Connect with us

Featured

‘అరణ్య’ సినిమా రివ్యూ అండ్ రేటింగ్..!!

Published

on

ప్రభు సాల్మన్ దర్శకత్వంలో దగ్గుబాటి రానా, విష్ణు విశాల్, జోయ హుస్సేన్, శ్రీయా పింగోల్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం అరణ్య.. మార్చి 26 అనగా ఈ రోజు విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు మన సమీక్ష లో తెలుసుకుందాం…

కథ విషయానికొస్తే ;

నరేంద్ర భూపతి అలియాస్ అరణ్య (రానా) కి ప్రకృతి అంటే చాలా ఇష్టం.. వల్ల తాతలు ప్రభుత్వానికి 500 ఎకరాలు రాసిచ్చేస్తే..మన అరణ్య ఆ అడవికి, అక్కడి జంతువులకు రక్షకుడిగా ఉంటాడు.. అంతేకాదు ప్రకృతి ప్రేమికుడిగా లక్ష మొక్కలు నాటి.. రాష్ట్రపతి చేత ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అవార్డును అందుకుంటారడు.. అయితే అక్కడి అటవీ శాఖ మంత్రి రాజగోపాలం (అనంత్ మహదేవన్)కి ఆ అడవిలోని స్థలంపై కన్ను పడుతుంది.. అక్కడ ఒక టౌన్ షిప్ ని కట్టాలని అనుకుంటాడు… దానికోసం 60 ఎకరాల అడవిని నాశనం చేయాలని అనుకుంటాడు రాజగోపాలం.. దాన్ని మన అరణ్య ఎలా అడ్డుకున్నాడు.? తన ప్రాజెక్ట్ కి అడ్డుపడిన అరణ్య ను మంత్రి ఏ విధంగా హింసించాడు? చివరికి అడవిని, ఏనుగులని అరణ్య ఎలా రక్షించాడు?అనేదే కథ..

Advertisement

ఇక విశ్లేషణ విషయానికొస్తే;

గతంలో ప్రేమఖైదీ, గజరాజు వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న తమిళ దర్శకుడు ప్రభు సల్మాన్.. అరణ్య సినిమాతో అంచనాలను అదుకోలేకపోయాడనే చెప్పాలి.. సినిమాలో కథ బాగున్నా.. దాన్ని తెరపై చూపించిన విధానం బాగోలేదు.. మంచి బలమైన కథను తెరపై ఆసక్తికరంగా చూపించడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి.. సినిమాలో పాత్రల పరిచయం వరకు బాగానే ఉన్నా. ఆ తర్వాత కథ, కథనాన్ని అర్థం లేకుండా ఏటో తీసుకెళ్లాడు.. కథలో అసలు నక్సలైట్లు ఎందుకు వచ్చారో అర్ధం కాదు.. మళ్ళీ అందులో మావోయిస్టుతో సింగ ప్రేమ కథ కూడా అంతా ఇంట్రెస్ట్ గా అనిపించదు.. ఇంత బలమైన కథలు ఎలాటి ట్విస్టులు లేకుండా సింపుల్ గా సాగిపోతుంది ఈ సినిమా..ఇక సినిమాలో మెయిన్ హైలైట్ విజువల్ ఎఫెక్ట్.. సినిమా నేపథ్యం అంతా అడవి చుట్టే తిరుగుతుంది.. షూటింగ్ కూడా ఎక్కువ శాతం అడవిలోనే జరిగింది.. ఇక అడవి యొక్క అందాలను స్క్రీన్ పై చాలా బాగా చూపించారు.. సినిమాటోగ్రఫీ ఏ ఆర్ అశోక్ పనితనం ప్రతీ ఫ్రేమ్ లో కనిపిస్తుంది.. ఇక సినిమాకు మరో ప్రధాన బలం నేపథ్య సంగీతం.. మ్యూజిక్ డైరెక్టర్ శాంతను మెయిత్రా కొన్ని సీన్లకు తన బీజీఏం తో ప్రాణం పోశాడనే చెప్పాలి.. ఎడిటింగ్ ఇంకా పర్ఫెక్ట్ గా ఉడాల్సింది.. నిర్మాణ విలువలు బాగున్నాయి..

ఇక మొత్తంగా సినిమా రివ్యూ ;

Advertisement

ప్లస్ పాయింట్స్ :
రానా నటన
స్టోరీ
విజువల్స్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్ :
స్క్రీన్ ప్లే
సాగదీత సీన్లు

ఇక ఫైనల్ గా ఈ సినిమాకి తెలుగుడెస్క్ ఇస్తున్న రేటింగ్ : 2.25/5

Advertisement

Continue Reading
Advertisement

Featured

Magadheera: చరణ్ అభిమానులకు శుభవార్త.. థియేటర్లో రిలీజ్ కాబోతున్న.. ఎప్పుడో తెలుసా?

Published

on

Magadheera: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. గతంలో విడుదల అయిన సినిమాలను థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు మూవీ మేకర్స్. ఇప్పటికే తెలుగు థియేటర్స్ లో చాలా సినిమాలు విడుదలైన విషయం తెలిసిందే. మహేష్ బాబు ప్రభాస్ చిరంజీవి బాలకృష్ణ,రామ్ చరణ్,ఎన్టీఆర్ సినిమాలను థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. పోకిరి నుంచి ఇప్పటిదాకా రీసెంట్ గా సమరసింహా రెడ్డిదాకా ఈ ట్రెండ్ నడుస్తూనే ఉంది. కొన్ని రీరిలీజ్ సినిమాలు బాగానే డబ్బు చేసుకోగా మరికొన్ని మాత్రం జనం పెద్దగా పట్టించుకోని పరిస్దితి ఏర్పడుతోంది.

ఆ సంగతి పక్కన పెడితే త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీర సినిమా విడుదల కానుంది. మరి ఈ సినిమా ఎప్పుడు విడుదల కానుంది అన్న వివరాల్లోకి వెళితే.. మగధీర సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నెల 27న చరణ్‌ బర్త్‌డే సందర్భంగా మగధీర చిత్రాన్ని 26న రీ రిలీజ్‌ చేస్తున్నారు మేకర్స్‌. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించారు. గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ నిర్మించిన మగధీర 2009 జూలై 30న విడుదలై, బ్లాక్‌ బస్టర్‌ హిట్ గా నిలిచింది.

రీ రిలీజ్‌..

Advertisement

దాదాపుగా 14 ఏళ్ల తర్వాత ఈ చిత్రాన్ని శ్రీ విజయలక్ష్మి ట్రేడర్స్‌ అధినేత యర్రంశెట్టి రామారావు, అరిగెల కిశోర్‌బాబు రీ రిలీజ్‌ చేస్తున్నారు. మగధీర చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో రీ రిలీజ్‌ చేస్తున్నాము. తెలుగు ప్రేక్షకులు, మెగా అభిమానులు ఈ చిత్రాన్ని ఆదరించి మరోసారి ఘన విజయాన్ని అందించాలి అని తెలిపారు యర్రంశెట్టి రామారావు, అరిగెల కిశోర్‌ బాబు.

Advertisement
Continue Reading

Featured

Mokshagna: బోయపాటి డైరెక్షన్లో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ.. ఫిక్స్ చేసిన బాలయ్య?

Published

on

Mokshagna: సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అయ్యారు. ఈయనకు వయస్సు మీద పడుతున్నప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇక బాలయ్య వారసుడి రాక కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Mokshagna

మోక్షజ్ఞ ఎంట్రీ అదిగో ఇదిగో అంటూ దాదాపు మూడు సంవత్సరాల నుంచి అభిమానులను ఊరిస్తూ ఉన్నప్పటికీ ఇప్పటివరకు కూడా ఈయన సినీ ఎంట్రీ గురించి ఎలాంటి క్లారిటీ లేదు కానీ గత ఏడాది బాలయ్య మాట్లాడుతూ వచ్చే ఏడాది తన కుమారుడు సినీ ఎంట్రీ ఉంటుందని తెలిపారు.. ఇకపోతే మోక్షజ్ఞ ఎవరి డైరెక్షన్లో ఇండస్ట్రీకి పరిచయం అవుతారన్న సందేహాలు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. ఒకసారి అనిల్ రావిపూడి పేరు వినిపించగా మరోసారి బోయపాటి పేరు కూడా తెరపైకి వచ్చింది.

ఇప్పటికే వీరిద్దరూ స్క్రిప్ట్ గురించి కూడా డిస్కషన్స్ పూర్తి చేశారని ఇక త్వరలోనే ఈ సినిమా పనులను ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. ఇలా బాలయ్య తన కొడుకు ఎంట్రీ బోయపాటి పైనే భారం వేసారని తెలుస్తోంది ఇక ఈ విషయం తెలిసినటువంటి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా వెల్లడించబోతున్నారని తెలుస్తోంది.

Advertisement

బోయపాటి పైనే భారం..
ఈ క్రమంలోనే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి తాజాగా మరొక వార్త వైరల్ గా మారింది. మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి టైం ఫిక్స్ చేశారని ఇక ఈయన బోయపాటి డైరెక్షన్ లోనే ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారని తెలుస్తుంది. మాస్ సినిమాలకు బోయపాటి కేరాఫ్ అడ్రస్ తన కుమారుడి మొదటి సినిమా కూడా ఇలాంటి యాక్షన్ టచ్ ఇస్తేనే బాగుంటుందని భావించినటువంటి బాలయ్య బోయపాటిని ఫిక్స్ చేశారట.

Advertisement
Continue Reading

Featured

Venkata Chaitanya: ప్రతి ఒక్కటి తిరిగి ఇచ్చేయాల్సిందే.. వైరల్ అవుతున్న నిహారిక మాజీ భర్త పోస్ట్!

Published

on

Venkata Chaitanya: జొన్నలగడ్డ వెంకట చైతన్య పరిచయం అవసరం లేని పేరు మెగా డాటర్ నిహారిక మాజీ భర్తగా ఈయన ఎంత గుర్తింపు పొందారు. ఇరువురి కుటుంబ సభ్యుల సమ్మతితో వీరిద్దరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా విడాకులు తీసుకున్నటువంటి వీరిద్దరూ తమ వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఈ విధంగా నిహారిక ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల ఓ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈమె తన పెళ్లి విడాకులు అలాగే రెండో పెళ్లి గురించి కూడా కామెంట్లు చేసిన సంగతి మనకు తెలిసిందే .ఇలా ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇందుకు కౌంటర్ గా తన మాజీ భర్త సైలెన్స్ సైలెన్స్ అంటూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.

అయితే తాజాగా మరోసారి ఈయన సోషల్ మీడియాలో చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈయన పరోక్షంగా నిహారికను ఉద్దేశిస్తూ తనకు కౌంటర్ ఇస్తూనే ఇలాంటి పోస్టులు చేశారని స్పష్టంగా అర్థమవుతుంది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ అయినటువంటి చైతన్య తాజాగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

Advertisement

పాజిటివిటీని పెంచాలి..
చాలా రోజుల తర్వాత ఇలా మళ్లీ రాసుకు వస్తున్నాను. ఇంస్టా కమ్యూనిటీకి నా వల్ల అయినంతలో ఇలా చిన్నగా అయిన తిరిగి ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాను. కొంచమైనా పాజిటివిటీని పెంచాలని అనుకుంటున్నాను అంటూ ఈయన పోస్ట్ చేయడంతో ఇది చూసినటువంటి నేటిజన్స్ కచ్చితంగా ఇది నిహారికను ఉద్దేశించి చేశారంటూ కామెంట్లు చేస్తున్నారు. వీరిద్దరు విడిపోయిన సోషల్ మీడియాలో ఒకరిపై మరొకరు ఇలా పరోక్షంగా సెటైర్లు వేసుకుంటూ పోస్ట్ చేస్తున్నారని స్పష్టంగా అర్థం అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!