సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కొన్ని యాక్షన్ సీన్లకు హీరోలు కాకుండా వారి స్థానంలో వారికి డూప్ పెట్టి యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించడం మనం చూస్తూ ఉంటాం. అయితే తాజాగా తమిళ స్టార్ హీరోలైన ఆర్య, విశాల్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో యాక్షన్ సీన్లు ఆర్య డూప్ లేకుండా యాక్షన్ సీన్ కోసం జంపింగ్ చేస్తుండగా గాయాలయ్యాయి. దీంతో చికిత్స నిమిత్తం వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆర్య, విశాల్ అటు తెలుగు, ఇటు తమిళ సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు. మొదటగా వరుడు సినిమా ద్వారా విలన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆర్య ప్రస్తుతం విశాల్ హీరోగా, ఆర్య విలన్ గా నోటా చిత్ర దర్శకుడు ఆనంద్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నారు. వీరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకు “ఎనిమీ”అనే టైటిల్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చెన్నైలో షూటింగ్ చేస్తుండగా ఆర్య ఎలాంటి డూప్ లేకుండా జంపింగ్ చేయడంతో గాయాలైనట్లు చిత్రబృందం తెలిపారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లిన తర్వాత చికిత్స పూర్తవ్వగానే తిరిగి ఆర్య షూటింగ్ లో పాల్గొన్నట్లు చిత్రబృందం తెలిపారు. అంతేకాకుండా ఆర్య అల్లు అర్జున్ తో ఇదివరకే వరుడు సినిమాలు విలన్ పాత్రలో నటించిన సంగతి మనకు తెలిసిందే, అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ “పుష్ప” సినిమాలో కూడా విలన్ పాత్ర కోసం ఆర్య ను తీసుకోవాలనే ఆలోచనలో దర్శకుడు సుకుమార్ ఉన్నారనే సమాచారం వినబడుతోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…