బానిస అభ్యర్థులు కావాలా? ప్రజల హక్కులు కోసం పోరాడే వ్యక్తి కావాలా?_ఈటెల

ఎవరెన్ని కుట్రలు చేసినా హుజూరాబాద్ లో విజయం తనదే అన్నారు మాజీ మంత్రి ఈటెల రాజేందర్. టిఆర్ఎస్ అభ్యర్థి ఎవరైనా సీఎం కేసీఆర్ కి బానిసేనని ఎద్దేవా చేశారు. హుజూరాబాద్‌ ఎన్నిక ఉపఎన్నిక మాత్రమే కాదని.. ఈ ఎన్నికతో ఇంకెంతమంది రాజేందర్‌లు ప్రశ్నిస్తారోనని సీఎం కేసీఆర్‌కు భయం పట్టుకుందని ఈటెల పేర్కొన్నారు.

కాగా ఉప ఎన్నికలో గెలుపు కోసం అధికార తెరాస రూ.కోట్లు ఖర్చు పెడుతోందని ఈటెల ఆరోపించారు. బానిస అభ్యర్థులు కావాలా? ప్రజల హక్కులు, ఆత్మ గౌరవం కోసం పోరాడే వ్యక్తి కావాలా? అనేది హుజూరాబాద్‌ ప్రజలే నిర్ణయిస్తారన్నారు.