ఎనిమిది నెలలుగా ఓ మైనర్ బాలికపై ఐదుగురు అత్యాచారం.. చివరకు ఆమె గర్భం దాల్చడంతో..

ఎనిమిది నెలలుగా ఓ మైనర్ బాలికపై కామాంధులు అత్యాచారం చేశారు. వారి కారణంగా బాలిక ఇటీవల గర్భం దాల్చి.. బిడ్డకు జన్మనిచ్చింది. ఆ అత్యాచారంలో తన బంధువుతో పాటు మరో నలుగురు ఉన్నారు. దీంతో ఆమె ఆ బిడ్డను బావిలో ఆ బాలిక బంధువు పడేశాడు. ఈ ఘటన మధ్య ప్రదేశ్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..కామాంధులు రెచ్చిపోతున్నారు.

వాయి వరసులు మరిచి అయిన వాళ్లపై కూడా ఏ మాత్రం కనికరంలేకుండా అత్యాచారాలకు పాల్పడతున్నారు. మధ్యప్రదేశ్ లోని గ్రామానికి చెందిన ఓ బాలిక(14) తల్లి మూడేళ్ల క్రితమే మరణించింది. ఉపాధి కోసం ఆ బాలిక తండ్రి ఇతర ప్రాంతాలకు వెళ్తుంటాడు. ఇంట్లో ఒంటరిగా ఆమె ఉంటున్న విషయాన్ని ఆమె సమీప బంధువు(21) గమనించాడు.

ఇది గమనించి ఆమెపై 8 నెలల క్రితం అత్యాచారం చేశాడు. అతడికి సంబంధించి మరో నలుగురు స్నేహితులు కూడా.. ఈ విషయాన్ని తాము మీ నాన్నకు చెబుతాం అంటూ బెదిరించి .. అత్యాచారం చేశారు. అప్పటి నుంచి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశారు. ఇటీవల ఆమె గర్భం దాల్చిన విషయం వాళ్లకు తెలవడంతో టాబ్ లెట్స్ ఇచ్చి ఆ గర్భాన్ని పోగొట్టాలని చూశారు. తీవ్ర నొప్పితో ఆమె రక్తస్రావం అయి.. బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బాలికను తమ సమీప బంధువు బావిలో పడేశాడు.

బావిలో శిశువు మృతదేహంపై పోలీసులకు సమాచారం అందడంతో మొదట బాలికను అదుపులోకి తీసుకొని విచారంచగా.. ఆమె జరిగినది అంతా చెప్పింది. ఆమెను అత్యాచారం చేసిన వారిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. ప్రధాన నిందితుడిని..అతడి స్నేహితుపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికను, అందులో ఉన్న ఇద్దరు మైనర్లను జువైనల్ హోమ్ కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.