Adi Reddy: ఆ షోలతో పోలిస్తే బిగ్ బాస్ లో ఎలాంటి వల్గారిటీ లేదు… బిగ్ బాస్ ఆదిరెడ్డి షాకింగ్ కామెంట్స్!

Adi Reddy: బిగ్ బాస్ రివ్యూయర్ గాఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఆదిరెడ్డి సీజన్ సిక్స్ కార్యక్రమంలో ఏకంగా కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన టాప్ త్రీ కంటెంట్ గా హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇలా ఒక సామాన్య వ్యక్తి బిగ్ బాస్ కార్యక్రమంలో ఫైనల్ వరకు కొనసాగడం బిగ్ బాస్ చరిత్రలోనే ఇదే మొదటిసారి.

ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన తాజాగా బిగ్ బాస్ కార్యక్రమం గురించి సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది. ఈ సీజన్ సెవెన్ త్వరలోనే ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఆపివేయాలి అంటూ హైకోర్టు నుంచి ఉత్తర్వులు జారీ అయిన విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ విషయం గురించి ఆదిరెడ్డి తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ప్రతి సీజన్ ముందు ఈ కార్యక్రమం ప్రసారానికి ఇలా హైకోర్టు నుంచి ఉత్తర్వులు వస్తూనే ఉంటాయి. అయితే కొందరు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారని తాను అభిప్రాయపడ్డారు అంతేకాకుండా సినిమాలలోను ఎన్నో వెబ్ సిరీస్ లలో , కొన్ని కామెడీ షో లలో ఉన్నంత వల్గారిటీ ఈ బిగ్ బాస్ కార్యక్రమంలో లేదని ఈయన తెలిపారు.

Adi Reddy: ఇష్టముంటే చూస్తారు లేదంటే లేదు…


ఈ విధంగా బిగ్ బాస్ కార్యక్రమం గురించి ఆదిరెడ్డి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఈ కామెంట్ చేశారు. ఇక ఈ కార్యక్రమాన్ని ఇష్టం ఉన్నవాళ్లు చూస్తారు లేని వాళ్ళు చూడకుండా ఉంటారు అంటూ తన అభిప్రాయాన్ని తెలపడేమేకాకుండా మీ అభిప్రాయాలను కూడా తెలియజేయండి అంటూ అభిమానులను ఉద్దేశించి పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆది రెడ్డి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.