మోడీ గడ్డం పెంచడం వెనుక కారణం ఏమిటో తెలుసా?

ఒకప్పుడు నీటిగా గడ్డం తీయించుకొని ఎంతో చక్కగా అందంగా కనిపించే వారు. కానీ ప్రస్తుతం గడ్డం పెంచడం ఒక ఫ్యాషన్ గా మారిపోయింది.అయితే ఈ కరోనా మహమ్మారి దేశంలోకి వ్యాపించడంతో ఒక్కసారిగా అందరి జీవనశైలిలో పెద్ద మార్పులు చోటు చేసుకున్నాయి. కరోనా రాకముందు వరకు ఎంతో స్టైల్ గా వివిధ రకాల కటింగులు, షేవింగ్ లో చేయించుకొని తిరిగేవారు. కరోనా దెబ్బకు ఏదో తోచిన విధంగా షేవింగ్ చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కరోనా మహమ్మారి వ్యాపించినప్పటి నుంచి మన ప్రధానమంత్రి సైతం గడ్డం పెంచుకోవడం అందరిలో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ దాదాపు పది నెలల నుంచి క్షవరం, గడ్డం పెంచు కోవడం వల్ల అందరిలో పలు అనుమానాలు తలెత్తాయి.కరోనా మహమ్మారి సైతం ఏకంగా ప్రధానమంత్రి జీవనశైలిని కూడా మార్చేసింది అంటూ పలువురు కామెంట్లు చేశారు. దాదాపు పది నెలలు కావస్తున్నా ఇప్పటికీ కూడా ప్రధాన మంత్రి గడ్డం పెంచడం వెనుక రామమందిర నిర్మాణం ఉందని పలువురు తెలియజేస్తున్నారు.

గత కొన్ని నెలల క్రితం అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భూమిపూజ చేశారు. అదేవిధంగా ఆలయ నిర్మాణ బాధ్యతను పూర్తి చేసే క్రమంలో నరేంద్రమోడీ ఉన్నారని ఉడుపి పెజావర పీఠాధిపతి స్వామి విశ్వప్రసన్న తీర్థ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ విధమైన చారిత్రాత్మక నిర్మాణాలు చేపట్టే సమయంలో కేశాలు కత్తిరించరని పీఠాధిపతి తెలిపారు. ఈ తరహాలోనే నరేంద్రమోడీ కూడా జుట్టు, గడ్డం కత్తిరించుట పోవడానికి కారణం కూడా ఇదే కావచ్చని తాజాగా కర్ణాటకలోని బాగల్కోటెలో ఉడుపి పెజావర పీఠాధిపతి ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు.