గోధుమ పిండి – 3 చపాతీలా కు సరిపడా( చపాతీలు చేసి సిద్దం చేసుకోవాలి)
కాప్సికం – 2 కాలీఫ్లవర్ తరుగు – పావు కప్పు
టమోటో ముక్కలు – 2 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయలు – 2 ( చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి)
పచ్చి మిర్చి – 3 ( సన్నగా తరిగిన వి)
మిరియాల పొడి – అర టీ స్పూను
జీలకర్ర పొడి – 1 టీ స్పూను
పసుపు – అర టీ స్పూను
టమోటో సాస్ – 5 టేబుల్ స్పూన్లు
ఉప్పు – తగినంత
నూనె – సరిపడా
తయారీ విధానం:
మొదట స్టవ్ ఆన్ చేసుకొని నూనె వేడి కాగానే ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి వేసి దోరగా వేయించుకోవాలి, తర్వాత కాప్సికం, టమోటో ముక్కలను వేసుకొని గరిటె తో తిప్పుతూ బాగా దగ్గర పడేలా వేయించుకోవాలి, అవసరమైతే కాస్త నీళ్ళు వేసుకొని ఉడికించుకోవాలి. చివరగా పసుపు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, టమోటో సాస్ వేసి గరిటె తో తిప్పుతూ బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు చపాతీలను పెనంపై కాల్చుకొని, కాలీఫ్లవర్ మిశ్రమం వేడిగా ఉన్నపుడే చపాతీ పై నిలువుగా ఒక వైపు వేసుకొని రోల్స్ లా చుట్టుకోవాలి. తర్వాత కావాల్సిన సైజులో వాటిని కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు..
మసాలా దినుసులు – 4 లవంగాలు,యాలకులు, కొద్దిగా సజీర, ఒక బిర్యాని ఆకు సువాసన కోసం.
కారం – కొద్దిగా.
పసుపు – చిటికెడు.
నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్.
ఆయిల్ – 1 టేబుల్ స్పూన్.
ఉప్పు – రుచికి సరిపడినంత.
కొత్తిమీర – కొద్దిగా
తయారీ విధానం:
ముందుగా స్వీట్ కార్న్ ని బాగా ఉడికించుకోవాలి, అన్నం కూడా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. స్టౌ వెలిగించి కడాయి పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి మరియు ఒక స్పూన్ ఆయిల్ వేసి వేడెక్కాక అందులో మసాలా దినుసులు వేసి వేయించాక, ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి అందులో కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టాలి. ఇలా ఉప్పు వేసి మూత పెడితే ఉల్లిపాయలు త్వరగా ఉడుకుతాయి. ఉల్లిపాయ ముక్కలు వేగాక అందులో చిటికెడు పసుపు వేసి కలపాలి. ఆ తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. ఈ పేస్ట్ కూడా వేగిన తర్వాత కొద్దిగా కారం వేసి కలిపి, ఆ తర్వాత ఉడక పెట్టిన స్వీట్ కార్న్ వేసి కలిపి కాసేపు మూత పెట్టాలి. కాసేపటి తరువాత మూత తీసి ఉడికించిన అన్నం వేసి కలపాలి. అన్ని పదార్థాలు కలిసేలా బాగా కలిపాక ఉప్పు చూసుకొని రుచికి సరిపడా వేసుకోవాలి, దాని పైన కొత్తమీర చల్లు కొని స్టౌ ఆఫ్ చేస్తే వేడి వేడి స్వీట్ కార్న్ రైస్ రెడీ అయిపోతుంది.
స్వీట్ కార్న్ లో పీచు పదార్థం ఎక్కువ గ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా మంది పిల్లలు స్వీట్ కార్న్ తినడానికి ఇష్ట పడరు, పిల్లలకు ఇలా రైస్ రూపంలో చేసి పెడితే ఎంతో రుచి గా మరియు ఆరోగ్యంగా కూడా ఉంటుంది.
చికెన్ బ్రెస్ట్ (బోన్ లెస్):250grm(చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి)
కాశ్మీర్ కారం : 1tsp
టొమాటో కెచప్: 1tsp
ఉప్పు : రుచికి తగినంత
గరం మసాలా : : 1tsp
కసూరీ మేథీ పొడి : చిటికెడు
నిమ్మ రసం: 1tsp
అల్లం – వెల్లుల్లి పేస్ట్ : 1tsp
మైదా పిండి : 1cup
కోడి గుడ్లు – 2 (సొన గిన్నెలో వేసి బాగా గిలక్కొట్టాలి)
నూనె : 1tsp
చాట్ మసాలా : 1/2tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక పాత్రలో కాశ్మీర్ కారం, టొమాటో కెచప్, ఉప్పు, గరం మసాలా, కసూరీ మేథీ పొడి, నిమ్మరసం, అల్లం – వెల్లులి పేస్ట్లను బాగా కలపాలి.
2. తర్వాత ఈ మిశ్రమంలో చికెన్ ముక్కలు వేసి బాగా కలిపి, సుమారు గంటసేపు ఊరబెట్టాలి.
3. ఆ తర్వాత గిలక్కొట్టిన కోడిగుడ్డు సొనను కూడా వేసి, సొన ముక్కలకు పట్టేలా బాగా కలపాలి.
4. ఓ గిన్నెలో మైదాపిండి, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇందులో చికెన్ ముక్కల్ని వేసి, ముక్కలకు మైదా బాగా పట్టేవరకూ కలపాలి.
5. ఓవెన్ను 20 డిగ్రీల దగ్గర ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి. బాస్కెట్లో చికెన్ ముక్కలను వేసి, ఎయిర్ ఫ్రయర్లో పెట్టి, ఐదు నిమిషాలు ఉంచాలి. ఆరేడు నిమిషాల్లో ముక్కలు వేగిపోతాయి.
6. ఆ పైన వాటిని ప్లేట్లోకి తీసుకుని, వాటి మీద చాట్ మసాలా, కారం చల్లి వేడివేడిగా వడ్డించాలి. అంతే పాప్ కార్న్ చికెన్ రెడీ.
Top Telugu website in the world | Telugu Gossips | Breaking News Headlines, Latest Andhra News, Telangana News, India News, World News – Telugudesk.net