మీకు నిద్ర అంటే ఇష్టమా.. నిద్రపోతే చాలు ఆ కంపెనీ మీకు నెలకు రూ.25 లక్షల జీతం కల్పిస్తోంది..!

మీకు నిద్ర అంటె ఎక్కువగా ఇష్టమా.. నిద్ర పోతే చాలా గంటల తర్వాత లేస్తారా.. అయితే వారి కోసమే నెలకు రూ.25 లక్షల జీతం ఇస్తోంది ఓ కంపెనీ. ఆ కంపెనీలో ఉద్యోగం ఇచ్చి..హాయిగా నిద్ర పోయేందుకు ఆఫర్ చేస్తోంది. అసలేంటి ఇది తెలుసుకుందాం..

యూకే బేస్డ్‌ క్రాఫ్‌టెడ్ బెడ్స్ అనే లగ్జరీ బెడ్‌ కంపెనీ ఈ ఆఫర్‌ చేస్తోంది. ఎవరైనా ఆఫీస్ లో నిద్రపోతే బాస్ రూంకి పిలిచి మరీ తిట్ల పురాణం అందుకుంటాడు.. కొన్ని కంపెనీలు అయితే రిజైన్ చేసేయమని చెప్పేస్తాయి కూడా. కానీ ఇక్కడ అలా కాదు.. మీకు ఆ కంపెనీలో ఓ బెడ్ ను కేటాయిస్తారు.

మీరు ఆ బెడ్ మీదనే దాదాపు 6 నుంచి 7 గంటల వరకు సమయాన్ని కేటాయించాల్సి ఉంటుందట. వారంలో దాదాపు 37 గంటల పాటు బెడ్ పై సమయం గడపాల్సి ఉంటుంది. పడుకోవడం, కూర్చొవడం మరేదైనా చేసుకోవచ్చు. దీనిపై సమయం గడిపిన తర్వాత ఆ పరుపు ఎలా ఉంది.. దాని వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందా.. వంటి కోణాల్లో సమీక్షించాల్సి ఉంటుంది.

ఇలా చేస్తే నెలకి అక్షరాల రూ.24.80లక్షల ఆఫర్ చేస్తోంది. అయితే ఈ ఉద్యోగానికి అర్హత ఉండాలంటే.. బ్రిటీష్ పౌరసత్వం తప్పనిసరిగా ఉండాలని అంటోంది ఆ యాజమాన్యం. ఇది సోషల్ మీడియాలో గత కొన్ని రోజుల నుంచి వైరల్ గా మారింది. ఈ విషయం తెలిసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందించారు. ఆఫర్ ఇండియాలో కూడా ఉంటే బాగుండేది అంటూ చెప్పారు.