈమె కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి పై పోటీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇటీవల ఈమె నామినేషన్ కూడా దాఖలు చేశారు.
ఈ క్రమంలోనే ఈమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ విషయం గురించి షర్మిల మాట్లాడుతూ ఒక గులకరాయికే హత్యాయత్నం అంటూ తన సొంత పత్రికలో పెద్ద ఎత్తున వార్తలు రాశారు అలాగే బ్యానర్లు కూడా కట్టారు.
ఒక చిన్న గులకరాయికి ఇంతలా విలవిలలాడితే ఏడుసార్లు గొడ్డలితో వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు ఏమైంది జగనన్న అంటూ ఈమె ప్రశ్నించారు. తన తండ్రి దారుణంగా హత్యకు గురి అయితే గత ఐదు సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నటువంటి సునీత మీకు కనపడలేదా అంటూ ప్రశ్నించారు.
Advertisement
కంచుకోటకు బీటలు.. ఈ విధంగా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి వైయస్ షర్మిల సునీత పదేపదే మాట్లాడుతూ వైసీపీకి ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్నటువంటి కడపలో ఈసారి షర్మిల దెబ్బకు కంచుకోట బద్దలు కాబోతోందని తెలుస్తోంది. ఇలా వీరి వ్యాఖ్యలతో అక్కడ ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.