ఇంద్రవెల్లి సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు_ సీతక్క

ఆదిలాబాద్ ఇంద్రవెల్లి సభను విజయవంతం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు ఎమ్మెల్యే సీతక్క ధన్యవాదాలు తెలియజేశారు.ఆదిలాబాద్​ జిల్లా ఇంద్రవెళ్లి సభను విజయవంతం చేసిన ప్రజలకు, నేతలకు ములుగు ఎమ్మెల్యే సీతక్క ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల వచ్చిన ప్రతిసారి తెరాస ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. హుజూరాబాద్​ ఉపఎన్నిక కోసమే సీఎం కేసీఆర్ దళిత బందు తీసుకు వచ్చారన్నారు.

కాగా గిరిజనుల పోడు భూములకు పట్టాల కోసం గత కొంత కాలంగా కాంగ్రెస్​ పార్టీ పోరాడుతోందని సీతక్క పేర్కొన్నారు. పోడు భూములకు కాంగ్రెస్​ హక్కులు కల్పించిందని చెప్పారు. ఇప్పటి వరకు ఎవరికి పట్టాలు ఇవ్వకుండా.. ఉన్న భూమిని లాక్కుంటున్న చరిత్ర కేసీఆర్​ది అని విమర్శించారు.