‘బ్లాక్ ఫంగస్’కు ఆయుర్వేద మందు.. అది వస్తే అసలు మనిషి బతుకుతాడా?

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా ఎంతటి తీవ్ర రూపం దాలుస్తుందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కరోనా నుంచి కోలుకున్న వారిపై బ్లాక్ ఫంగస్ పంజా విసురుతోంది. ఈ క్రమంలోనే ఎంతోమంది కరోనాతో జయించి బయట పడినప్పటికీ, బ్లాక్ ఫంగస్ బారినపడి, కంటి చూపు కోల్పోవడం, మరికొందరు ఈ ఫంగస్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే దేశమంతటా రోజురోజుకు బ్లాక్ ఫంగస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

కరోనా నుంచి కోలుకున్న వారిలో తీవ్ర ముప్పుగా పరిగణించిన ఈ బ్లాక్ ఫంగస్ ను ఆయుర్వేద చికిత్సా విధానంతో పూర్తిగా నయం చేయవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు. బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించిన వెంటనే బాధితులు సరైన చికిత్స తీసుకోవటం వల్ల ఈ ఫంగస్ నుంచి బయట పడవచ్చు అని గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని ఆయుర్వేద వైద్యశాల వైద్యుడు ఎం.శ్రీనివాస్‌నాయక్‌ తెలియజేశారు.

బ్లాక్ ఫంగస్ సోకిన వారిలో లక్షణాలు కనిపించిన వెంటనే ఆయుర్వేద నిపుణులను సంప్రదించి వైద్యుల పర్యవేక్షణలో రెండు పద్ధతులలో మందులు వాడితే ఈ వ్యాధి నుంచి బయట పడవచ్చు. మొదటి ఈ చికిత్సా విధానంలో భాగంగా గంధక రసాయనం మాత్రలు భోజనం తర్వాత రెండు రోజులు వాడాలి.ఖదిరాదివతి మాత్రలు భోజనానికి ముందు రెండు రోజులు వాడాలి.పంచతిక్త గుగ్గులువృతము 10 గ్రాములు గోరువెచ్చని పాలలో భోజనానికి ముందు తాగాలి. అదేవిధంగా మృత్యుంజయ రసం రెండు మాత్రలు రోజుకు మూడు సార్లు వేసుకోవాలి.

రెండో చికిత్స విధానంలో భాగంగా ఆరోగ్యవర్ధనీవతి  మాత్రలు 2 భోజనం తర్వాత వేసుకోవాలి. విషతుందుకవతి రెండు మాత్రలు మూడు సార్లు భోజనం తర్వాత వాడాలి.టంకణభస్మం ఒక గ్రాము గ్లాసు నీటితో కలిపి పుక్కిలించాలి.   ఈ విధమైన చికిత్సా విధానాల ద్వారా బ్లాక్ ఫంగస్ నుంచి బయటపడవచ్చని డాక్టర్ శ్రీనివాస్ నాయక్ తెలిపారు. అయితే ఈ మందులు కేవలం డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే ఉపయోగించాలని ఆయన తెలిపారు.