మీకు నిద్ర అంటె ఎక్కువగా ఇష్టమా.. నిద్ర పోతే చాలా గంటల తర్వాత లేస్తారా.. అయితే వారి కోసమే నెలకు రూ.25 లక్షల జీతం ఇస్తోంది ఓ కంపెనీ. ఆ కంపెనీలో ఉద్యోగం ఇచ్చి..హాయిగా నిద్ర పోయేందుకు ఆఫర్ చేస్తోంది. అసలేంటి ఇది తెలుసుకుందాం..
యూకే బేస్డ్ క్రాఫ్టెడ్ బెడ్స్ అనే లగ్జరీ బెడ్ కంపెనీ ఈ ఆఫర్ చేస్తోంది. ఎవరైనా ఆఫీస్ లో నిద్రపోతే బాస్ రూంకి పిలిచి మరీ తిట్ల పురాణం అందుకుంటాడు.. కొన్ని కంపెనీలు అయితే రిజైన్ చేసేయమని చెప్పేస్తాయి కూడా. కానీ ఇక్కడ అలా కాదు.. మీకు ఆ కంపెనీలో ఓ బెడ్ ను కేటాయిస్తారు.
మీరు ఆ బెడ్ మీదనే దాదాపు 6 నుంచి 7 గంటల వరకు సమయాన్ని కేటాయించాల్సి ఉంటుందట. వారంలో దాదాపు 37 గంటల పాటు బెడ్ పై సమయం గడపాల్సి ఉంటుంది. పడుకోవడం, కూర్చొవడం మరేదైనా చేసుకోవచ్చు. దీనిపై సమయం గడిపిన తర్వాత ఆ పరుపు ఎలా ఉంది.. దాని వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందా.. వంటి కోణాల్లో సమీక్షించాల్సి ఉంటుంది.
ఇలా చేస్తే నెలకి అక్షరాల రూ.24.80లక్షల ఆఫర్ చేస్తోంది. అయితే ఈ ఉద్యోగానికి అర్హత ఉండాలంటే.. బ్రిటీష్ పౌరసత్వం తప్పనిసరిగా ఉండాలని అంటోంది ఆ యాజమాన్యం. ఇది సోషల్ మీడియాలో గత కొన్ని రోజుల నుంచి వైరల్ గా మారింది. ఈ విషయం తెలిసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందించారు. ఆఫర్ ఇండియాలో కూడా ఉంటే బాగుండేది అంటూ చెప్పారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…