Actress Soundarya: నటి సౌందర్యకు కొడుకు ఉన్నారా… వెలుగులోకి వచ్చిన షాకింగ్ విషయాలు?

Actress Soundarya: వెండితెరపై మహానటి సావిత్రి తర్వాత అదే స్థాయిలో ఆదరణ సంపాదించుకున్నటువంటి వారిలో దివంగత నటి సౌందర్య ఒకరు. ఈమె కన్నడ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి అయినప్పటికీ అచ్చ తెలుగు అమ్మాయిల ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను సంపాదించుకున్నారు. ఇలా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అన్ని భాషలలోనూ అగ్ర హీరోలందరి సరసన నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సౌందర్య మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి.

ఇలా ఈమె ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న సమయంలోనే తన స్నేహితుడు రఘు అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లయిన ఏడాదికే ఈమె హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే.ఇలా ఈమె రఘు అనే వ్యక్తిని వివాహం చేసుకున్న తర్వాత ఇండస్ట్రీలో సంపాదించినది మొత్తం ఆయన పేరు మీద రాసేశారు.అయితే సౌందర్య మరణించిన తర్వాత ఆస్తి విషయం గురించి రఘు సౌందర్య తల్లిదండ్రుల మధ్య గొడవలు కూడా చోటుచేసుకున్నాయని తెలుస్తోంది.

ఇక సౌందర్యం మరణించిన తర్వాత కొంతకాలం పాటు ఒంటరిగా ఉన్నటువంటి రఘు అనంతరం రెండవ వివాహం చేసుకొని ప్రస్తుతం ఈయన గోవాలో స్థిరపడ్డారు.అయితే సౌందర్య చనిపోక ముందే ఈ దంపతులకు ఓ కుమారుడు జన్మించారని అయితే ఈ విషయాన్ని సౌందర్య రహస్యంగా దాచిపెట్టారనే వార్త వైరల్ గా మారింది. ఇక ప్రస్తుతం ఈ బాబు బాగోగులు అన్నింటిని కూడా తన తండ్రి రఘు చూసుకుంటున్నారట.


Actress Soundarya: సౌందర్యకు పిల్లలు లేరు


సౌందర్యకు కొడుకు ఉన్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే ఈ విషయం గురించి సౌందర్య సన్నిహితులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఈ వార్తలను పూర్తిగా ఖండించారు. సౌందర్య పెళ్లి తర్వాత రెండు సంవత్సరాల వరకు పిల్లలు వద్దని భావించారట. అయితే సౌందర్య కొడుకు ఉన్నారని వచ్చే ఈ వార్తలలో ఏ మాత్రం నిజం లేదంటూ సౌందర్య సన్నిహితులు ఈ వార్తలను ఖండిస్తూ అసలు విషయం తెలియజేశారు.