కరోనా మహమ్మారి విలయ తాండవం చేయకుండా వుండి వుంటే ఈపాటికి లాక్ డౌన్ వుండేది కాదు.. టాలీవుడ్ భల్లాల దేవ ఇంట్లో పెళ్లి సంబరాలు అంబరాన్ని అంటి వుండేవి. చాలా కాలం తర్వాత దగ్గుబాటి వారి ఫ్యామిలీలో జరుగుతున్న శుభకార్యం కావడంతో కుటుంబ సభ్యులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకూ మంచి ఫ్రెండ్స్ గా ఉంటూ మనసులు ఇచ్చి పుచ్చుకున్న రానా, మిహీకా జంట తమ ప్రేమ విషయాన్ని పెద్దలకి చెప్పి ఒప్పించారు.
ఇటీవలే 2 కుటుంబాల సమక్షంలో “రోకా” కూడా వేడుక జరిగింది. కానీ కరోనా ప్రభావం రోజురోజుకీ పెరుగుతుండటంతో రానా పెళ్ళి డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు. ఈమధ్య సోషల్ మీడియాలో రానా పెళ్ళిపై రకరకాల గాసిప్స్ హల్ చల్ చేస్తుండటంతో వాటికి ఫుల్ స్టాప్ పెడుతూ తమ మ్యారేజ్ వెడ్డింగ్ కార్డ్స్ వివరాలను తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు రానా లవర్ మిహికా. పెళ్లి రోజు వేసుకోవాల్సిన జూటిస్ షూస్ ని కూడా చూపించిన కొత్త పెళ్లి కూతురు అవి డిజైన్ చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు. పెళ్లి రోజు ఎలా రెడీ అవ్వాలో ముందుగానే అన్ని ప్లాన్ చేసుకున్నారు. అలాగే అతిధులకు ఇవ్వాల్సిన స్పెషల్ వెడ్డింగ్ కార్డ్స్ కూడా సిద్దం చేశారు. మొత్తానికి మిహికా తన పెళ్లికి అద్బుతమైన ప్లానింగ్ తో రెడీ అవుతోందనే చెప్పాలి. ఇక్కడ మీరు ఊహించని ట్విస్ట్ ఏమిటంటే.. రానాకి కాబోయే భార్య మిహీకా ఆల్ రెడీ వెడ్డింగ్ ప్లానర్ అన్న సంగతి చాలామందికి తెలియదు. కాబట్టి ఆమె ఆలోచనలకు తగినట్లుగానే, స్పెషల్ థీమ్తో పెళ్లి వేడుకలు జరగబోతున్నాయి. దీంతో దగ్గుబాటి వారి ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైంది. రానా ఆగస్టు 8న మిహీకా బజాజ్ మెడలో మూడు ముళ్లు వేయబోతున్నారు.
వీళ్ళిద్దరి పెళ్ళి హైదరాబాద్ లోనే జరిపేందుకు దగ్గుబాటి, బజాజ్ కుటుంబాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. పెళ్లి వేడుకల్ని 3 రోజులపాటు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. పెళ్లికి 2 రోజుల ముందు అంటే ఆగస్టు 6, 7 తేదీల్లో వేడుకలు ప్రారంభం కాబోతున్నాయి. కరోనా ఎఫెక్ట్ కారణంగా కొద్దిమంది స్నేహితులు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో రానా మిహికాల పెళ్లి జరగనుంది. పెళ్లికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడే జరగనున్నాయి. అలాగే వీళ్ళిద్దరి పెళ్లి వేడుకను తెలుగు, మార్వాడీ సంప్రదాయాల ప్రకారం నిర్వహిస్తారని తాజా సమాచారం. ముహూర్తం నాటికి కరోనా ప్రభావంతో ఎదురయ్యే పరిస్థితుల్ని బట్టి వేడుకకి హాజరయ్యే అతిథుల సంఖ్య పెరగవచ్చు.. తగ్గవచ్చునని తెలిసింది. ఆగస్టులో జరగనున్న వీరి పెళ్ళి వేడుకలలో పెళ్లికి సంబంధించి ప్రభుత్వ నియమాలు ఎలా ఉంటాయో తెలియదు. అందుకే రానా ఫ్యామిలీ పెళ్ళి ప్రయత్నంలో భాగంగా వాళ్ళందరూ ప్లాన్ A, ప్లాన్ B, ప్లాన్ C లను సిద్ధం చేశారని మిహికా బజాజ్ తల్లి బంటీ బజాజ్ ఈ సందర్భంగా తెలియజేశారు.
Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ అనంతరం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.
ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఎప్పుడు చూసినా చాలా కూల్ గానే కనిపిస్తారు. ఈయన ఎప్పుడు కోప్పడిన సందర్భాలు కూడా లేవని చెప్పాలి. అయితే ప్రభాస్ ఏదైనా ఫ్రస్టేషన్లో ఉన్నప్పుడు లేదంటే సినిమాల విషయంలో కాస్త కంగారు పడినప్పుడు ఎవరిని కూడా కలవరట.
ప్రభాస్ ఏ విషయం గురించైనా కాస్త ఆలోచనలో ఉండి ఫ్రస్టేషన్ వస్తే కనుక తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా బయటకు పంపించేసి తలుపు గది వేసుకొని ఒక దమ్ము కొట్టేస్తారట అనంతరం తనకు నచ్చిన ఫుడ్ తిని ప్రశాంతంగా నిద్రపోతారని తెలుస్తుంది. ఇలా నిద్రపోయి లేచిన తర్వాత ఆయన ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయి ఫ్రెష్ మైండ్ తో బయటకు వస్తారట.
Advertisement
ఇష్టమైన ఫుడ్ తింటారు.. ఇలా ప్రభాస్ ఫ్రస్టేషన్ లో ఇలా వ్యవహరిస్తారని విషయం తెలిసి ప్రభాస్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ కోప్పడే సందర్భాలు చాలా తక్కువ అని ఆయనతో ఉన్నవాళ్లు చెబుతుంటారు ఆయన ప్రతి ఒక్కరితో చాలా సరదాగా గడుపుతూ ఉంటారని 99% తనకు కోపం అనేది రాదని తనతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు పలు సందర్భాలలో వెల్లడించారు.
Nikhil siddarth: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నటువంటి నటుడు నిఖిల్ సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన అనంతరం పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు.
ఇలా నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే ఈయన స్వయంబు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా షూటింగ్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈయన స్వయంబు సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.
త్వరలోనే స్వయంభూ సినిమా విడుదల తేదీ ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా తన కుమారుడికి సంబంధించిన పలు విషయాలను కూడా నిఖిల్ అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల తనకు కుమారుడు జన్మించిన సంగతి మనకు తెలిసిందే. తన కుమారుడు జన్మించారనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా తన కొడుకు బారసాల వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.
Advertisement
పార్టీలకు వెళ్లడం మానుకున్న.. ఇలా బారసాల వేడుకలను నిర్వహించిన నిఖిల్ దంపతులు తమ కుమారుడికి ఏ పేరు పెట్టారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు అయితే తన కుమారుడికి ధీర సిద్ధార్థ్ అనే పేరు పెట్టినట్లు నిఖిల్ వెల్లడించారు. అయితే తన కొడుకు పుట్టిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. పిల్లలు సరైన వాతావరణంలో పెరగాలి అందుకు మనం కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తనకు కొడుకు పుట్టిన తర్వాత నేను పార్టీలకు వెళ్లడం మానుకున్నానని తెలిపారు. వారంలో ఏదో ఒక రోజు తాను పార్టీకి వెళ్లే వాడినని ఇప్పుడు ఆ అలవాటు మార్చుకున్నాను అంటూ నిఖిల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది.
ఇక ఈ సినిమా థియేటర్లలోను అదేవిధంగా డిజిటల్ మీడియాలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే డిజిటల్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా సాటిలైట్ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ సాయంత్రం 5:30కు స్టార్ మాలో ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే.
ఇలా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో సలార్ మేకర్స్ అద్భుతమైనటువంటి ఆఫర్ అభిమానులకు కల్పించారు. ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు మనం సమాధానాలు చెబితే చాలు ఈ సినిమాలో ప్రభాస్ నడిపినటువంటి ఐకానిక్ మోటార్ సైకిల్ బైక్ మీ సొంతం చేసుకోవచ్చని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
Advertisement
క్విజ్ కాంటెస్ట్.. ఇలా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉండాలి అలాగే వారు పెట్టే కొన్ని కండిషన్స్ కూడా వర్తిస్తాయని వెల్లడించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి బైక్ మీ సొంతం చేసుకోవచ్చు అయితే ఇలా మేకర్ ప్లాన్ చేశారు అంటే ఈ ఎఫెక్ట్ టి ఆర్ పి రేటింగ్ పై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్లాన్స్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.