ఈ మధ్య కాలంలో ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా ప్రైవేట్ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్లను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఏపీఎస్ఎస్డీసీ నుంచి మరో నోటిఫికేషన్ విడుదలైంది. అమర్ రాజా గ్రూప్ కంపెనీలో 800 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల కాగా రాత పరీక్ష లేకుండా ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టనున్నారు.
అమర్ రాజా కంపెనీ ఈ నోటిఫికేషన్ ద్వారా 800 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. హెచ్ఆర్ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 10,500 రూపాయలు వేతనంగా లభిస్తుంది. కంపెనీ ఫుడ్, ట్రాన్స్ పోర్ట్, వసతి, ఇతర సదుపాయాలను ఉద్యోగాలకు ఎంపికైన వారికి కల్పిస్తారు. https://www.apssdc.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆధ్వర్యంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు శిక్షణ ఉంటుంది. శిక్షణ అనంతరం అభ్యర్థులు అమర్ రాజా సంస్థలో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలపై ఆసక్తి ఉంటే జనవరి 1వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పది ఇంటర్ పాస్ అయినవారితో పాటు ఫెయిల్ అయిన వారు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు డిప్లొమో, డిగ్రీ, బీటెక్ చదువులు మధ్యలో ఆపేసిన వారు సైతం ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రేపటి వరకు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండటంతో వీలైనంత త్వరగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే మంచిది.
ఇంట్లో తయారుచేసే ఆహారాలపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో పనీర్ తయారీ కూడా చాలా మందికి అలవాటుగా మారుతోంది. బయట దొరికే…
ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ కొత్త కొత్త డైట్ పద్ధతులు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. అందులో ఒకటి ‘వాటర్…
ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలోనే ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలతో కష్టాల్లో పడింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా…
ఇటీవలి కాలంలో చిన్నారులను ప్రభావితం చేసే అరుదైన వ్యాధులలో Spinal Muscular Atrophy (ఎస్ఎంఏ) గురించి తరచూ వార్తల్లో వినిపిస్తోంది.…
ప్రస్తుతం ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో యోగా సాధనకు మంచి ప్రాధాన్యం లభిస్తోంది. అయితే అదే సమయంలో యోగా గురించి…
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన ఫిట్నెస్, క్రమశిక్షణకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వెల్లడించారు.…