Amnesia Pub Case: రోజుకో మలుపు తిరుగుతున్నఅమ్నీషియా పబ్ కేస్… జాకెట్ మర్చిపోయానంటూ తిరిగి వచ్చింది: పబ్ మేనేజర్

Amnesia Pub Case: హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని మైనర్ బాలికపై అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ అత్యాచార కేసు రోజుకొక మలుపు తిరుగుతూ పోలీసులకు సవాలుగా మారింది. ఈక్రమంలోనే క్లూస్ టీం సదరు మైనర్ బాలికపై ఇన్నోవా కారులో అత్యాచారం జరిగినట్లు గుర్తించారు. కారులో నిందితుల స్పెర్స్‌, వెంట్రుకలు, వేలిముద్రలు, చెప్పులు వంటి వస్తువులను క్లూస్ టీం గుర్తించారు.

అయితే నిందితులు మొదట బాలికను బెంజ్ కారులో తీసుకు వెళ్లినట్లు గుర్తించారు.సాధారణంగా పబ్ కి మైనర్లు అనుమతి ఉండదు కానీ ఆ బాలికను ఎలా అనుమతించారు అనే విషయం గురించి ఆరా తీయగా పబ్ మేనేజర్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలేజీ స్టూడెంట్స్ గెట్ టుగెదర్ పార్టీ అంటూ 150 మంది వరకు పబ్ బుక్ చేసుకున్నట్లు తెలిపారు.

ఇందులో 40 శాతం మంది అమ్మాయిలు ఉండగా 60 శాతం మంది అబ్బాయిలు ఉన్నారు.అయితే కాలేజ్ నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే వారికి పబ్బులో అనుమతి ఉంటుందని మేనేజర్ తెలిపారు. అయితే వాళ్ళందరూ కూడా ఏ విధమైనటువంటి ఆల్కహాల్ తీసుకోకుండా పార్టీ చేసుకున్నారు.అందరూ ఇక్కడ ఉన్న సమయంలో ఎలాంటి గొడవలు పడే అవకాశాలు కూడా కనిపించలేదని మేనేజర్ తెలియజేశారు.

అమ్మాయి చాలా క్యాజువల్ గా కనిపించింది…


ఆరోజు పబ్బుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ అన్నింటిని పోలీసులకు ఇచ్చినట్లు మేనేజర్ వెల్లడించారు. అయితే ఆ రోజు రాత్రి 8: 30 గంటల సమయంలో ఆ బాలిక తన జాకెట్ మర్చిపోయానని తిరిగి పబ్ కి వచ్చి తన జాకెట్ తీసుకు వెళ్లిందని అయితే ఆ సమయంలో కూడా ఆ అమ్మాయి చాలా క్యాజువల్ గా ఉందని,తనలో ఎలాంటి భయం ఆందోళన కూడా కనిపించలేదని ఈ సందర్భంగా ఈ అత్యాచార ఘటనపై మేనేజర్ ఆసక్తికరమైన విషయాలను తెలియ చేశారు.