Connect with us

Featured

మన టాలీవుడ్ హీరోయిన్ల రెమ్యునరేషన్ ఏంతో తెలుసా.?

Published

on

కమర్షియల్ సినిమా అయినా.. సామాజిక సందేశం ఉన్నదైనా.. హీరోయిన్లకు తక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. వారికి ఆయా సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ పోషించినా.. హీరో డామినేషన్ వల్ల పెద్దగా పేరు రాదు.

అలాంటి తరుణంలో కొంతమంది హీరోయిన్లు అందం, అభినయంతో చాలా ఏళ్ళ నుంచి ఇండస్ట్రీని ఏలుతూ టాప్ హీరోయిన్లుగా స్థిరపడ్డారు. ఇక వారిలో కొంతమంది హీరోయిన్ల పారితోషికాల వివరాలు మీకోసం..

నయనతార.. ఈ భామ దశాబ్దన్నర కాలంగా సౌత్‌‌లో ఎదురులేని లేడి సూపర్‌స్టార్‌గా వెలిగిపోతోంది. అగ్ర హీరోలందరికీ నయన్‌నే ఏకైక ఆప్షన్.. అందుకే ఆమె అడిగినంతా ఇచ్చి.. ఒక్కోసారి బ్రతిమాలుకుని మరీ పారితోషికాలు అందిస్తుంటారు మన నిర్మాతలు. మెగాస్టార్ చిరంజీవితో పాటుగా బాలకృష్ణ, వెంకటేష్, అజిత్, విజయ్, రజినీకాంత్ వంటి టాప్స్ స్టార్ల సరసన నటిస్తోంది నయన్. అటు ఆమె సోలోగా సినిమా చేసినా.. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ అదిరిపోతుంటాయి. ఇకపోతే ‘సైరా’ సినిమాకు ఆమె 6 కోట్ల పారితోషికం అందుకుంటోందన్న ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన సమయంలో పారితోషికంగా కోటి రూపాయలు తీసుకున్న శ్రుతిహాసన్ ఇప్పుడు బాలీవుడ్ లో తన రెమ్యునరేషన్ పెంచిందని తెలుస్తోంది.

దక్షిణాది అగ్ర హీరోయిన్ గా వెలుగొందుతోన్న అనుష్క శెట్టి.. ఒక్కో సినిమా రూ 3.5కోట్ల నుంచి 4 కోట్లు తీసుకుంటుందని వినికిడి. తన సక్సెస్ రేట్ కారణంగా ఇప్పుడు పారితోషికం మరింత పెంచే ఛాన్స్ ఉంది.

ముంబై భామ పూజా హెగ్డే హవా టాలీవుడ్‌లో విపరీతంగా ఉందని చెప్పొచ్చు. ఆమె ఒక్కో చిత్రానికి రూ.2 కోట్లు వెనకేసుకుంటోందని సమాచారం.

అందాల తార కియారా అద్వానీ కూడా వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు కమిట్ అవుతూ రూ.3 కోట్ల రెమ్యునరేషన్‌ను ఖాతాలో వేసుకుంటోందట.

మొదట్లో అందరూ ఐరన్ లెగ్ అని పిలిచినా.. మెల్లగా హిట్లు అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న తమన్నా ఒక్కో సినిమాకు రూ.90 లక్షల నుండి కోటి రూపాయల వరకు తీసుకుంటుంది.

కుర్ర హీరోయిన్ల హవా పెరిగినా కాజల్ కి అవకాశాలు మాత్రం తగ్గలేదు. తన క్రేజ్ తగ్గుతున్నా.. అమ్మడు రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంలో మాత్రం తగ్గడం లేదు. ఒక్కో సినిమాకు కోటి నుండి కోటిన్నర వరకు తీసుకుంటుంది.

‘మహానటి’ తెచ్చిన క్రేజ్ తో కీర్తి సురేష్ డిమాండ్ బాగా పెరిగిపోయింది. నిర్మాతలు ఆమెకు ఒక్కో సినిమాకు భారీ రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కూడా సిద్ధపడుతున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ ఒక్కో సినిమాకు రూ.2 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు వినికిడి.

టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ వరుసగా ప్లాప్స్ చవి చూడటంతో.. ఆమె పారితోషికం రేంజ్ కోటి నుంచి 50 లక్షలకు పడిపోయిందని చెప్పుకుంటున్నారు.

పెళ్లైనా కూడా వరుస అవకాశాలు దక్కించుకుంటోన్న సమంత ఒక్క సినిమాకు రూ.2 కోట్లు చార్జ్ చేస్తోంది. ’96’ రీమేక్ కోసం ఈమె రెండు కోట్లకు పైగానే తీసుకుంటుందని సమాచారం. మజిలీ, ఓ బేబి సినిమాలతో వరుస హిట్స్ సాధించిన సమంత తన పారితోషికాన్ని పెంచినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

హైబ్రిడ్ పిల్ల సాయి పల్లవి కోటిన్నర వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

తన తోటి హీరోయిన్లు రెమ్యునరేషన్ విషయంలో కోటి దాటేసినా.. రాశిఖన్నా మాత్రం ఇంకా రూ.60 లక్షలే చార్జ్ చేస్తోంది. ఓ పెద్ద హిట్టు కొడితేనే తప్ప అమ్మడు రెమ్యునరేషన్ పెరిగేలా లేదు.

తెలుగులో త్రిష హవా తగ్గినప్పటికీ తమిళంలో మాత్రం ఇప్పటికీ అవకాశాలు దక్కించుకుంటూనే ఉంది. కోలివుడ్ లో ఒక్కో సినిమాకు కోటి వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది.

టాలెంటెడ్ హీరోయిన్ నిత్యా మీనన్ ఒక సినిమాకు రూ.90 లక్షల వరకు రెమ్యునరేషన్ అందుకుంటుంది.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Vishal: మళ్లీ ఆయనే ఏపీ సీఎం.. హీరో విశాల్ కామెంట్స్ వైరల్!

Published

on

Vishal: సినీ నటుడు హీరో విశాల్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన సినిమాలో పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గానే ఉంటారు. అంతేకాకుండా తమిళ రాజకీయాలలో కూడా ఈయన యాక్టివ్ గా ఉంటూ తరచూ రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు.

ప్రస్తుతం హీరో విశాల్ నటించిన రత్నం సినిమా ఈనెల 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఈయన ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం హైదరాబాద్ వచ్చారు ఇలా హైదరాబాద్ వచ్చినటువంటి ఈయనకు ఏపీ రాజకీయాల గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఇలా రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురు కావడంతో ఈయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కూడా గెలిచేది వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఆయనే మరోసారి ఏపీ సీఎం అవుతున్నారని విశాల్ వెల్లడించారు. ఇక జగన్మోహన్ రెడ్డి పట్ల ఇలాంటి దాడులు ఇదివరకు ఎన్నో జరిగాయి. వాటిని ఆయన ఎదుర్కొన్నారని తెలిపారు.

Advertisement

జగన్ అంటే అభిమానం..
ఇక్కడ తప్పకుండా వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని అయితే నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదని తెలిపారు. తనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైనటువంటి అభిమానం ఉందని ఈ సందర్భంగా విశాల్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ 8 లో మాజీ కంటెస్టెంట్లు.. మళ్లీ రచ్చ షూరు!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారు ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలు అందుకున్నటువంటి పలువురు బిగ్ బాస్ సీజన్ సెవెన్ మాజీ కంటెస్టెంట్ లో తిరిగి సీజన్ 8 లో కంటెస్టెంట్లుగా పాల్గొన్న పోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇటీవల బిగ్ బాస్ 7 కార్యక్రమం ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమం ద్వారా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సినీ నటుడు శివాజీ, అమర్ దీప్, విన్నర్ పల్లవి ప్రశాంత్ ఈ ముగ్గురు కూడా సీజన్ 8 కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.

సీజన్ 7లో అత్యధిక కంటెంట్ ఇచ్చింది ఈ ముగ్గురే. శోభ శెట్టి ఉన్నప్పటికీ ఆమె పట్ల అత్యంత నెగిటివిటీ నడిచింది. అమర్ దీప్ తో శివాజీ, పల్లవి ప్రశాంత్ ఫైట్స్ హైలెట్ అయ్యాయి. అందుకే ఈ ముగ్గురిని తిరిగి సీజన్ 8 లో కూడా తీసుకురావాలని ఆలోచనలో మేకర్స్ ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటన మాత్రం వెలబడలేదు.

Advertisement

కార్తీకదీపం డాక్టర్ బాబు..
బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో ఈ ముగ్గురి మధ్య పెద్ద ఎత్తున యుద్ధం నడిచింది అయితే తిరిగి ఈ ముగ్గురు మరోసారి సీజన్ 8 లో పాల్గొన్నారు. అంటే మరోసారి రచ్చ జరుగుతుందని పలువురు భావిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రశాంత్ విన్నర్ కాగా, అమర్ రన్నర్ గా నిలిచారు. ఇక ఈ కార్యక్రమంలో కార్తీకదీపం ఫేమ్ నిరుపమ్ రాబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: వేణు స్వామి ఇంటి నుంచి ప్రభాస్ అడిగి మరీ అవి తీసుకున్నారు: వేణు స్వామి వైఫ్

Published

on

Prabhas: ప్రముఖ జ్యోతిష్యుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలను చెబుతూ ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తున్నారు.

ముఖ్యంగా ఈయన ప్రభాస్ జాతకం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రభాస్ అభిమానులు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉంటారు అంతేకాకుండా వేణు స్వామి పై భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఇలా సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు వేణు స్వామి మధ్య పెద్ద ఎత్తున మాటలు యుద్ధం జరుగుతుందని చెప్పాలి.

ఇలా వేణు స్వామి విషయంలో ఆయన అభిమానులు భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నప్పటికీ వేణు స్వామి అలాగే ప్రభాస్ మధ్య మంచి అనుబంధమే ఉందని చెప్పాలి. ఈ విషయం గురించి తాజాగా వేణు స్వామి భార్య ఓ సందర్భంలో వెల్లడించారు. ఒకసారి తన తోటలో పండిన సీతాఫలం పండ్లను వేరే వారికి పంపించగా అవి ప్రభాస్ వద్దకు చేరాయి.

Advertisement

సీతాఫలం..
అవి తిన్న ప్రభాస్ చాలా బాగున్నాయని అడిగి మరి మా ఇంటి నుంచి తెప్పించుకున్నారు అంటూ వేణు స్వామి భార్య వీణ వాణి తెలిపారు. అంతేకాకుండా ఈమె ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ బ్యాగ్ ను కూడా తయారు చేసి కానుకగా పంపించినట్లు ఈ వీడియో ద్వారా వెల్లడించారు. ఇది చూసిన అభిమానులు మీరేమో ప్రభాస్ పై అభిమానం చూపిస్తారు మీ ఆయనేమో అలా మాట్లాడతారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!